పార్టీ కార్యక్రమాలు

Tue, 2016-02-16 15:19

సిపిఎం కేంద్ర కార్యాలయంపై ఆర్‌ఎస్‌ఎస్‌, ఎబివిపి గూండాల దాడిని నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది. సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమాల్లో పలుచోట్ల ఇతర వామపక్ష పార్టీల నేతలు కూడా పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ప్రదర్శనలు, రాస్తారోకోలు, సంఘపరివార్‌ దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహించారు. కొన్నిచోట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు.

Mon, 2016-02-15 11:09

అభ్యుదయ, వామపక్ష శక్తులను విఛ్చిన్నం చేయటం ఆర్‌ఎస్‌ఎస్‌ తరం కాదని, పేద, ధనిక తారతమ్యాలు ఉన్నంత కాలం ఆయా శక్తులుంటాయని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు. ఢిల్లీలోని సిపిఎం కేంద్ర కార్యాలయంపై ఆర్‌ఎస్‌ఎస్‌, ఎబివిపి దాడిని నిరశిస్తూ ఆదివారం నగర పార్టీ కార్యాలయం నుండి శంకర్‌ విలాస్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ఢిల్లీలోని జెఎన్‌యు ఎంతో మంది మేధావుల్ని, దేశానికి నాయకుల్ని అందించిందన్నారు. అలాంటి వర్సీటీలో చోటు చేసుకున్న ఒక ఘటనను ఆధారం చేసుకొని అక్కడున్న అభ్యుదయ, వామపక్ష, ప్రజాతంత్ర శక్తులన్నింటినీ విచ్ఛన్నం చేయటానికి బిజెపి ప్రయత్నిస్తుందన్నారు.ఈ నేపధ్యంలోనే సిపిఎం జాతీయ కార్యాలయంపైనా దాడి జరిగిందని,...

Sun, 2016-02-14 22:10

        సిపిఎం కేంద్ర కార్యాలయంపై దాడికి నిరసనగా శ్రీకాకుళం నగరంలో సిపిఎం ఆధ్వర్యాన ఆదివారం సాయంత్రం ర్యాలీ నిర్వహించారు. నగరంలోని డేఅండ్‌నైట్‌ కూడలి నుంచి ఆర్‌టిసి కాంప్లెక్సు వరకూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి.జమలయ్య మాట్లాడుతూ సిపిఎం కేంద్రం కార్యాలయంపై దాడులను సహించేది లేదన్నారు. భవిష్యత్తులో మతోన్మాద శక్తులకు ప్రజలే ఘోరి కడతారని హెచ్చరించారు. సిపిఎం పట్టణ కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడటాన్ని ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అన్నారు. మతోన్మాద మత్తులో ఆర్‌ఎస్‌ఎస్‌, ఎబివిపి గూండాలు దాడి చేయడం హేయనీయమన్నారు. జెఎన్‌టియులో విద్యార్థులకు సిపిఎం జాతీయ ప్రధానకార్యదర్శి...

Fri, 2016-02-12 20:24

సింగ‌పూర్‌కు దాసోహమంటే స‌హించం.....వ్య‌వ‌సాయ ప‌రిర‌క్ష‌ణ జోన్‌పై అవ‌గాహ‌న లేని మంత్రులు. 
మాస్ట‌ర్‌ప్లాన్‌లో స‌మూన మార్పులు చేయ‌క‌పోతే ఐక్య ఉద్య‌మాలు.
ప్ర‌భుత్వ విధానాల‌ను ప్ర‌శ్నించిన వారిని రాజ‌ధాని వ్య‌తిరేకులా చూడ‌టం  త‌గ‌దు.

    వ్యవసాయ పరిరక్షణ జోన్ అంశంపై మంత్రులు, సిఆర్‌డిఎ అధికారులు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు.  రైతుల‌, ప్రజా  ప్రయోజనాల‌ను రక్షించాల్సిన ప్ర‌భుత్వం అబ‌ద్దాలు చెబుతూ న‌య‌వంచ‌న చేస్తోంది.  అగ్రిజోన్‌కు, గ్రీన్‌బెట్లుకు సంబంధం లేదని మంత్రులు చేస్తున్న ప్రచారారం వాస్త‌వం కాదు.  గ్రీన్‌బెల్ట్‌లో ఉన్న నిబంధనలే వ్యవసాయ పరిరక్షణ జోన్‌లో ఉన్నాయి. వాస్తవాల‌ను మరుగపర్చేందుకే మాస్టర్‌ప్లాన్‌...

Wed, 2016-02-10 19:51

విజయవాడలో  పైపుల్‌రోడ్డు ప్రాంతం నుండి సుందరయ్య వ‌ర‌కు వున్న (సుంద‌ర‌య్య నగర్‌) కట్ట మీద వున్న పేద ఇళ్లను తొగించడానికి ప్రభుత్వం హడావుడి చేస్తుందని, ఇళ్ళు ఎక్కడిస్తారో? ఎప్పుడిస్తారో? స్పష్టం చేయకుండా తొగించే ప్రయత్నాలు మానుకోవాని  బాబూరావు కోరారు.  తొల‌గింపు విషయంలో ప్రజల్లో వున్న అనుమానాను ప్రభుత్వమే నివృత్తి చేయాల‌ని  డిమాండ్ చేశారు. ఎన్నికల‌కు ముందు మేము అదికారంలోకి  వస్తే ఇళ్ళుతొగించమని, పట్టాలు ఇస్తామని చెప్పిన టి.డి.పి అధికారంలోకి రాగానే ఇళ్లను తొగించే ప్రయత్నాలు ముమ్మరం చేయడం దారుణమన్నారు.  పైగా 296 జీవో ప్రకారం అక్రమణ స్థలాల్లో వున్న వారికి రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పి, ఇళ్ళు తొగించే ప్రక్రియ చేపట్టడం పై మండిపడ్డారు. ఇప్పటికే...

Wed, 2016-02-10 19:34

పాల‌కులు అన్ని వైపుల నుండి ప్రజల‌పైన ముప్పేట దాడి చేస్తున్న నేటి తరుణంలో ప్రజల‌ను కదిలించి పోరాటాలు చేయడం ద్వారానే వాటిని ఎదుర్కొనగల‌మని సిపిఎం కృష్ణాజిల్లా కార్యదర్శి ఆర్‌.రఘు అన్నారు. ఈ రోజు ఉదయం పాల‌ఫ్యాక్టరీ వద్ద గల‌ ఆఫీసులో కార్మికనేత సిపిఎం సీనియర్‌ నాయకు కామ్రేడ్‌ పి. దివాకర్‌ గారి 12వ వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ రైతు నుండి బవంతంగా భూము గుంజుకుంటున్నారు. కార్మిక హక్కును కారాస్తున్నారు.  పట్టణాల్లో ప్రజపై భారాలు పెంచుతున్నారు. వీటికి వ్యతిరేకంగా ప్రజు సంఘటితం కాకుండా చీల్చ‌డానికి కుంపట్లు రగిలిస్తున్నారు.  ఇలాంటి పాల‌కులు ప్రజపై చేస్తున్న దాడుల‌ను ఎదుర్కొల‌నాంటే ప్రజను సమీకరించి పోరాటం చేయడం మినహా మరో మార్గం లేదన్నారు. గతంలో ఇటువంటి...

Tue, 2016-02-09 17:03

మార్చిలో జరిగే బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలో వివిధ సెక్షన్ల ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిపియం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.కృష్ణయ్య తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చి 2 సం||రాలు కావస్తున్నా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నేరవేర్చలేదని అన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో అన్ని వర్గాల ప్రజల సమస్యలను గాలికొదిలేశారన్నారు. వర్షాభావంతో రాష్ట్రంలో రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల సమస్యలు, మున్సిపల్‌ వర్కర్ల సమస్యలు పేరుకు పొయాయని, వాటిని తక్షణమే పరిక్షరించాలని కోరారు.

Mon, 2016-02-08 19:19

  అఖిపక్షం ఆధ్వర్యంలో సిఆర్‌డిఎ కార్యాయాన్ని ముట్టడిరచిన  రైతు

    కృష్ణాజిల్లాలోని గ్రామాల‌ను గ్రీన్‌జోన్‌ నుంచి మినహాయించేందుకు అఖిపక్ష నేతలు ఈ నె 29వ తేదీ వరకు ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ విధించారు. ఆలోగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని స్పష్టం చేయకపోతే విజయవాడలో సిఎం క్యాంప్‌ కార్యాయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. జల‌వనరుశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రైతు పక్షాన నిబల‌డతారో, సింగపూర్‌ కంపెనీల‌కు వత్తాసుగా ఉంటారో స్పష్టం చేయాల‌ని డిమాండు చేశారు. కృష్ణాజిల్లా మైవరం, జి కొండూరు మండలాను గ్రీన్‌జోన్‌ నుంచి తొల‌గించాంటూ రైతు రాజధాని ప్రాంత ప్రాధికారసంస్థ (సిఆర్‌డిఎ) కార్యాయాన్ని సోమవారం ముట్టడిరచారు. గ్రీన్‌జోన్‌లో చేర్చటంపై అభ్యంతరాలు...

Fri, 2016-02-05 20:15

విజ‌య‌వాడ రాజీవ్‌గాంధీ కాల‌నీలో అగ్ని ప్రమాదం జరిగి మూడు రోజులు అయియినా  అధికారులు ప‌ట్టించుకోక‌పోవ‌డంపై సి.పి.ఎం. రాష్ట్ర కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యులు శ్రీ సిహెచ్‌.బాబూరావు మండిప‌డ్డారు.  వారికి శాశ్వ‌త గౄహాలు మంజూరు చేయాల‌ని కోరారు.  
 గూడుపోయింది, నోటికాడ కూడు పోయింద‌ని బాధితుల వెల్ల‌డి.  ఘోర అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి అటు చలిలో, ఇటు ఎండల్లో తీవ్ర ఇబ్బందు పడుతూ దుర్బరంగా తయారయిన రాజీవ్‌గాంధీకానీ వాసును సిపిఎం నాయకు బృందంగా వెళ్లి పరామర్శించారు. కానీ మొత్తం ప్రతి ఇంటింటికీ తిరిగి, బాధిత ప్రజను పరామర్శిస్తూ, ప్లిు, వృద్దు, మహిళ యోగక్షేమాను అడుగుతూ, భోజనాు, ఇతర ఏర్పాట్ల పరిస్థితిపై బాబూరావు, కాశీనాథ్‌ అడిగి తొసుకుంటూ కానీ మొత్తం...

Fri, 2016-02-05 11:06

విజయనగరం జిల్లా భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాలా? వద్దా? అనే విషయమై దమ్ముం టే చంద్రబాబునాయుడు 'ప్రజాభిప్రాయ ఓటింగు' పెట్టాలని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బివి రాఘవులు సవాల్‌ విసిరారు. 'మెజార్టీ ప్రజలు ఎయిర్‌పోర్టు కావాలంటే కట్టుకోండి. లేదంటే తోకము డిచి ఎయిర్‌పోర్టు ప్రతిపాదన విరమించు కోండి' అని సూచించారు. రాష్ట్ర రాజధానికి గన్నవరం ఎయిర్‌పోర్టు సరిపోయినప్పుడు, విశాఖలో ఎయిర్‌పోర్టు ఉండగా ఇక్కడ మరొకటి ఎందుకని ప్రశ్నించారు. ఇది భోగాపురంలోని పెద్దల భూములకు ధరలు పెరగడానికి తప్ప, ప్రయాణికుల కోసమో, ప్రజల కోసమో కాదని విమర్శించారు. అభివృద్దే అనుకుంటే.. ఈ ప్రాంతంలోని మంత్రి అయ్యన్నపాత్రుడు భూములు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు....

Tue, 2016-02-02 12:06

పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురవుతున్న భూములకు సంబంధించి ఎకరాకు రూ.20 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని మాజీ ఎంపీ మిడియం బాబూరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత సంఘం ఆధ్వర్యాన ముంపు గ్రామాల్లో జరుగుతున్న పాదయాత్రను ఆయన ప్రారంభించారు. 18 ఏళ్ళల నిండిన నిర్వాసిత యువతీ యువకులకు పునరావాస ప్యాకేజీ అమలు చేయాలన్నారు. నిర్వాసితుల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించాలని కోరారు. బాధితుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, లేకుంటే రూ.5లక్షలు అదనంగా చెల్లించాలన్నారు.

Pages