పార్టీ కార్యక్రమాలు

Tue, 2016-02-23 13:05

బాబొస్తే జాబొస్తుందంటూ కల్లబొల్లిమాటలు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అడ్డం తిరిగారు.. బాబుకేమో వాస్తవంగా జాబొచ్చింది.. ఇక్కడ ఎంఎల్‌ఏగా ఓడిపోయిన ముద్దుకృష్ణమనాయుడుకీ ఎంఎల్‌సిగా చోటు దక్కింది.. జాబ్‌ ఇస్తారని నమ్మి ఓటేసిన జనానికేమో కష్టాలొచ్చాయి' అంటూ వామపక్ష నాయకులు ఉద్ఘాటించారు. రాయలసీమ బస్సు యాత్రకు మూడో రోజు చిత్తూరు జిల్లాలో అడుగడుగునా ఆదరణ లభించింది. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కందారపు మురళి మాట్లాడుతూ ఈ ప్రాంతానికి గాలేరు-నగరి వస్తే తప్ప ఇక్కడ ప్రజల మనుగడ సాధ్యం కాదన్నారు. కండలేరు తాగునీటి పథకాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి తీసుకొస్తే జిల్లావాసిగా ఉండి చంద్రబాబు రద్దు చేయడం ఈ ప్రాంతం పట్ల ఎంత వివక్ష చూపిస్తున్నారో అర్ధమవుతుందన్నారు...

Mon, 2016-02-22 11:59

రాయలసీమ ప్రాజెక్టుల గురించి స్పష్టంగా చెప్పకపోవడాన్ని వామపక్షాల నేతలు తీవ్రంగా తప్పుపట్టారు.మదనపల్లి బస్టాండులో ఏర్పాటు చేసిన సభలో సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ.. వచ్చే నాలుగేళ్లలో ప్రాధాన్యతా ప్రాజెక్టుల పూర్తికి రూ.20 వేల కోట్ల వరకూ ఖర్చువుతుందని ముఖ్యమంత్రి శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారని, అయితే గాలేరు నగరి, హంద్రీ నీవా ప్రాజెక్టులకు వచ్చే బడ్జెట్‌లో ఎంత కేటాయిస్తారో స్పష్టం చేయలేదని విమర్శించారు. ప్రాజెక్టుల మొదటి దశ, రెండో దశ పనులను ఆగస్టు నాటికి పూర్తి చేస్తామంటూ డొంక తిరుగుడుగా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.అభివృద్ధి ముసుగులో ముఖ్యమంత్రి.. అమరావతి అభివృద్ధిని మాత్రమే కాంక్షిస్తూ, వెనుకబడిన...

Sun, 2016-02-21 20:27

ఇప్ప‌టికైనా తెలుగుదేశం ఎం.ఎల్.ఏల‌కు జ్ఞానోద‌యం మ‌యింది.....
నిజంగా చిత్త‌శుద్ది వుంటే మాస్టర్‌ప్లాన్ స‌మూలంగా మార్చాల‌ని నేరుగా ముఖ్య‌మంత్రికి చెప్పాలి .
                                                                      - సిహెచ్‌.బాబూరావు డిమాండ్ 
   సి.ఆర్‌.డి.ఏ మాస్ట‌ర్‌ప్లాన్‌పై ప్ర‌జాప్ర‌తినిధులతో అధికారులు జ‌రిగిన  స‌మావేశంలో తెలుగుదేశం పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు కూడా మాస్ట‌ర్‌ప్లాన్‌పై అభ్యంత‌రాలు చెప్పారు. మార్పులు చేయాల్సిన అవ‌సరం వుంద‌ని  స‌మావేవంలో అధికారుల‌కు తెలప‌డం జ‌రిగింది. ప‌ది నెల‌ల త‌రువాత అధికా పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులకు జ్ఞానోద‌యం అయినందుకు సంతోషం. ఇప్ప‌టి వ‌ర‌కు సి.ఆర్‌.డి.ఏ. ప్లాన్‌లో మార్పులు...

Sat, 2016-02-20 20:07

2016-17 విఎంసి భారాల బడ్జెట్‌ 
టాక్స్‌లు, పన్నుల రూపంలో రూ. 100 కోట్లు ప్ర‌జ‌ల‌పై భారాలు.
అభివృద్ది పనుల్లో... సంక్షేమ కార్యక్రమాల్లో కోత .. పేద వాడల పట్ల బడ్జెట్‌లో  వివక్షత  అధికార టిడిపి వైఖరికి 
బడ్జెట్‌లో  సవరణలు చేయాలి. -  సి.పి.ఎం. న‌గ‌ర కార్య‌ద‌ర్శి దోనేపూడి కాశీనాధ్‌ వ్లెల‌డి

Sat, 2016-02-20 16:42

సీమ ప్రజల తరపున కేంద్రానికి తమ వాణి వినిపించేందుకు సిపిఐతో కలిసి సిపిఎం బస్సుయాత్ర నిర్వహించేందుకు సిద్ధమైంది. నేడు తిరుపతిలో యాత్ర ప్రారంభమై మార్చి 5 వరకు సీమలోని నాలుగు జిల్లాల్లో కొనసాగుతుంది. నాలుగు జిల్లాల్లోనూ సిపిఎం, సిపిఐ నేతలు పర్యటిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తారు. ఇదే స్ఫూర్తితో మార్చి 11న చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించనున్నారు. సీమకు ప్రత్యేక ప్యాకేజీ, హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్ట్‌ల పూర్తి, కడపలో ఉక్కు కర్మాగారం తదితర హామీలు ఏమయ్యాయో ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. ఆయా హామీలు ఎందుకు ముందుకు సాగడం లేదో వివరించనున్నారు.

Thu, 2016-02-18 20:31

రాజధానిలో భూ కుంభకోణాను ప్రభుత్వం చట్టబద్ధం చేస్తోంది.  పేద‌ల‌ను న‌ట్టేట ముంచి పెద్ద‌ల‌కు దోచిపెట్టేందుకు ప్ర‌భుత్వం పూనుకుంది. లంక‌భూముల వ్య‌వ‌హారంలో బ‌హిర్గ‌త‌మయింది.  అసైన్డ్‌, లంక, ఫారెస్ట్‌ భూములు అమ్మడానికి వీల్లేదని చెప్పి దళితులు, పేదల‌ను భయపెట్టి పెద్దలు భూము కొనుగోలు చేశారు.  న‌ష్ట‌పరిహారం కూడా ఇవ్వబోమని చెప్పడంతో పేదలు భయపడి భూముల‌ను తక్కువ ధరకు అమ్ముకున్నారు.  కొనుగోళ్లు పూర్త‌యిన త‌రువాత  జిఓ నెంబరు 41 విడుదల చేసి వాటిని చట్టబద్ధం చేసి పెద్ద‌ల‌కు ప్ర‌భుత్వం ప్ర‌త్య‌క్షంగా తోడ్ప‌డింది. ద‌ళితుకు న్యాయం చేయానే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే ఈ జీవో గత ఏడాది ఏప్రిల్‌, మార్చిలోనే  ఇవ్వాలి. కాని  ప్ర‌భుత్వం ఆ విధంగా చేయ‌లేదు. పేద‌ల వ‌...

Tue, 2016-02-16 15:19

సిపిఎం కేంద్ర కార్యాలయంపై ఆర్‌ఎస్‌ఎస్‌, ఎబివిపి గూండాల దాడిని నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది. సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమాల్లో పలుచోట్ల ఇతర వామపక్ష పార్టీల నేతలు కూడా పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ప్రదర్శనలు, రాస్తారోకోలు, సంఘపరివార్‌ దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహించారు. కొన్నిచోట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు.

Mon, 2016-02-15 11:09

అభ్యుదయ, వామపక్ష శక్తులను విఛ్చిన్నం చేయటం ఆర్‌ఎస్‌ఎస్‌ తరం కాదని, పేద, ధనిక తారతమ్యాలు ఉన్నంత కాలం ఆయా శక్తులుంటాయని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు. ఢిల్లీలోని సిపిఎం కేంద్ర కార్యాలయంపై ఆర్‌ఎస్‌ఎస్‌, ఎబివిపి దాడిని నిరశిస్తూ ఆదివారం నగర పార్టీ కార్యాలయం నుండి శంకర్‌ విలాస్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ఢిల్లీలోని జెఎన్‌యు ఎంతో మంది మేధావుల్ని, దేశానికి నాయకుల్ని అందించిందన్నారు. అలాంటి వర్సీటీలో చోటు చేసుకున్న ఒక ఘటనను ఆధారం చేసుకొని అక్కడున్న అభ్యుదయ, వామపక్ష, ప్రజాతంత్ర శక్తులన్నింటినీ విచ్ఛన్నం చేయటానికి బిజెపి ప్రయత్నిస్తుందన్నారు.ఈ నేపధ్యంలోనే సిపిఎం జాతీయ కార్యాలయంపైనా దాడి జరిగిందని,...

Sun, 2016-02-14 22:10

        సిపిఎం కేంద్ర కార్యాలయంపై దాడికి నిరసనగా శ్రీకాకుళం నగరంలో సిపిఎం ఆధ్వర్యాన ఆదివారం సాయంత్రం ర్యాలీ నిర్వహించారు. నగరంలోని డేఅండ్‌నైట్‌ కూడలి నుంచి ఆర్‌టిసి కాంప్లెక్సు వరకూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి.జమలయ్య మాట్లాడుతూ సిపిఎం కేంద్రం కార్యాలయంపై దాడులను సహించేది లేదన్నారు. భవిష్యత్తులో మతోన్మాద శక్తులకు ప్రజలే ఘోరి కడతారని హెచ్చరించారు. సిపిఎం పట్టణ కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడటాన్ని ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అన్నారు. మతోన్మాద మత్తులో ఆర్‌ఎస్‌ఎస్‌, ఎబివిపి గూండాలు దాడి చేయడం హేయనీయమన్నారు. జెఎన్‌టియులో విద్యార్థులకు సిపిఎం జాతీయ ప్రధానకార్యదర్శి...

Fri, 2016-02-12 20:24

సింగ‌పూర్‌కు దాసోహమంటే స‌హించం.....వ్య‌వ‌సాయ ప‌రిర‌క్ష‌ణ జోన్‌పై అవ‌గాహ‌న లేని మంత్రులు. 
మాస్ట‌ర్‌ప్లాన్‌లో స‌మూన మార్పులు చేయ‌క‌పోతే ఐక్య ఉద్య‌మాలు.
ప్ర‌భుత్వ విధానాల‌ను ప్ర‌శ్నించిన వారిని రాజ‌ధాని వ్య‌తిరేకులా చూడ‌టం  త‌గ‌దు.

    వ్యవసాయ పరిరక్షణ జోన్ అంశంపై మంత్రులు, సిఆర్‌డిఎ అధికారులు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు.  రైతుల‌, ప్రజా  ప్రయోజనాల‌ను రక్షించాల్సిన ప్ర‌భుత్వం అబ‌ద్దాలు చెబుతూ న‌య‌వంచ‌న చేస్తోంది.  అగ్రిజోన్‌కు, గ్రీన్‌బెట్లుకు సంబంధం లేదని మంత్రులు చేస్తున్న ప్రచారారం వాస్త‌వం కాదు.  గ్రీన్‌బెల్ట్‌లో ఉన్న నిబంధనలే వ్యవసాయ పరిరక్షణ జోన్‌లో ఉన్నాయి. వాస్తవాల‌ను మరుగపర్చేందుకే మాస్టర్‌ప్లాన్‌...

Wed, 2016-02-10 19:51

విజయవాడలో  పైపుల్‌రోడ్డు ప్రాంతం నుండి సుందరయ్య వ‌ర‌కు వున్న (సుంద‌ర‌య్య నగర్‌) కట్ట మీద వున్న పేద ఇళ్లను తొగించడానికి ప్రభుత్వం హడావుడి చేస్తుందని, ఇళ్ళు ఎక్కడిస్తారో? ఎప్పుడిస్తారో? స్పష్టం చేయకుండా తొగించే ప్రయత్నాలు మానుకోవాని  బాబూరావు కోరారు.  తొల‌గింపు విషయంలో ప్రజల్లో వున్న అనుమానాను ప్రభుత్వమే నివృత్తి చేయాల‌ని  డిమాండ్ చేశారు. ఎన్నికల‌కు ముందు మేము అదికారంలోకి  వస్తే ఇళ్ళుతొగించమని, పట్టాలు ఇస్తామని చెప్పిన టి.డి.పి అధికారంలోకి రాగానే ఇళ్లను తొగించే ప్రయత్నాలు ముమ్మరం చేయడం దారుణమన్నారు.  పైగా 296 జీవో ప్రకారం అక్రమణ స్థలాల్లో వున్న వారికి రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పి, ఇళ్ళు తొగించే ప్రక్రియ చేపట్టడం పై మండిపడ్డారు. ఇప్పటికే...

Pages