ఆక్వారంగం,వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర స్ధాయి సదస్సు భీవరంలో టౌన్రైల్వేస్టేషన్ వద్ద ఉన్న రైస్మిల్లర్స్ ఆసోషియేషన్ హాలో మద్యాహ్నం 3గంటలకు సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అద్యక్షతన ప్రారంభమైంది. ఈ సదస్సుకు ప్రముఖ రాష్ట్ర రైతు నాయకులు శ్రీ వై.కేశవరావుగారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాంగారు హాజరైయ్యారు.
ఈ సందర్భంగా వై.కేశవరావుగారు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో వరి,ఆక్వాతో సహా అన్ని పంటల రైతులు చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. దేశానికి అతూ,ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. స్వామినాధన్ కమీషన్ సిఫార్సు ప్రకారం ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50శాతం కలిపి పంటలకు మద్ధతు ధరలు నిర్ణయిస్తామని...