పార్టీ కార్యక్రమాలు

Mon, 2023-10-30 17:13

 ఆక్వారంగం,వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర స్ధాయి సదస్సు భీవరంలో టౌన్‌రైల్వేస్టేషన్‌ వద్ద ఉన్న రైస్‌మిల్లర్స్‌ ఆసోషియేషన్‌ హాలో మద్యాహ్నం 3గంటలకు సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అద్యక్షతన ప్రారంభమైంది. ఈ సదస్సుకు ప్రముఖ రాష్ట్ర రైతు నాయకులు శ్రీ వై.కేశవరావుగారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాంగారు హాజరైయ్యారు.

ఈ సందర్భంగా వై.కేశవరావుగారు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో  వరి,ఆక్వాతో సహా అన్ని పంటల రైతులు చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. దేశానికి అతూ,ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. స్వామినాధన్‌ కమీషన్‌ సిఫార్సు  ప్రకారం ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50శాతం కలిపి పంటలకు మద్ధతు ధరలు నిర్ణయిస్తామని...

Sat, 2023-10-28 14:11

బిజెపి అనుసరిస్తోన్న తప్పుడు విధానాల వల్ల దేశంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుందని, దానిని రాష్ట్ర ప్రభుత్వం సమర్ధిస్తుందని, ఇదే జరిగితే దేశ ప్రజలు దివాలా తీస్తారని, ఆర్ధిక భారాలతో విలవిల్లాడుతారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో, దేశంలో అసమానతలు లేనటువంటి అభివృద్ధి సాధించాలన్న నినాదంతో ప్రజలను సమీకరించాలని సిపిఎం భావించిందని, ఆ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరులోని డాక్టర్‌ జెట్టిశేషారెడ్డ్డి విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు వి.ఉమామహేశ్వరావు...

Sat, 2023-10-28 14:08

 

సరళీకరణ ఆర్థిక విధానాలను అవలంభిస్తూ, పట్టణ ప్రజలపై మోయలేని భారాలు మోపుతూ కార్పొరేట్లకు దోచిపెడుతున్న ప్రధాని మోడీ గద్దె దిగితేనే పట్టణాలు బాగుపడతాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు అన్నారు. బిజెపి సర్కారును రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు నమ్ముకుంటే మునిగిపోక తప్పదని హెచ్చరించారు. 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, సంస్కరణలు - పట్టణ ప్రజలపై దుష్ప్రభావాలు' అనే అంశంపై విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్థాయి సదస్సు శుక్రవారం జరిగింది. సిపిఎం కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు అధ్యక్షతన జరిగిన సదస్సులో బాబూరావు ముఖ్య అతిథిగా పాల్గని మాట్లాడారు. చెత్త, ఆస్తి పన్ను, విద్యుత్‌ ఛార్జీల...

Fri, 2023-10-20 10:25

పండ్ల తోటల రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రోత్సాహమూ అందించకుండా అత్యంత నిర్లక్ష్య ధోరణిని అవలంభిస్తున్నాయని రైతు సంఘం నాయకులు అన్నారు. పండ్ల తోటల రైతుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో గురువారం రాష్ట్ర సదస్సు జరిగింది. పండ్ల తోటల రైతు సంఘం జిల్లా అధ్యక్షులు శివారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌ రెడ్డి, రైతు సంఘం రాష్ట్ర నాయకులు వి.రాంభూపాల్‌ ముఖ్య అతిథులుగా పాల్గని మాట్లాడారు. రాష్ట్రంలో 19 రకాల పండ్లు, 23 రకాల కూరగాయలు, తొమ్మిది రకాల సుగంధ ద్రవ్యాల పంటలను రైతులు సాగు చేస్తున్నారని తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో వీటి సాగు మరింత...

Fri, 2023-10-20 10:23

- డేటా సేకరణ కోసమే స్మార్ట్‌ మీటర్లు
- ప్రీపెయిడ్‌తో వ్యవసాయ పంపుసెట్లకు ఆటంకం
ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి:కార్పొరేట్‌ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే విద్యుత్‌ సంస్కణలను అమలు చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు అన్నారు. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు ద్వారా వినియోగదారులు ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్‌ వస్తు సామగ్రి డేటాను సేకరించి ప్రయివేటు వ్యక్తులకు కట్టబెడతారని తెలిపారు. 'విద్యుత్‌ సంస్కరణలు - ప్రజలపై భారాలు' అన్న అంశంపై విజయనగరంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో సిపిఎం విజయనగరం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అధ్యక్షతన రాష్ట్ర సదస్సు గురువారం...

Fri, 2023-10-20 10:22

 

- రాజకీయ పార్టీలు బిజెపి వైపా? ప్రజాస్వామ్యం వైపో తేల్చుకోవాల

బిజెపి తొమ్మిదేళ్ల పాలనలో దేశంలో, రాష్ట్రంలో మైనార్టీలపై దాడులు ఎక్కువయ్యాయని ఈ దాడులను కాంగ్రెస్‌, వైసిపి, టిడిపి, జనసేన రాజకీయ పార్టీలు ఖండించలేదని, మైనార్టీలకు అండగా, వారి హక్కుల సాధనకు సిపిఎం కట్టుబడి పనిచేస్తోందని మాజీ పార్లమెంట్‌ సభ్యులు, సిపిఎం సీనియర్‌ నాయకులు పి.మధు అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్ర ప్రాంగణంలో మైనార్టీ రాష్ట్ర సదస్సును గురువారం నిర్వహించారు. మైనార్టీ రాష్ట్ర నాయకులు మహమ్మద్‌ చిష్టి అధ్యక్షతన ఈ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. మైనార్టీల జోలికి వస్తే బిజెపి పతనం...

Sun, 2023-10-15 19:51

ఏళ్లు గడుస్తున్నా దళితులపై ఆగని వివక్ష
 

- పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
- మోడీ పాలనలో ప్రమాదంలో భారత రాజ్యాంగం
- రాష్ట్ర దళిత సదస్సులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి :స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు గడుస్తున్నా నేటికీ దళితులు కుల వివక్షను ఎదుర్కొంటున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. బిజెపి అధికారంలోకొచ్చిన తర్వాత అగ్రకుల దురహంకారులు, మనువాదులు మరింత పేట్రేగిపోతున్నారని, ఈ తరుణంలో దళితుల సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటమే...

Pages