ప్రజాసమస్యల పరిష్కారానికి ఛలో అసెంబ్లీ..

మార్చిలో జరిగే బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలో వివిధ సెక్షన్ల ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిపియం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.కృష్ణయ్య తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చి 2 సం||రాలు కావస్తున్నా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నేరవేర్చలేదని అన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో అన్ని వర్గాల ప్రజల సమస్యలను గాలికొదిలేశారన్నారు. వర్షాభావంతో రాష్ట్రంలో రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల సమస్యలు, మున్సిపల్‌ వర్కర్ల సమస్యలు పేరుకు పొయాయని, వాటిని తక్షణమే పరిక్షరించాలని కోరారు.