August

కార్పొరేట్లకు ఆదివాసీ భూములా?

దేశంలో కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టేందుకు ఆదివాసీల భూములే దొరికాయా అని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకారత్‌ ప్రశ్నించారు. బుధవారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో త్రిపుర ఎంపి జితేంద్ర చౌదరి అధ్యక్షతన ఆదివాసీి అధికార్‌ సంఘర్ష్‌ జాతీయ సమ్మేళనం జరిగింది. గిరిజన విద్యార్థుల సంబంధించి విద్య, గిరిజన యువతకి సంబంధించి ఉపాధి కల్పన, జాతీయ వనరులు ఆదివాసులవేనని, ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌కు సంబంధించి మూడు తీర్మానాలను సదస్సు ఆమోదించింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న బృందా కారత్‌ మాట్లాడుతూ, దేశంలో మోడీ గద్దెనెక్కేనాటి నుండి ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజల నడ్డి విరుస్తున్నారని ధ్వజమెత్తారు.

బుల్లెట్ రైళ్లా..! :CPM

రైల్వే ప్రయాణీకులకు కావల్సింది బుల్లెట్‌ రైళ్లు కాదని, ప్రయాణంలో వారికి భద్రత కల్పించాలని అని సిపిఎం పొలిట్‌బ్యూరో కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికింది. మంగళవారం అర్ధరాత్రి మధ్యప్రదేశ్‌లోని జరిగిన జంట రైలు ప్రమాదాలపై పొలిట్‌బ్యూరో దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. రైల్వేలలో తరచు జరుగుతున్న ఈ ప్రమాదాలలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నా రైల్వే శాఖ పరిస్థితులపైన, భద్రతా ప్రమాణాలపైన ప్రభుత్వం ఇంకా కళ్లు తెరవటం లేదని, షరామామూలుగా భద్రతా కమిషనర్‌తో కంటితుడుపు దర్యాప్తునకు ఆదేశాలుజారీ చేసిందని విమర్శించింది.

సమర్థనీయం కాదు..

ఉన్నత పదవుల్లో అవినీతిపై చర్య తీసుకోవాలని పట్టుబట్టినందుకు పాతికమంది కాంగ్రెస్‌ ఎంపీలను పార్లమెంటు నుంచి అయిదు రోజులపాటు గెంటివేసిన స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ చర్య ఏ విధంగానూ సమర్థనీయం కాదు. ఇందిర ఎమర్జెన్సీకి 40 ఏళ్లు గడిచిన సందర్భంలోనే దేశంలో మోడీ ఏలుబడిలో మళ్లీ అటువంటి నిరంకుశ పోకడలు వ్యక్తమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సభ్యులు ఉద్దేశపూర్వకంగానే సభకు అంతరాయం కలిగించారని, అందుకే నిబంధనల ప్రకారం వారిపై చర్య తీసుకోవాల్సి వచ్చిందని స్పీకర్‌ తన చర్యను సమర్థించుకున్నారు. స్పీకర్‌ చెప్పిందే వాస్తవమైతే మొదట వేటు ప్రభుత్వంపై పడాలి. ఎందుకంటే సభ సజావుగా సాగకపోవడానికి ప్రభుత్వమే అసలు ముద్దాయి.

అణు ఒప్పందం-ప్రతికూల పర్యవసానాలు

భారత్‌-అమెరికా అణు ఒప్పందాన్ని 2005 జులై 18న ప్రకటించారు. ఇప్పటికి పదేళ్ళు గడిచింది. ప్రారంభం నుంచీ సిపిఎం, ఇతర వామపక్షాలు ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూనే వచ్చాయి. అప్పటి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం అమెరికాతో పెట్టుకోవాలనుకున్న విస్తృత శ్రేణి వ్యూహాత్మక పొత్తులో ఇది కీలక భాగంగా వామపక్షాలు భావించాయి. ఈ ఒప్పందంలోని ప్రతి అంశం పట్ల వామపక్షాలు ప్రదర్శించిన వ్యతిరేకత పదేళ్ళ తర్వాత కూడా వాస్తవమేనని రుజువైంది.
బూటకపు వాదనలు

జ్యూట్ మిల్ కార్మికులకు అండగా..

గుంటూరులో బజరంగ్ జ్యూట్ మిల్లు కార్మికుల ఆందోళనకు సిపిఎం అండగా ఉంటుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. ఆందోళన చేస్తున్న కార్మికుల దీక్షా శిబిరాన్నిసందర్శించి మద్దతు తెలిపారు.ఈ సందర్బంగా మధు మాట్లాడుతూ యాజమాన్యం కార్మికుల డిమాండ్లను పరిగణలోనికి తీసుకోని వారి జీవనోపాధికి సంబందించిన జ్యూట్ మిల్లును వెంటనే తిరిగి ప్రారంభించాలని కోరారు. 

ఎస్సీ,ఎస్టీ చట్ట సవరణ..

జంతు కళేబరాలు, మనుషుల మృతదేహాలను తరలించాలనిగానీ... పారిశుధ్య పని (మానన్యువల్‌ స్కావెంజింగ్‌) చేయాలని గానీ ఎస్సీ, ఎస్టీలపై ఒత్తిడి చేస్తే కఠిన చర్యలు తప్పవు! ఈ దిశగా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో కేంద్ర ప్రభుత్వం పలు సవరణలు తీసుకొచ్చింది. మంగళవారం లోక్‌సభలో విపక్ష సభ్యులు లేకుండానే... ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ బిల్లు-2014 మూజువాణీ ఆమోదం పొందింది. దీని ప్రకారం... ఎన్నికల్లో ఫలానా వారికి ఓటు వేయాలనిగానీ, ఓటు వేయొద్దని కానీ ఒత్తిడి తెచ్చినా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు పెట్టవచ్చు. అంతేకాదు...

ఆశారాం జీవితం పాఠ్యాంశమా!

పాఠ్యాంశాల్లో హిందూత్వాన్ని చొప్పించొద్దని స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌టిఎఫ్‌ఐ) జాతీయ కార్యదర్శి సి.ఎన్‌. బారతి సూచించారు. మంగళవారం పార్లమెంట్‌లో ఎస్‌టిఎఫ్‌టి ఉపాధ్యక్షులు ఎన్‌.నారాయణతో కలసి ఆయన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీని కలిసి రెండు వినతి పత్రాలను సమర్పించారు. నూతన విద్యా విధానం-2015పై ఎస్‌టిఎఫ్‌ఐ సూచనలు, అభిప్రాయలను తీసుకోవాల్సిన మార్పులు ఆమెకు వివరించారు. అనంతరం ఆయన ఎపి భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ...మోడీ అధికారం చేపట్టిననాటి నుండి విద్య కాషాయీకరణ అమలుకు విధానాలను రూపొందిస్తున్నారని విమర్శించారు.

సస్పెన్షన్‌పై రాజ్యసభలోరబస

 పార్లమెంటు వర్షాకాల సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే దిశలో నడుస్తున్నాయి. 25 మంది కాంగ్రెస్ సభ్యులపై వేటువేస్తూ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు మంగళవారం రాజ్యసభను పూర్తిగా స్తంభింపచేశారు. ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన సభ పనె్నండు గంటల సమయంలో ఆరు నిమిషాలసేపు వాయిదా అనంతరం సమావేశమై కేవలం మూడు నిమిషాల మాత్రమే జరిగి రెండు గంటలకు వాయిదాపడింది. రెండు గంటలకు తిరిగి సమావేశమై ఐదు నిమిషాల పాటు పెద్దపెట్టున జరిగిన కాంగ్రెస్ నినాదాలకు సాక్షిగా నిలిచింది. ఆ తర్వాత బుధవారానికి వాయిదా పడిపోయింది.

ద్రవ్యోల్బణం బయపెడుతోంది..

ప్రస్తుత పరిస్థితులలో ఆర్థిక వ్యవస్థలో సర్దుబాటు వైఖరిని నిర్వహించేందుకు వడ్డీరేట్ల కోతల జోలికి పోలేదని రాజన్‌ అన్నారు. గతంలో చేసిన వడ్డీకోతల ఫలితాలను బ్యాంకులు పూర్తిస్థాయిలో ప్రజలకు అందించకపోవడం, ఆహార ధరలు, అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీరేట్లను సాధారణీకీరణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని భవిష్యత్తులో వడ్డీరేట్లను తగ్గించనున్నట్లుగా ఆయన తెలిపారు. ఆహార, ఇంధన ధరలను మినహాయించిన ద్రవ్యోల్బణం మరింతగా బలపడుతుండడం చింతించాల్సి అంశాలుగా ఉన్నాయన్నారు.

Pages

Subscribe to RSS - August