GSTపై సందేహలు:ఏచూరి

జీఎస్టీ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన విధానంపై. సీపీఎం అసంతృప్తి వ్యక్తం చేసింది. బిల్లుపై అనేక సందేహాలున్నాయని... వాటికి సమాదానాలు చెప్పకుండానే.. బిల్లును ఎలా పాస్‌ చేయించుకుంటారని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రశ్నించారు. ఈమేరకు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కీలకమైన బిల్లులపై సాదారణంగా సభలో చర్చ జరగటం ఆనవాయితీ అని... ఆ తర్వాత బిల్లును ప్రవేశపెడతారని గుర్తు చేశారు. జీఎస్ టీ బిల్లు విషయంలో సంప్రదాయలు పక్కనపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.