మధు అరెస్ట్ పై ఆందోళన..

సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి మధు అరెస్టుకి నిరసనగా విజయవాడలో చంద్రబాబు దిష్టి బొమ్మను సిపిఎం కార్యకర్తలు దహనం చేశారు. పోలంకి గ్రామంలో పవర్ ప్లాంట్ నిర్వాసితుల సమస్యలు తెలుపుకోవడం కూడా ఆంధ్రప్రదేశ్ లో తప్పుగా చంద్రబాబు భావిస్తున్నట్లు ఉన్నాడని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న వాళ్లపై చంద్రబాబు నిరంకుశంగా వ్యవహారిస్తున్నాడని అన్నారు.