August

త్వరలో పోలకిలో పర్యటన: మధు

శ్రీకాకుళం జిల్లా పోలాకి ధర్మల్ విద్యుత్ కేంద్ర ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలని, ప్రజా ఉద్యమాలపై నిర్భంధాన్ని ఖండించాలని శ్రీకాకుళంలోని ఎన్జీఓ హోంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ ధర్మల్ ప్లాంట్ల ఏర్పాటుతో ఉపాధి కలగకపోగా రైతులకు , వ్యవసాయ కూలీలకు వున్నా ఉపాధి పోతోందని ఆవేదన వ్యక్తం చేసారు .. అభివృద్ధి పేరుతొ రైతుఅల్ నోట్లో మట్టి కొట్టాలని చుస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని ,త్వరలో పోలకిలో పర్యటిస్తామని అన్నారు. 

సూర్యకాంత మిశ్రా కాన్వారుపై తృణమూల్‌ దాడి..

హౌరా జిల్లాలో గురువారం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లిన అసెంబ్లీ ప్రతిపక్ష నేత, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి డా.సూర్యకాంత మిశ్రాపై అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ గూండాలు పట్టపగలు దాడికి తెగబడ్డారు. రాజాపూర్‌ ప్రాంతంలో డా.మిశ్రా కారును అడ్డుకున్న తృణమూల్‌ గూండాలు ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. ఆయన్ను అనుసరిస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి విప్లవ్‌ మజుందార్‌, మీడియా ప్రతినిధులు వున్న వాహనాలను కూడా వారు ధ్వంసం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలైన జగత్‌వల్లభ్‌పూర్‌, అమ్‌తా, ఉదరు నారాయణ్‌పూర్‌ తదితర ప్రాంతాలలో ప్రజలను పరామర్శించేందుకు మిశ్రా గురువారం అక్కడికి వెళ్లారు.

ప్రమాదకర పట్టణ సంస్కరణలు..

కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య పట్టణాలకు ర్యాంకులు ఇస్తోంది. పరిశుభ్రతలో మన రాష్ట్రంలోని నగరాలు దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే వెనుకంజలో ఉన్నాయని ప్రకటించారు. కేంద్ర పథకాలలో ఎంపిక చేయడానికి మన రాష్ట్రంలోని నగరాల మధ్య పోటీపెట్టి స్మార్ట్‌ నగరాలను గుర్తించారు. ఏ పట్టణాలలో దోమల సైజు ఎక్కువగా ఉంది?(దోమలు ఈగల సైజుకు మారుతున్నాయి). చెత్తకుప్పలు ఏ నగరంలో ఎక్కువగా పేరుకుని ఉన్నాయి? మంచినీరు ఎన్ని రోజులకొకసారి ఇస్తున్నారు? పన్నులు ఏ పట్టణంలో ఎక్కువగా ఉన్నాయి? పై అర్హతలు పెడితే మన పట్టణాలు మొదటి ర్యాంకుల్లో ఉంటాయి. తెలుగుదేశం, బిజెపి పాలనలో ఏ పట్టణం చూసినా ఏమున్నది గర్వకారణం?

ఉక్కుఫ్యాక్టరీ కోసం CPM..

ఉక్కఫ్యాక్టరీ తరలింపు నిర్ణయంపై సోమవారం కడప జిల్లాలో నిరసన వ్యక్తమైంది. సోమవారం ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారు. విమానాశ్రయం గేటు ఎక్కిలోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను బలవంతంగా అరెస్టు చేసి వల్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

పనికిరాని నిబంధనలతో పంచాయతీ ఎన్నికలా? సిపిఎం

రోహతక్‌: పంచాయతీ రాజ్‌ సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులకు విద్యార్హతలతో సహా పలు అంశాల్లో నిబంధనల్ని కఠినతరం చేస్తూ హర్యానా ప్రభుత్వం తీసుకున్న చర్యలను సిపిఎం రాష్ట్ర శాఖ ఒక బుధవారం ఒక ప్రకటనలో ఖండించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న కొత్త నిబంధనలు పూర్తి అప్రజాస్వామికమని సిపిఎం వ్యాఖ్యానిం చింది. పంచాయతీరాజ్‌ సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులకు కనీస విద్యార్హతగా మెట్రిక్యులేషన్‌ను నిర్ణయించింది. 

స్మార్ట్‌ సిటీ: ప్రజాస్వామ్యం శూన్యం

''స్మార్ట్‌ సిటీ'' ఇది అత్యంత ఆకర్షణీయమైన పేరు. భ్రమలకు వేదిక. ఆకాశాన్నంటే భవంతులు, విశాలమైన రోడ్లు, రయ్యిన దూసుకు వెళ్ళే కార్లు, మెట్రో రైళ్ళు, ఆఫీసులకు వెళ్ళకుండా ఇంట్లోకూర్చునే ఏ పనైనా సమకూర్చుకునే విధంగా పధ్ధతులు, అందమైన పార్కులు, నీటి ఫౌంటైన్లు, ఈత కొలనులూ, పచ్చటి చెట్లు, జిగేల్‌ మనే లైట్లు- 'వావ్‌' ఎంత అందమైన నగరం. ఇలాంటి నగరం కావాలని ఎవరికి మాత్రం ఉండదూ? ఇవన్నీ స్మార్ట్‌ సిటీలో ఉంటాయని చాలామంది భావిస్తున్నారు. నిజంగా ఇవన్నీ స్మార్ట్‌ సిటీలో ఉంటాయా లేక స్మార్ట్‌ సిటీ అన్న భ్రమలో మరేమైనా జరగబోతోందా?

OROPపై మోడీ నోరువిప్పాలి:బృందా

ఒకే ర్యాంక్‌, ఒకే పెన్షన్‌ (ఒఆర్‌ఒపి) విధానం అమలుపై ప్రధాని మోడీ నోరు విప్పాలని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందా కారత్‌ డిమాండు చేశారు. ఒన్‌ ర్యాంక్‌, ఒన్‌ పెన్షన్‌ అమలు చేయాలని డిమాండు చేస్త జంతర్‌ మంతర్‌ వద్ద సోమవారం నుంచి ఇద్దరు మాజీ సైనికోద్యోగులు నిరవధిక నిరాహారదీక్షకు దిగారు. గత అనేక నెలలుగా మాజీ సైనికోద్యోగులు చేస్తున్న ఆందోళనకు సిపిఎం తరపున సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంఘీభావం ప్రకటించారు. ఇప్పుడు పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందా కారత్‌ కూడా వీరికి సంఘీభావం తెలిపారు. తమకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బృందా కారత్‌ను మాజీ సైనికోద్యోగులు స్వాగతం పలికారు.

Rss గుప్పిట విద్యాసంస్థలు..

దేశంలోని విద్యాసంస్థలను ఆరెస్సెస్‌ తన గుప్పిట బంధించిందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. గజేంద్ర చౌహాన్‌ను పూణె ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌టీఐఐ) చైర్మన్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందం గురువారం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిసింది. అనంతరం రాహుల్‌ మీడియాతో మాట్లాడారు. ఆరెస్సెస్‌ కబంధహస్తాల్లో సృజనాత్మకత నలిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానిని, బీజేపీని కీర్తించడమే ప్రాతిపదికగా అనర్హులకు పదవులను కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రామిక జన శంఖారావం సిడి

సెప్టెంబర్‌ 2న దేశ వ్యాప్త సమ్మె సందర్భంగా సిఐటియు రాష్ట్ర కమిటీి 'శ్రామిక జన శంఖారావం' ప్రచార గీతాల సిడిని శుక్రవారం ఆవిష్కరించింది. యూనియన్‌ ఉపాధ్యక్షురాలు పి. రోజా, కోశాధికారి ఎవి నాగేశ్వరరావుతో కలిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ ఈ సిడిని ఆవిష్కరించారు. అనంతరం గఫూర్‌ విలేకరులతో మాట్లాడుతూ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విధానాలపై 10 పాటలను రూపొందించి ఈ సిడిలో ఉంచామన్నారు.

పోలవరం ముంపు మండలాల్లో 20న బంద్‌కు పిలుపు..

ముంపు మండలాల సమస్యలపై ఈనెల 20వ తేదీన బంద్‌ నిర్వహించనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం ముంపు మండలాల్లో స్థానిక సిపిఎం నేతలతో కలిసి ఆయన పర్యటించారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన మండలాల్లో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. కనీసం అధికారుల కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు. వెంటనే ఆర్‌డిఏ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని గ్రామాలకూ రెవెన్యూ సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అధికారంలోకొచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇంతవరకు సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పారు.

Pages

Subscribe to RSS - August