August

మోడీ అన్నింటా వైఫల్యం:కారత్

ప్రధాని నరేంద్రమోడీ అన్నింటా వైఫల్యం చెందారని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు  ప్రకాశ్ కరత్ పేర్కొన్నారు. నగరాలు, పట్టణాల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. పాఠశాలల మరుగుదొడ్ల నిర్మాణాల్లో సరిపోలని లెక్కలున్నాయన్నారు. మరుగుదొడ్లు నిర్మించినా నీటి సమస్య నిర్వహణ లోపం ఉందన్నారు. జన్ ధన్ యోజన పథకం నిద్రావస్థలో ఉందని ఎద్దేవా చేశారు. రూ. 17 కోట్ల జన్ ధన్ ఖాతాల్లో పైసా లేదని విమర్శించారు. మేక్ ఇన్ ఇండియా పథకం ఎక్కడి గొంగళి అక్కడేనన్న చందంగా ఉంది అన్నారు. కేంద్రమంత్రులు కుంభోణాల్లో మునిగితేలుతున్నారని విమర్శించారు .

 

SFI ఆందోళన ఉద్రిక్తం..

ఇద్దరు ఇంటర్‌ విద్యార్థునుల బలన్మరణానికి కారణమైన కడప జిల్లాలోని నారాయణ విద్యాసంస్థ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. గుంటూరులో పోలీసులు విద్యార్థులపై జులుం ప్రదర్శించారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌, పిడిఎస్‌యు ఆధ్వర్యంలో గురువారం గుంటూరులో శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకుని దుర్భాషలాడారు. పిడిగుద్దులతో బీభత్సాన్ని సృష్టించారు. నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఒక విద్యార్థిని తనను ఆసుపత్రికి తీసుకెళ్లాలని అభ్యర్థించినా పోలీసులు పట్టించుకోలేదు. 29 మందిని అరెస్ట్‌ చేసి అరండల్‌పేట పోలీసు స్టేషన్‌కు తరలించారు.

ఆంధ్రాను ఆదుకోండి: ఏచూరి

విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని తక్షణమే ఆదుకోవాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన సిపిఎం ప్రధాన కార్యాలయం(ఎకెజి భవన్‌)లో విలేకరులతో మాట్లాడుతూ విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి నాటి ప్రభుత్వం పార్లమెంట్‌ సాక్షిగా ఎన్నో వాగ్ధానాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ హామీలన్నింటిని అమలు చేయాలని కోరారు. పత్యేక హోదా రూపంలోనైనా, ప్రత్యేక ప్యాకేజి రూపంలోనైనా ఆర్థికంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను తక్షణమే ఆదుకోవాలన్నారు. ఏ విషయంలోనైనా ఒక రాష్ట్రాన్ని వేరే రాష్ట్రంతో పోల్చడం సబబుకాదన్నది తమ ఉద్దేశ్యమని చెప్పారు.

అక్రమ బాక్సైట్‌ తవ్వకాలు నిలిపివేయాలి..

 విశాఖలో బాక్సైట్‌ గనులను కొల్లగొట్టి రూ.లక్ష కోట్లు లూటీ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని సిపిఎం నాయకులు జితేన్‌ చౌదరి ఆందోళన వ్యక్తంచేశారు. సోమవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రస్‌ ఆల్‌ఖైమా, జిందాల్‌తో చేసుకున్న గత ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయని, గతంలో సిపిఎం చెప్పిన విషయాన్నే కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) విడుదల చేసిన నివేదికలో పేర్కొందన్నారు. విశాఖ జిల్లాలో బాక్సైట్‌ ఖనిజం మొత్తం 550 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు ఉంటుందని, దీని విలువ సుమారు రూ.లక్ష కోట్లు ఉందని పేర్కొన్నారు.

GST నష్టదాయకం..

 జిఎస్‌టి(గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌) వ్యవస్థకు మారటం వల్ల నష్టపోతున్న రాష్ట్రాలకు పరిహారం చెల్లించటం గురించి మాత్రమే ఇప్పటి వరకు చర్చ పరిమిత మైంది. అంతర్రాష్ట్ర వాణిజ్యం జరిగినప్పుడు జిఎస్‌టిని అంతిమంగా ఉపయో గించుకునేవారు మాత్రమే కడతారు. దీనితో ఆ సరుకులను ఉత్పత్తి చేసే రాష్ట్రానికి ఎటువంటి ఆదాయం రాదు. ఇది రాష్ట్రాల ఖజానాలకు నష్టదాయకం. అంతర్రాష్ట్ర వాణిజ్యం జరగనప్పుడు కూడా ప్రస్తుత పన్ను వ్యవస్థ నుంచి జిఎస్‌టి వ్యవస్థకు మారటం నష్టదాయకమే. రాష్ట్రాలకు వచ్చే అలాంటి నష్టాలకు పరిహారం చెల్లించనున్న కాల వ్యవధి, అలాంటి నష్టాలను అంచనావేసే పద్ధతి వంటి విషయాల గురించి చర్చ జరుగుతున్నది.

బాక్సైట్ ఒప్పందాలను రద్దు చేయాలి ... త్రిపుర ఎంపి జితేంద్ర చౌదరి ..

రాష్ట్రంలో తెలుగుదేశం, కేంద్రంలో బిజెపి ప్రభుత్వాలు దేశంలోని సహజ వనరులను కార్పోరేట్ శక్తులకు ధారాదత్తం చేసే దుందుడుకుగా వ్యవహరిస్తునాయి . విశాఖ గిరిజన ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలపై గిరిజనులకు , గిరిజన చట్టాలకు కనీసం గౌరవించకుండా ఏకపక్షంగా రాష్ట్రం ప్రభుత్వం వ్యవహరిస్తున్నది .దీనిపై పార్లమెంట్ లో లేవనెత్తుతానని సిపియం పార్లమెంట్ సభ్యులు జితేంద్ర చౌదరి గారు తెలియజేసారు. బాక్సైట్ ఒప్పందాలను వెంటనే  రద్దు చేయాలని డిమాండ్ చేసారు.

విలువైన సమయం వృథా..

పార్లమెంటరీ వర్షాకాల సమావేశాలు ముందుగా ఊహించిన రీతిలోనే ఎలాంటి ప్రజా ప్రయోజన అంశాలపై చర్చకు నోచుకోకుండానే ముగిసిపోయాయి. లలిత్‌గేట్‌, వ్యాపమ్‌ సంబంధిత అంశాలపై ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభా కాలం హరించుకుపోవడమే కాక 260 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయ్యింది. ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు రావాలనుకున్న భూ సేకరణ బిల్లు మొదలుకొని వస్తు సేవల పన్ను బిల్లు వరకు ఏదీ చర్చకు నోచుకోలేదు. ఇటు లోక్‌సభలోనూ, అటు రాజ్యసభలోనూ దాదాపు మూడు వారాల పాటు ప్రతిష్టంభన రాజ్యమేలింది.

కార్మిక సమ్మెకు సర్వం సిద్ధం..

సెప్టెంబర్‌ 2న 24 గంటల పాటు జరిగే సార్వత్రిక సమ్మెకు దేశంలోని అన్ని రంగాలకు చెందిన వారు సన్నద్ధమయ్యారు. 1991 నుంచి అధికార పక్షాలు చేపట్టిన నయా ఉదారవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా జరిగే 16వ సార్వత్రిక సమ్మె ఇది. 11 కేంద్ర ట్రేడ్‌ యూనియన్లు, జాతీయ సమాఖ్యలు సంయుక్తంగా చేపట్టే నాలుగవ సమ్మె ఇది. సమ్మె పూర్తి విజయవంతం అవడానికి కావలసిన అన్ని చర్యలూ తీసుకున్నట్లు దేశం నలుమూల నుంచి అందిన సమాచారం తెలియజేస్తోంది. కేంద్ర ట్రేడ్‌ యూనియన్లు: కేంద్ర ట్రేడ్‌ యూనియన్లు అన్నీ తమ జాతీయ స్థాయి సమావేశాలను నిర్వహించాయి. స్వతంత్రంగా, సంయుక్తంగా చేపట్టవలసిన కార్యక్రమాల గురించి ఉద్ధృతంగా ప్రచారం చేశాయి.

అఖిల భారత సమ్మెలు సంస్కరణలకు బ్రేకులు..

 ''ఇప్పటి వరకూ జరిగిన మానవ చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే'' అని మార్క్ప్‌ మహానీయుడు నిర్వచించాడు. బానిసలు-బానిస యజమానులు, ప్యూడల్‌ ప్రభువులు-రైతాంగానికి మధ్య జరిగిన పోరాటాలు చరిత్రగతినే మార్చివేశాయి. ప్రస్తుతం నడుస్తున్న పెట్టుబడి దారీయుగంలోనూ కార్మిక వర్గపోరాటాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. భారత కార్మికవర్గం కూడా ఉన్నత పోరాట లెన్నింటినో నిర్వహించింది. 1862 హౌరా రైల్వే కార్మికులు ఎనిమిది గంటల పనికోసం ప్రారంభించిన తొలి సమ్మెతో కార్మిక వర్గం దుర్భరమైన పని పరిస్థితులపై సమరశంఖం పూరించింది.

పేదలపట్ల వివక్షతా?: బాబురావు

రాజధాని ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిఎం కార్యకర్తలు నిత్యం పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుల సిహెచ్‌.బాబురావు కోరారు. ఉండవల్లి సిపిఎం కార్యాలయంలో సోమవారం జొన్నకూటి వీర్లంకయ్య అధ్యక్షతన సిపిఎం రాజధాని డివిజన్‌ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో బాబురావు మాట్లాడుతూ ప్రభుత్వం పేదల పట్ల ఉద్ధేశ్యపూర్వకంగానే వివక్ష చూపుతుందని విమర్శించారు. అందుకు పేదలకు ఇవ్వవలసిన పింఛన్లు సరిగా ఇవ్వకపోవడమేనని విశ్లేషించారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ ఉదాసీనత రోజురోజుకు పెరుగుతుందని మండిపడ్డారు.

Pages

Subscribe to RSS - August