August

భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన..

రాజధాని భూసేకరణ నోటిపికేషన్‌ను వ్యతిరేకిస్తూ వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకోపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద ఆందోళన చేస్తున్న రైతు, ప్రజా, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. బలవంతంగా అరెస్ట్‌లు చేశారు. అరెస్టు అయినవారిలో సిపిఎం క్రిడా ప్రాంత కన్వీనర్‌ సిహెచ్‌ బాబూరావు, జె శివశంకర్‌, రవి, నవీన్‌, రైతు సంఘం నాయకులు గంగాధరం తదితరులున్నారు. వీరిపై 341, 143 సెక్షన్లపై కేసు నమోదు చేశారు. రాస్తారోకో ప్రారంభం కాకముందే చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు.

ధరలను నియంత్రించాలి..

ధరల పెరుగుదలను నియంత్రించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలి. ఇందుకు ప్రజాపంపిణీ వ్యవస్థను సార్వత్రీకరించాలి. నిత్యావసర సరుకుల మార్కెట్‌లో స్పెక్యు లేషన్‌ను నివారించాలి. అఖిల భారత వినిమయ ధరల సూచిక 2013-13లో 10.4 శాతం పెరగగా 2013-14లో 8.3 శాతం, 2014-15లో 5.3 శాతం పెరిగింది. ఆహార వస్తువుల ధరలు మరింత పెరుగుతున్నాయి. వీటి ధరలు 2012-13లో 12 శాతం, 2013-14లో 8.3 శాతం, 2014-15లో 6.3 శాతం పెరిగాయి. గత 8 నెలలుగా ధరల పెరుగుదల రేటు పెరుగుతున్నది. నవంబరు 2014లో ద్రవ్యోల్బణం 4.12 శాతం కాగా మే 2015లో 5.74 శాతం అయింది. జూన్‌ 2015లో ద్రవ్యోల్బణం రేటు భారతదేశంలో 5.4 శాతం కాగా చైనాలో 1.4 శాతమే ఉన్నది.

రాజధాని రాజకీయ క్రీడలో చంద్రబాబు..

మిగిలిన విషయాలెలా ఉన్నా ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణం దీర్ఘ కాల దృష్టితో జరగాల్సిన చారిత్రిక వ్యవహారం. అందులోనూ నవ్యాంధ్ర ప్రదేశ్‌కు ప్రజా రాజధాని నిర్మిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకటికి రెండుసార్లు ప్రకటించి ఉన్నారు. కానీ ఆచరణలో ఆయన వ్యవహరిస్తున్న తీరు ప్రజలనూ, ప్రజల్లో పనిచేసే పార్టీలనూ ఏ మాత్రం విశ్వాసంలోకి తీసుకోని ఏకపక్ష తతంగంగా నడుస్తున్నది. ఆఖరుకు తన మిత్రపక్షాలనూ, స్వంత పాలకపక్ష ప్రముఖులనూ, ప్రభుత్వ నిర్వహణకు ప్రాణవాయువు లాటి ఉద్యోగ అధికార వర్గాలను కూడా తికమక పెట్టేదిగా మారింది.

ప్రకాశం బ్యారేజీ వద్ద రైతుల రాస్తారోకో..

రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణపై రోజు రోజుకు నిరసనలు పెరుగుతున్నాయి. పలు గ్రామాల్లో రైతులు వివిధ రూపాల్లో తమ నిరసనలు వ్యక్తం చేశారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో రైతులు సమావేశమై ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. రాజధాని గ్రామాల్లో భూ సమీకరణ, భూసేకరణను వ్యతిరేకిస్తూ నేడు ఉదయం 10 గంటలకు ప్రకాశం బ్యారేజీ మీద రాజధాని గ్రామాల రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తిదారులతో రాస్తారోకో నిర్వహించారు.  ఈనెల 24న రాజధాని గ్రామాల్లోని క్రిడా కార్యాలయాలను ముట్టడించాలని, 25న రాజధాని ప్రాంత గ్రామాల్లో బంద్‌ పాటించాలని పిలుపునిచ్చారు..

 

విలీన మండలాలపై ఇంత వివక్షా?

టిడిపి ప్రభుత్వం విలీన మండలాలపై తీవ్ర వివక్షను చూపుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం. కృష్ణమూర్తి విమర్శించారు. సిపిఎం కూనవరం డివిజన్‌ కమిటీ సమావేశం తూర్పుగోదావరి జిల్లా కూనవరం ఫారెస్టు అతిథి గృహంలో కుంజా సీతారామయ్య అధ్యక్షత న శనివారం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మా ట్లాడుతూ, ఉపాధ్యాయులు లేక విలీన మండలాల్లో ప్రభు త్వ విద్య మరుగున పడిందన్నారు. వైద్యులు, సిబ్బంది కొరతతో గిరిజనులకు వైద్యం దూరమైందన్నారు. మలే రియాతో గిరిజనులు మృత్యువాత పడుతున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం దారుణమన్నారు.

విద్యార్థుల బలి..

కార్పొరేట్‌ విద్యా సంస్థల ఉక్కుపాదాల కింద విద్యా కుసుమాలు నలిగిపోతున్న ఉదంతాలు ఆందోళన కలిగిస్తుండగా అటువంటి ఉదంతాలు ఇటీవల వరుసగా జరగడం పెను విషాదం. సోమవారం కడప సమీపంలో నారాయణ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థినులు నందిని, మనీషా బలయ్యారు. అంతలోనే గురువారం నెల్లూరు జిల్లా గూడూరులో డిఆర్‌డబ్ల్యు కాలేజీలో బిఎస్‌సి విద్యార్థిని రవళి ప్రాణాలు తీసుకుంది. తమ పిల్లల భవిష్యత్తుపై గంపెడాశతో వేలకు వేలు పోసి ప్రైవేటు కాలేజీల్లో చేర్పిస్తున్న తల్లిదండ్రులకు గర్భశోకం మిగలడం పాషాణ హృదయాలను సైతం కలచివేస్తుంది.

110జీ.ఒ కార్పొరేట్లకి అనుకూలం..

రాజధాని ప్రాంతంలో బలవంతపు భూ సేకరణణను ఆపాలని రైతు సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి.బలరామ్‌, వంగల సుబ్బారావులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 20వ తేదిన జీ.ఒ.నెం.304 విడుదల చేసిందని, దీని ఆధారంగా 26 రెవెన్యూ గ్రామాల పరిధిలో నోటిఫికెేషన్లు జారి చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూమి 15 వేల ఎకరాలకు పైగా ఉందని పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో 50వేల ఎకరాల అటవీ భూమిని ప్రభుత్వం ఢనోీటిఫై చేస్తామని ప్రకటించిందని, కృష్ణా జిల్లాలోనూ నది తీరంలో 10వేల ఎకరాలు తీసుకోవడానికి రంగం సిద్ధమయిందని తెలిపారు.

రాజధాని భూముల్లో నల్లధనం..

ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని భూముల లావాదేవీల్లో నల్లధనం వరదలై పారుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఆదాయ పన్ను శాఖ కళ్లుమూసుకుంటుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. రాజధాని గ్రామాలలో గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు దాదాపు రూ.10వేల కోట్ల నల్లధనం లావాదేవీలు సాగినట్లు హైకోర్టు న్యాయవాది ఒకరు అంచనా వేశారు. వాటిని పరిశీలించాల్సిందిగా ఆయన డైరెక్టర్‌ ఆఫ్‌ ఇన్‌కంటాక్స్‌ (ఇన్వెస్టిగేషన్‌) కు ఫిర్యాదు చేశారు.

Pages

Subscribe to RSS - August