August

SEP2సమ్మెకు విస్తృతసన్నాహాలు

కార్మిక చట్టాల సవరణను, ప్రభుత్వ విధానాలకు నిరసనగా సెప్టెంబర్‌ 2న దేశ వ్యాప్తంగా జరుగుతున్న కార్మిక సమ్మెకు విస్తృత సన్నాహాలు చేయాలని సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్‌(సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ పిలుపునిచ్చారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీలంతా సమ్మెలో పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు మంగళవారం స్థానిక పాతగుంటూరులోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జనరల్‌ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి కె.నాగలక్ష్మి అధ్యక్షత వహించారు. నేతాజీ మాట్లాడుతూ సమ్మెలో దేశంలోని అన్ని కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయని చెప్పారు.

CPM ఆధ్వర్యంలో భూములు దున్నిన పేదలు..

నూజెండ్ల మండలంలోని ముక్కెళ్లపాడు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెం 5-1లోని ప్రభుత్వభూమిని పేదలకు పంపిణీ చేసి పట్టాలు మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు కోరారు. మంగళవారం గ్రామంలోని ప్రభుత్వభూములను ట్రాక్టర్‌తో దున్ని ఎర్రజండాలు పాతి ఆక్రమించారు. పాలక పార్టీలు ఎన్నికలకు ముందు పేదలందరికీ ఇళ్లస్థలాలు, సాగుభూములు ఇస్తామని వాగ్దానం చేసి, నేడు భూములన్నీంటిని కార్పొరేట్‌ సంస్థలకు కట్టబట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అనేక చోట్ల ప్రభుత్వ భూములకు పెత్తందార్లు పట్టాలు పుట్టించి లక్షలరూపాయలకు అమ్ముకుంటున్నారని చెప్పారు.

బాబు పక్కా బిజినెస్ మాన్:మధు

రాజధాని నిర్మాణం పేరుతో రైతుల వద్ద నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు బలవంతంగా భూ సేకరణ చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కారద్యర్శి పెనుమల్లి మధు అన్నారు. ఏకంగా 1.20 లక్షల ఎకరాలను సేకరిస్తున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 17 లక్షల ఎకరాలతో ల్యాండ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. వీటిని బడా పారిశ్రామిక వేత్తలకు 99 ఏళ్ల పాటు కారుచౌకగా లీజుకిస్తున్నారని వాపోయారు. చంద్రబాబు చేస్తున్నది పక్కా బిజినెస్‌ అని, అభివృద్ధి కాదని తెలిపారు. పరిశ్రమలు, విమానాశ్రయం పేరుతో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వేలాది ఎకరాలను రైతుల వద్ద నుంచి లాక్కుంటున్నారని తెలిపారు.

 

29నరాష్ట్ర బంద్‌కుCPMమద్దతు

బిజెపి సర్కార్‌పై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తెలిపారు. ప్రత్యేకహోదా విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మొండిచేయి చూపించడతో ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు ముఖంలో నెత్తురులేకుండా పోయిందన్నారు. ఈ నెల 29న రాష్ట్ర బంద్‌కు తాము మద్దతు ప్రకటిస్తున్నామని ప్రకటించారు.

భూసేక‌ర‌ణ‌ను వ్యతిరేకిస్తూ బంద్ సంపూర్ణం..

ప్రభుత్వం తలపెట్టిన బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ ఇచ్చిన బంద్‌ పిలుపు ఉండవల్లిలో సంపూర్ణంగా జరిగింది. ఉదయం నుండే దుకాణాలన్నీ మూతపడ్డాయి. పెట్రోలు బంకుతో సహా పెద్ద వ్యాపారసంస్థలన్నీ స్వచ్ఛంధంగా బంద్‌చేసి రైతులకు తమ సంఘీభావం ప్రకటించారు. ముందుగా సిపిఎం, వైసిపి నాయకులతో కలిసి రైతులు ఉండవల్లి సెంటర్లో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిడా సిపిఎం కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు మాట్లాడుతూ ప్రభుత్వం నిరంకుశత్వంగా ముందుకెళితే తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచైనా భూసేకరణను నిలుపుదలచేస్తామని చెప్పారు.

నిరుద్యోగం తొలగింపునకు నిర్దిష్ట చర్యలు..

ఉద్యోగిత పెరిగేందుకు నిర్దిష్టమైన చర్యలు తీసుకొని నిరుద్యోగ సమస్యను నియంత్రించాలి. మన దేశంలో ప్రతి సంవత్సరం 1.2 కోట్ల మంది ఉద్యోగం కోసం కొత్తగా మార్కెట్‌లోకి వస్తారు. కాబట్టి యువతీయువకులకు ఉద్యోగాలు, పని కల్పించడం ఒక ప్రధాన సమస్య. కోటీ నాలుగు వేల మందికి ఉద్యోగాలు కావాల్సి ఉండగా లేబర్‌ బ్యూరో (సిమ్లాలో ఉంది) లెక్కల ప్రకారం దుస్తులు, తోళ్ళు, లోహాలు, ఆటోమోబైల్సు, వజ్రాలు, నగలు, రవాణా, ఐటి/బిపిఒ, చేనేత, మర మగ్గాలు- ఈ ఎనిమిది రంగాలలో 2013లో 4.19 లక్షల ఉద్యోగాలే కొత్తగా వచ్చాయి.

ఆత్మహత్యల భారతం..

నేడు భారతదేశంలో ప్రతి 42 నిమిషాలకు ఒక రైతన్న ఆత్మహత్య చేసుకుంటున్నాడు. 'అచ్ఛే దిన్‌'. జాతీయ నేరాల రికార్డు బ్యూరో(ఎన్‌సిఆర్‌బి) ప్రకారం 2014లో దేశంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య 12,360. రైతుల ఆత్మహత్యల సంఖ్య తక్కువ చేసి చూపించటానికి ఎన్‌సిఆర్‌బి తక్కువ ప్రయత్నమేమీ చేయలేదు. నిజాన్ని మరుగుపర్చటానికి రైతుల ఆత్మహత్యలను రెండు భాగాలుగా విభజించింది. ఒకటి రైతు, రెండోది వ్యవసాయ కార్మికులు. దీనివల్ల రైతు ఆత్మహత్యల సంఖ్య 67 శాతం తగ్గిపోయింది. కానీ జరుగుతున్నదేమంటే చారిత్రకంగానే వ్యవసాయ కార్మికులు కూడా రైతులలో భాగంగానే పరిగణించబడతారు. 6,050 మంది రైతులు, 6,310 మంది వ్యవసాయ కార్మికులు.

పరిశ్రమాధిపతులకు డికెటి భూములు..

 చిత్తూరు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి పేరు మీద 1,60,938 ఎకరాలకు పైగా భూములను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. ఇందులో ప్రధానంగా ఎస్‌సి, ఎస్‌టి, బలహీనవర్గాలు సాగుచేసుకుంటున్న డికెటి (అసైన్డ్‌) భూములపై కేంద్రీకరించి వివరాలను సేకరిస్తోంది. ఈ భూములు ఒకే దగ్గర వందల, వేల ఎకరాలు ఉంటున్నాయి. పాత చట్టాల ఆధారంగా ప్రభుత్వ అవసరాలకు తీసుకోవచ్చని భయపెట్టి తీసుకుంటున్నారు. దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల వారు సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వకుండా, అది ప్రభుత్వ స్థలంగా చూపి లాక్కోవాలని చూస్తున్నారు.

ప్రత్యేక హోదా సాధనతోనే రాష్ట్రాభివృద్ధి..

పరిశేష ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందటానికి ప్రత్యేకహోదాను సాధించటం అవసరం. ఉమ్మడి రాష్ట్రంలో 60 శాతానికి పైగా ఆదాయాన్నిచ్చే రాజధాని నగరం హైదరాబాద్‌ తెలంగాణకు రాజధానిగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధానిని నిర్మించుకోవాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా లోటులో ఉంది. రాష్ట్ర బడ్జెట్‌లో రూ.16,000 కోట్ల లోటు ఉంది. విశాఖపట్నం, తిరుపతి లాంటి చోట్ల మినహా పారిశ్రామికాభివృద్ధి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇటువంటి స్థితిలో రాష్ట్రం ఆభివృద్ధిని సాధించాలంటే రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించటం తప్పనిసరి.

ప్రమాద ఘంటిక..

సోమవారంనాటి భారతీయ స్టాక్‌ మార్కెట్‌ భారీ పతనం రానున్న ఆర్థిక సంక్షోభ తీవ్రతకు ప్రమాద ఘంటిక. దేశ మార్కెట్‌ చరిత్రలో బ్లాక్‌ మండే. నష్టాల సునామీలో మదుపర్లకు చెందిన సుమారు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఆవిరయ్యాయని అంచనా. సెన్సెక్స్‌ 1,621.51 పాయింట్లు కోల్పోయి 25,741.56 పాయింట్ల వద్ద, నిఫ్టీ 490.95 పాయింట్లు కోల్పోయి 7,809 పాయింట్ల వద్ద ముగిశాయి. గడచిన ఏడేళ్లలో స్టాక్‌ మార్కెట్లు ఇంత భారీగా పతనం కావడం ఇదే ప్రథమం. సెన్సెక్స్‌ చరిత్రలో చోటు చేసుకున్న భారీ పతనాల్లో మూడవది. 2008 జనవరి 21 తర్వాత అతి పెద్ద నష్టం. 26 వేల పాయింట్ల దిగువకు చేరడం సంక్షోభ తీవ్రతను తెలియజేస్తోంది.

Pages

Subscribe to RSS - August