August

విషాహారం తిన్న 12 మంది విద్యార్థులకు అస్వస్థత

 

కర్నూలు:కోడుమూరు మండలం అమడగుంట్ల బీసీ హాస్టల్‌లో విషాహారం తిన్న 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. హాస్టల్‌ అస్వస్థతకు కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఎంపీలు రాజీనామా చేస్తే గంటలో ప్రత్యేక హోదా:రామకృష్ణ

తూ.గో:ఎంపీలు రాజీనామా చేస్తే గంటలో ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని సీపీఐ నేత రామకృష్ణ చెప్పారు. ప్రత్యేక హోదా కోరుతూ సీపీఐ చేపట్టిన బస్సు యాత్ర తూర్పుగోదావరి జిల్లా తునికి చేరుకుంది. ఈ సందర్భంగా సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో పదిరూపాయలకే బిర్యానీ తింటున్న ఎంపీలు రాష్ర్టాన్ని పట్టించుకోవటం లేద ని ఆయన ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఈ నెల 11న రాష్ట్ర బంద్‌ చేపట్టనున్నట్లు రామకృష్ణ వివరించారు.

సింగపూర్‌ కంపెనీలకు జూ స్థలం కట్టబెట్టొద్దు - సిపిఐ(యం)

సింగపూర్‌ కంపెనీల నైట్‌సఫారీలకోసం చంద్రబాబునాయుడు ప్రభుత్వం విశాఖనగరంలో ఉన్న 625 ఎకరాల స్థలం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ జూ పార్కును ఎదురుగా ఉన్న కంబాల కొండలోపెడతామని అంటున్నారు. ఇంతవిశాలమైన స్థలాన్ని వదిలి చిన్న స్థలంలో పెడతామని చెప్పడం సరైనదికాదు. ఈ రోజు సిపిఐ(యం)పార్టీ జూపార్కును తరలించొద్దని జూ వద్ద ధర్నా నిర్వహిస్తే జూ సందర్శానికి వచ్చిన పర్యాటకులంతా ముక్తకంఠంతో వ్యతిరేకించారు. రష్యానుండి వచ్చిన వారుసైతం దీన్ని వ్యతిరేకించినా చంద్రబాబునాయుడు ప్రభుత్వం దున్నపోతుమీద వర్షం కురిసిన చందంగా వ్యవహిస్తోంది.

Pages

Subscribe to RSS - August