August

జ్యూట్ మిల్ కార్మికులకు అండగా..

గుంటూరులో బజరంగ్ జ్యూట్ మిల్లు కార్మికుల ఆందోళనకు సిపిఎం అండగా ఉంటుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. ఆందోళన చేస్తున్న కార్మికుల దీక్షా శిబిరాన్నిసందర్శించి మద్దతు తెలిపారు.ఈ సందర్బంగా మధు మాట్లాడుతూ యాజమాన్యం కార్మికుల డిమాండ్లను పరిగణలోనికి తీసుకోని వారి జీవనోపాధికి సంబందించిన జ్యూట్ మిల్లును వెంటనే తిరిగి ప్రారంభించాలని కోరారు. 

ఎస్సీ,ఎస్టీ చట్ట సవరణ..

జంతు కళేబరాలు, మనుషుల మృతదేహాలను తరలించాలనిగానీ... పారిశుధ్య పని (మానన్యువల్‌ స్కావెంజింగ్‌) చేయాలని గానీ ఎస్సీ, ఎస్టీలపై ఒత్తిడి చేస్తే కఠిన చర్యలు తప్పవు! ఈ దిశగా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో కేంద్ర ప్రభుత్వం పలు సవరణలు తీసుకొచ్చింది. మంగళవారం లోక్‌సభలో విపక్ష సభ్యులు లేకుండానే... ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ బిల్లు-2014 మూజువాణీ ఆమోదం పొందింది. దీని ప్రకారం... ఎన్నికల్లో ఫలానా వారికి ఓటు వేయాలనిగానీ, ఓటు వేయొద్దని కానీ ఒత్తిడి తెచ్చినా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు పెట్టవచ్చు. అంతేకాదు...

ఆశారాం జీవితం పాఠ్యాంశమా!

పాఠ్యాంశాల్లో హిందూత్వాన్ని చొప్పించొద్దని స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌టిఎఫ్‌ఐ) జాతీయ కార్యదర్శి సి.ఎన్‌. బారతి సూచించారు. మంగళవారం పార్లమెంట్‌లో ఎస్‌టిఎఫ్‌టి ఉపాధ్యక్షులు ఎన్‌.నారాయణతో కలసి ఆయన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీని కలిసి రెండు వినతి పత్రాలను సమర్పించారు. నూతన విద్యా విధానం-2015పై ఎస్‌టిఎఫ్‌ఐ సూచనలు, అభిప్రాయలను తీసుకోవాల్సిన మార్పులు ఆమెకు వివరించారు. అనంతరం ఆయన ఎపి భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ...మోడీ అధికారం చేపట్టిననాటి నుండి విద్య కాషాయీకరణ అమలుకు విధానాలను రూపొందిస్తున్నారని విమర్శించారు.

సస్పెన్షన్‌పై రాజ్యసభలోరబస

 పార్లమెంటు వర్షాకాల సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే దిశలో నడుస్తున్నాయి. 25 మంది కాంగ్రెస్ సభ్యులపై వేటువేస్తూ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు మంగళవారం రాజ్యసభను పూర్తిగా స్తంభింపచేశారు. ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన సభ పనె్నండు గంటల సమయంలో ఆరు నిమిషాలసేపు వాయిదా అనంతరం సమావేశమై కేవలం మూడు నిమిషాల మాత్రమే జరిగి రెండు గంటలకు వాయిదాపడింది. రెండు గంటలకు తిరిగి సమావేశమై ఐదు నిమిషాల పాటు పెద్దపెట్టున జరిగిన కాంగ్రెస్ నినాదాలకు సాక్షిగా నిలిచింది. ఆ తర్వాత బుధవారానికి వాయిదా పడిపోయింది.

ద్రవ్యోల్బణం బయపెడుతోంది..

ప్రస్తుత పరిస్థితులలో ఆర్థిక వ్యవస్థలో సర్దుబాటు వైఖరిని నిర్వహించేందుకు వడ్డీరేట్ల కోతల జోలికి పోలేదని రాజన్‌ అన్నారు. గతంలో చేసిన వడ్డీకోతల ఫలితాలను బ్యాంకులు పూర్తిస్థాయిలో ప్రజలకు అందించకపోవడం, ఆహార ధరలు, అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీరేట్లను సాధారణీకీరణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని భవిష్యత్తులో వడ్డీరేట్లను తగ్గించనున్నట్లుగా ఆయన తెలిపారు. ఆహార, ఇంధన ధరలను మినహాయించిన ద్రవ్యోల్బణం మరింతగా బలపడుతుండడం చింతించాల్సి అంశాలుగా ఉన్నాయన్నారు.

లక్షల కోట్లుండి జైల్లోనా:SC

సహారా గ్రూపు ఛైర్మన్‌ సుబ్రతా రారుపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం  చేసింది. రూ.1,85,000 కోట్ల ఆస్తులు ఉంచుకుని, అందులో ఐదో వంతు చెల్లించి సమస్యల నుంచి బయట పడవచ్చుగా అని పేర్కొంది. జైల్లో ఉండాలనకుంటే నీ ఇష్టమని న్యాయమూర్తి టిఎస్‌ ఠాకూర్‌తో కూడిన ధర్మాసనం రారుకు సూచించింది. అనేక వ్యాపారాలు కలిగిన రారును జైల్లో ఉంచడం సరైంది కాదని ఆయన తరుపు న్యాయవాధి సీనియర్‌ అడ్వకేట్‌ కపిల్‌ సిబల్‌ కోర్టులో వాధించారు. అనేక వ్యాపార సంస్థలు అప్పులు పడి ఉన్నాయని, అలాంటి వాటిని ఆర్‌బిఐ, బ్యాంకులు ఐదు, పదేళ్ల పాటు పునరుద్దరిస్తున్నాయని పేర్కొన్నారు.

క్రీడాకార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ధర్నా

 

గుంటూరు: తుళ్లూరు క్రీడాకార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టింది. అసైన్డ్ భూయజమానులకూ పరిహారం చెల్లించాలని నినాదాలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది. వ్యవసాయ కార్మికులకు పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేత బాబూరావుతో పాలు పలువురిని అరెస్టు చేశారు.

Pages

Subscribe to RSS - August