ఢిల్లీ యూనివర్సిటిలోని కిరోరి మాల్ కళా శాలలో 2013 ముజఫర్నగర్ అల్లర్లపై ప్రద ర్శితమవుతున్న డాక్యుమెంటరీని ఏబివిపి కార్యకర్తలు అడ్డుకోవడాన్ని ఎస్ఎఫ్ఐ ఢిల్లీ విభాగం తీవ్రంగా ఖండించింది. రాజకీయ ప్రాముఖ్యం ఉన్న ఇలాంటి సంఘటనలు విశ్వవిద్యాలయాల్లో పదేపదే పునరావృతం అవుతుండటాన్ని తప్పుపట్టింది. భావ వ్యక్తి కరణ స్వేచ్ఛకు అడ్డుపడే ఈ తరహా ఘటనలు జరగకుండా ఉండేందుకు అందరూ ఐక్యం కావాల్సిందిగా విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఇతర ప్రజా సంఘాలను కోరింది. 2013లో ఉత్తర ప్రదేశ్లోని ముజఫర్నగర్లో తీవ్రమైన మత అల్లర్లు చెలరేగి 60మంది మృతిచెం దగా, దాదాపు 50వేల మంది ముస్లిములు బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయవలసి వచ్చిం ది.