August

ప్రశ్నిస్తానన్న పవన్ ఎక్కడ: భజరంగ్ మిల్ కార్మికులు..

 

గుంటూరు: ప్రశ్నించడం కోసమే వచ్చానన్న పవన్‌ ఇప్పుడు ఏం చేస్తున్నారని గుంటూరు భజరంగ్‌మిల్‌ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఉపాధి కల్పించాలంటూ గత రెండు నెలలుగా నిరసనలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాధానం చెప్పాల్సిన మిల్లు యాజమాన్యం ఆస్తులు అమ్ముకునే ఆలోచనలో పడిందని, స్పందించాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారంపై పవన్‌ కల్యాణ్‌ జోక్యం చేసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.

తుళ్లూరు క్రీడా కార్యాలయం సీపీఎం ఆందోళన....

 

గుంటూరు: తుళ్లూరు క్రీడాకార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టింది. అసైన్డ్ భూయజమానులకూ పరిహారం చెల్లించాలని నినాదాలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది. వ్యవసాయ కార్మికులకు పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేత బాబూరావుతో పాలు పలువురిని అరెస్టు చేశారు.

ఆర్థిక విధానంపై ప్రతిష్టంభన..

ఆర్థిక విధానానికి సంబంధించి రిజర్వ్‌ బ్యాంకు, ఆర్థిక మంత్రిత్వ శాఖల మధ్య విభేదాలున్నాయని వార్తా పత్రికల్లో అనేక కథనాలు వచ్చాయి. గవర్నర్‌ అధికారాలను కుదించటానికి భారతీయ రిజర్వ్‌ బ్యాంకు చట్టాన్ని సవరించాలని ప్రభు త్వం ఆలోచిస్తున్నంత తీవ్రంగా ఈ అభిప్రాయభేదాలున్నాయి. అయితే ఈ తేడాలు భారత ఆర్థిక వ్యవస్థలో లోతుగా పాతుకుపో యిన అనారోగ్యానికి సంబంధించిన లక్షణాలే. ఇక్కడ ఎవరు ఒప్పు, ఎవరు తప్పు అనేది కాదు. అసలు విషయం ఏమంటే ఏ విధానాన్ని అవలంబించినా ఆర్థిక వ్యవస్థ మరింత ఒడిదుడుకులకు లోనుకావటం తథ్యమనేది.

రెండు పార్టీలు నాలుగు నాలుకలు..

నవ్యాంద్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై బిజెపి, టిడిపిలు చేస్తున్న విన్యాసాలు జుగుప్స కలిగిస్తున్నాయి. అధికారంలోకొచ్చి సంవత్సరం దాటినా హోదాపై స్పష్టం చేయకుండా ప్రజలను డోలాయమానంలో పడేసేందుకు రెండు పార్టీలు నాలుగు నాల్కలతో మాట్లాడుతున్నాయి. ప్రత్యేక హోదా సహా పునర్విభజన చట్టంలో పొందుపర్చిన, ఆ సందర్భంగా పార్లమెంటు చర్చలో ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తామని బిజెపి, టిడిపి సంయుక్తంగా ప్రజలను నమ్మించి ఓట్లేయించుకొని గద్దెనెక్కాయి. వాగ్దానాల అమలులో రెండు పార్టీలూ కప్పదాట్లకు దిగడం జనానికి వెన్నుపోటు పొడవడమే.

CRDA కార్యాలయం ముట్టడి..

రాజధాని ప్రాంతంలోని అర్హులందరికీ పింఛన్లు ఇవ్వకుండా మోసం చేస్తే ఊరుకోబోమని సిపిఎం క్రిడా కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు ఉండవల్లిలోని క్రిడా కార్యాలయాన్ని పేదలు సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ముట్టడించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ, ఏప్రిల్‌ నుండే పింఛన్లిస్తామని అక్కడక్కడా కొద్దిమందికే ఇచ్చి సరిపెట్టారని, ఉండవల్లిలో ఒక్కరికీ ఇవ్వలేదని మండిపడ్డారు. ఇక్కడి రైతులు పూలింగ్‌కు భూములివ్వనందునే కక్షగట్టారా? అని ప్రశ్నించారు. పింఛన్ల పంపిణీపై నిర్దిష్ట విధానాన్ని ప్రకటించాలన్నారు.

భారత్‌ 100% హిందువులదే..

హిందూ తీవ్రవాదంపై జరుగు తున్న చర్చ పట్ల శివసేన చాలా దూకుడుగా స్పం దించింది. భారతదేశం పూర్తిగా వంద శాతమూ హిందూ దేశమేనని స్పష్టం చేసింది. తమ సొంత దేశంలో తీవ్రవాదాన్ని వ్యాప్తి చేయడానికి హిందు వులకు ఎలాంటి కారణం లేదని పేర్కొంది. హిం దూ తీవ్రవాదం అనే పదాన్ని కనిపెట్టడం ద్వారా తీవ్రవాదంపై పోరు సల్పడంలో కాంగ్రెస్‌ బలహీ నమై పోయిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ విమర్శించిన కొద్దిరోజల తర్వాత ఈ ప్రకటన వెలు వడింది. 'తీవ్రవాదానికి కాషాయరంగు పులిమి, దానిపై రాజకీయాలకు పాల్ప డడం మోసపూ రితమైన, స్వార్ధపూరితమైన చర్య' అని సేన తన సంపాదకీయం సామ్నాలో పేర్కొంది.

MROవనజాక్షికి హెచ్చ‌రిక‌లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన తహశీల్దార్ వనజాక్షి మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. ఆమెకు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు లేఖను పంపారు. ముసునూరు నుండి బదిలీపై వెళ్లిపోవాలని లేకుంటే కుటుంబం మొత్తాన్ని చంపుతామని లేఖలో హెచ్చరికలు చేశారు. దీనితో ముసునూరు పీఎస్ లో వనజాక్షి ఫిర్యాదు చేసింది. ముసూనూరు తహశీల్దార్ గా వనజాక్షి విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అక్రమ ఇసుక రవాణాను చేస్తున్నారంటూ తనిఖీలకు వెళ్లిన వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇతర ఉద్యోగులు దీనిని తీవ్రంగా ఖండించారు. వనజాక్షికి న్యాయం చేయాలంటూ పోరాటం చేపట్టారు.

స‌మావేశాల‌ బహిష్కరణ:సీపీఎం

ఎన్డీఏ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని.. అవినీతి ఆరోపణ ఎదుర్కొంటున్న మంత్రులు రాజీనామా చేయాల్సిందేనని సీపీఎం ఎంపి కరుణాకరన్ డిమాండ్ చేశారు. 5రోజుల పాటు సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు కరుణాకరన్ వెల్లడించారు.

Pages

Subscribe to RSS - August