August

CRDA కార్యాలయం ముట్టడి..

రాజధాని ప్రాంతంలోని అర్హులందరికీ పింఛన్లు ఇవ్వకుండా మోసం చేస్తే ఊరుకోబోమని సిపిఎం క్రిడా కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు ఉండవల్లిలోని క్రిడా కార్యాలయాన్ని పేదలు సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ముట్టడించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ, ఏప్రిల్‌ నుండే పింఛన్లిస్తామని అక్కడక్కడా కొద్దిమందికే ఇచ్చి సరిపెట్టారని, ఉండవల్లిలో ఒక్కరికీ ఇవ్వలేదని మండిపడ్డారు. ఇక్కడి రైతులు పూలింగ్‌కు భూములివ్వనందునే కక్షగట్టారా? అని ప్రశ్నించారు. పింఛన్ల పంపిణీపై నిర్దిష్ట విధానాన్ని ప్రకటించాలన్నారు.

భారత్‌ 100% హిందువులదే..

హిందూ తీవ్రవాదంపై జరుగు తున్న చర్చ పట్ల శివసేన చాలా దూకుడుగా స్పం దించింది. భారతదేశం పూర్తిగా వంద శాతమూ హిందూ దేశమేనని స్పష్టం చేసింది. తమ సొంత దేశంలో తీవ్రవాదాన్ని వ్యాప్తి చేయడానికి హిందు వులకు ఎలాంటి కారణం లేదని పేర్కొంది. హిం దూ తీవ్రవాదం అనే పదాన్ని కనిపెట్టడం ద్వారా తీవ్రవాదంపై పోరు సల్పడంలో కాంగ్రెస్‌ బలహీ నమై పోయిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ విమర్శించిన కొద్దిరోజల తర్వాత ఈ ప్రకటన వెలు వడింది. 'తీవ్రవాదానికి కాషాయరంగు పులిమి, దానిపై రాజకీయాలకు పాల్ప డడం మోసపూ రితమైన, స్వార్ధపూరితమైన చర్య' అని సేన తన సంపాదకీయం సామ్నాలో పేర్కొంది.

MROవనజాక్షికి హెచ్చ‌రిక‌లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన తహశీల్దార్ వనజాక్షి మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. ఆమెకు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు లేఖను పంపారు. ముసునూరు నుండి బదిలీపై వెళ్లిపోవాలని లేకుంటే కుటుంబం మొత్తాన్ని చంపుతామని లేఖలో హెచ్చరికలు చేశారు. దీనితో ముసునూరు పీఎస్ లో వనజాక్షి ఫిర్యాదు చేసింది. ముసూనూరు తహశీల్దార్ గా వనజాక్షి విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అక్రమ ఇసుక రవాణాను చేస్తున్నారంటూ తనిఖీలకు వెళ్లిన వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇతర ఉద్యోగులు దీనిని తీవ్రంగా ఖండించారు. వనజాక్షికి న్యాయం చేయాలంటూ పోరాటం చేపట్టారు.

స‌మావేశాల‌ బహిష్కరణ:సీపీఎం

ఎన్డీఏ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని.. అవినీతి ఆరోపణ ఎదుర్కొంటున్న మంత్రులు రాజీనామా చేయాల్సిందేనని సీపీఎం ఎంపి కరుణాకరన్ డిమాండ్ చేశారు. 5రోజుల పాటు సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు కరుణాకరన్ వెల్లడించారు.

దళితులకు సామజిక న్యాయం దక్కేవరకూ పోరాడదాం..

మనదేశానికి స్వాతంత్రం వచ్చి 68సంవత్సరాు అవుతున్నా దళితు స్థితిగతుల్లో పెద్దగా మార్పు రాలేదు. అంటరాని తనం, దాడు, స్త్రీపై అత్యాచారాు, మానభంగాు కొనసాగుతూనే వున్నాయి. అందుచేతనే రాజ్యాంగ నిర్మాత భారత రత్న డా॥ బి.ఆర్‌.అంబేద్కర్‌ 125 జయంతి సందర్భంగా పార్లమెంటు ప్రత్యేక సమావేశం కనీసం నాుగు రోజు నిర్వహించి దళిత సమస్యపై చర్చించి పరిష్కారానికి కొన్ని చట్టాు రూపొందించాని సిపియం డిమాండ్‌ చేస్తున్నది. 

ఉచిత విద్య ఊసు మరచిన ప్రభుత్వం..

ఇప్పుడు దేశమంతా ‘‘మేక్‌ ఇన్‌ ఇండియా’’ హోరెత్తుతోంది. ఎక్కడెక్కడి పెట్టుబడిదార్లూ వచ్చి పెట్టుబడు కుమ్మరించి వస్తూత్పత్తి చేస్తే చవకగా యువనిపుణుల్ని అందిస్తామని దేశదేశాూ తిరిగి మన ప్రధానమంత్రి ఆహ్వానించి వస్తున్నాడు.
ఇక తొందరలో దేశంలో మూడవస్థానం, ఆ తర్వాత ప్రపంచంలో అగ్రస్థానం పొందే దిశగా ‘అభివృద్ధి’ తారకమంత్రంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని ముఖ్య మంత్రి వారానికో దేశం తిరిగి చెబుతున్నాడు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ప్రపంచాన్ని శాసించిన తొగు యువకు రాష్ట్రాన్ని ఃఖఅశీషశ్రీవసస్త్రవ నబపఃగా మార్చబోతున్నారని ఊరిస్తున్నాడు.

Pages

Subscribe to RSS - August