RR ACT ప్రయోగిస్తే ఊరుకోం:AIKS

ఓపక్క రుణమాఫీ చేశామని ప్రభుత్వం ప్రకటిస్తుంటే... మరోపక్క అప్పు కట్టాలని బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయి. ఇప్పుడు మా కష్టం ఎవరితో చెప్పుకోవాలి' అని రైతులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంకులు అప్పుల వసూళ్లకు దిగుతుండడం.., వర్షాభావంతో ఇప్పటికే పెట్టిన పెట్టుబడులు భూమిలోనే ఇంకిపోవడంతో 'అనంత' రైతున్నలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో కనికరించి రుణవసూళ్లను వాయిదా వేయకపోగా, నోటీసులు పంపి రైతులను మరింత ఆందోళనకు గురిచేయడం పట్ల ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి పి.పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.. RR ACT ప్రయోగిస్తే ఊరుకోమని హెచ్చరించారు .