August

స‌మాజాన్ని మేల్కొ‌లిపేది సాహిత్యమే

కులాలు, మతాలు, మతతత్వం వంటి అంశాలు ప్రాబల్యం చూపుతున్న నేటి పరిస్థితుల్లో సమాజాన్ని మేల్కొలిపేది సాహిత్యమేనని సాహిత్య ప్రస్థానం ఎడిటర్‌, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి పిలుపునిచ్చారు. సాహితీ స్రవంతి ద్వితీయ వార్షికోత్సవం ఆదివారం స్థానిక రోటరీ క్లబ్‌ హాల్లో జరిగింది. ప్రముఖ కవి డాక్టర్‌ అదేపల్లి రామ్మోహనరావు అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో ఎంఎల్‌సి రాము సూర్యా రావుతోపాటు తెలకపల్లి రవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా రవి మాట్లా డుతూ సాహిత్యం నేటి యువత రాన్నీ, విద్యార్థులనూ ఆకట్టు కునేలా ఉండాలన్నారు. 

ప.గో లో సిపిఎం పర్యటన

ప్రజా సమస్యలపై సిపిఎం ప్రచారాందోళనలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్‌ మిడియం బాబూరావు పాఠశాలలనూ, పిహెచ్‌సిలనూ సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

పార్లమెంటు ఎదుట ధర్నా:AIKS

ఆత్మహత్యలు పాల్పడిన రైతుల కుటుంబ సభ్యులు జంతర్‌ మంతర్‌ వద్ద ఆగస్ట్‌ ఈ నెల 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు పార్లమెంటు ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లా చెప్పారు.గత రెండున్నర దశాబ్దాలుగా అమలు చేస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాల ఫలితంగా రైతాంగం చెప్పనలవి కాని బాధలను అనుభవిస్తోందని, వ్యవసాయ రంగం కుదేలయిందని మొల్లా విమర్శించారు. రైతాంగం ఆత్మహత్యలకు ఈ విధానాలే కారణమన్నారు. అధికారిక అంచనాల మేరకు ఈ కాలంలో మూడున్నర లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబ సభ్యులకు కనీసం రూ.

ఆసుపత్రుల అభివృద్దేది :మధు

గుంటూరు, విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రుల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఆధునాతన పరికరాలు ఏర్పాటు చేసి, మౌలిక సదుపాయాలను అభివృద్ధ్ది చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఆయన శుక్రవారం ఒక లేఖ రాశారు. రెండు నగరాల మధ్య రాష్ట్ర రాజధాని నిర్ణయించడంతో ఈ రెండు ఆసుపత్రులకు ప్రాధాన్యత మరింత పెరిగిందని తెలిపారు. ఈ ఆసుపత్రులకు రోజూ సుమారు 1500 మంది ఔట్‌ పేషెంట్లు వస్తుంటారని మధు పేర్కొన్నారు. విజయవాడ ఆస్పత్రిలో ఇన్‌ పేషెంట్ల కోసం 670 పడకలు మంజూరైనా, 412 పడకలు మాత్రమే వినియోగంలో ఉన్నాయని తెలిపారు. రోగుల సంఖ్యను బట్టి మరో 80 పడకలు అవసరమవుతాయన్నారు.

దగాకోరు సంస్కరణలు - మోసపూరిత నినాదాలు

దేశ ప్రజలందరికీ బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి రావాలనీ, గ్రామీణ ప్రాం తాలకు కూడా బ్యాంకులు విస్తరిం చాలనీ, దేశ ఆర్థికాభివృద్ధికి బ్యాంకులు ఎంతో కృషి చేయాలనీ, ఇవి సాధించటం కోసమే 'ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన' ప్రవేశపెట్టిందని ప్రభుత్వ ప్రకటనలు, మంత్రివర్యుల ఉపన్యాసాలు వింటుంటే విస్మయం కలుగుతుంది. బ్యాంకింగ్‌రంగం ఇంకా ఇంకా ప్రజలకు చేరువ కావాలనే సంకల్పం తోనే బ్యాంకింగ్‌రంగ సంస్కరణలు చేపట్టామని పాలక పక్షాలు ప్రచారం చేయటాన్ని సునిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాంకుల జాతీయకరణ జరిగి 46 ఏళ్లు నిండాయి.

నిలువెత్తు నిర్లక్ష్యం..

మధ్యప్రదేశ్‌లో వరుసగా జరిగిన రెండు ఘోర రైలు ప్రమాదాలు దిగ్భ్రాంతినీ, రైల్వే శాఖ నిర్లక్ష్యం పట్ల ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. ప్రయాణీకులతో కిటకిటలాడుతున్న రెండు రైళ్లు నిమిషాల వ్యవధిలో ఒకే ప్రాంతంలో పట్టాలు తప్పడం, 37 మంది దాకా మృతి చెందడం దారుణం. మరో 25 మంది దాకా తీవ్ర గాయాల పాలైనట్లు వార్తలు వస్తున్నాయి. స్థానికులు సకాలంలో స్పందించడంతో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. లేని పక్షంలో పరిస్థితి భిన్నంగా ఉండేది. వాస్తవానికి రైలు ప్రయాణీకుల ప్రాణాలు గాలిలో దీపాలుగా ఎప్పుడో మారిపోయాయి. భద్రతకు ఏమాత్రం పూచీ లేని పరిస్థితి ఏళ్ల తరబడి కొనసాగుతోంది.

తెనాలి జిల్లా వైద్యశాల తనిఖీ..

ప్రజా సమస్యలపై సిపిఎం చేపట్టిన ప్రచారాందోళనల్లో భాగంగా బుధవారం తెనాలి జిల్లా వైద్యశాలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రం బాధ్యత తీసుకుని రాజధాని వైద్యశాలగా అప్‌గ్రేడ్‌ చేసి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. సూపరింటెండెంట్‌ ఈశ్వర ప్రసాద్‌తోనూ, రోగులతోనూ మాట్లాడి వైద్యసేవలపై వివరాలు సేకరించారు. 10 లక్షల మంది ఈ ఆస్పత్రిపై ఆధారపడ్డా అందుకనుగుణంగా సదుపాయాల్లేవన్నారు. డాక్టర్ల కొరతతోపాటు దోభీ, ప్లంబర్‌, ఎలక్ట్రీషియన్‌ పోస్టులను భర్తీ చేయాలన్నారు.

ఎన్నికల్లోCITU ఘన విజయం

విజయవాడలోని ఎపి ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణాలయంలో శుక్రవారం జరిగిన గుర్తింపు సంఘ ఎన్నికల్లో ఎపి గవర్నమెంట్‌ ప్రెస్‌ వర్కర్స్‌ యూనియన్‌(సిఐటియు అనుబంధం) ఘన విజయం సాధించింది. మొత్తం 82 ఓట్లకుగాను 81 ఓట్లు పోలయ్యాయి. వీటిలో సిఐటియు అనుబంధ యూనియన్‌కు 47, ఐఎన్‌టియుసికి 20, ఎఐటియుసికి 14 ఓట్లు వచ్చాయి. దీంతో 27 ఓట్ల మెజార్టీతో సిఐటియు విజయం సాధించింది. 

Pages

Subscribe to RSS - August