August

లక్షల కోట్లుండి జైల్లోనా:SC

సహారా గ్రూపు ఛైర్మన్‌ సుబ్రతా రారుపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం  చేసింది. రూ.1,85,000 కోట్ల ఆస్తులు ఉంచుకుని, అందులో ఐదో వంతు చెల్లించి సమస్యల నుంచి బయట పడవచ్చుగా అని పేర్కొంది. జైల్లో ఉండాలనకుంటే నీ ఇష్టమని న్యాయమూర్తి టిఎస్‌ ఠాకూర్‌తో కూడిన ధర్మాసనం రారుకు సూచించింది. అనేక వ్యాపారాలు కలిగిన రారును జైల్లో ఉంచడం సరైంది కాదని ఆయన తరుపు న్యాయవాధి సీనియర్‌ అడ్వకేట్‌ కపిల్‌ సిబల్‌ కోర్టులో వాధించారు. అనేక వ్యాపార సంస్థలు అప్పులు పడి ఉన్నాయని, అలాంటి వాటిని ఆర్‌బిఐ, బ్యాంకులు ఐదు, పదేళ్ల పాటు పునరుద్దరిస్తున్నాయని పేర్కొన్నారు.

క్రీడాకార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ధర్నా

 

గుంటూరు: తుళ్లూరు క్రీడాకార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టింది. అసైన్డ్ భూయజమానులకూ పరిహారం చెల్లించాలని నినాదాలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది. వ్యవసాయ కార్మికులకు పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేత బాబూరావుతో పాలు పలువురిని అరెస్టు చేశారు.

ప్రశ్నిస్తానన్న పవన్ ఎక్కడ: భజరంగ్ మిల్ కార్మికులు..

 

గుంటూరు: ప్రశ్నించడం కోసమే వచ్చానన్న పవన్‌ ఇప్పుడు ఏం చేస్తున్నారని గుంటూరు భజరంగ్‌మిల్‌ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఉపాధి కల్పించాలంటూ గత రెండు నెలలుగా నిరసనలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాధానం చెప్పాల్సిన మిల్లు యాజమాన్యం ఆస్తులు అమ్ముకునే ఆలోచనలో పడిందని, స్పందించాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారంపై పవన్‌ కల్యాణ్‌ జోక్యం చేసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.

తుళ్లూరు క్రీడా కార్యాలయం సీపీఎం ఆందోళన....

 

గుంటూరు: తుళ్లూరు క్రీడాకార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టింది. అసైన్డ్ భూయజమానులకూ పరిహారం చెల్లించాలని నినాదాలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది. వ్యవసాయ కార్మికులకు పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేత బాబూరావుతో పాలు పలువురిని అరెస్టు చేశారు.

ఆర్థిక విధానంపై ప్రతిష్టంభన..

ఆర్థిక విధానానికి సంబంధించి రిజర్వ్‌ బ్యాంకు, ఆర్థిక మంత్రిత్వ శాఖల మధ్య విభేదాలున్నాయని వార్తా పత్రికల్లో అనేక కథనాలు వచ్చాయి. గవర్నర్‌ అధికారాలను కుదించటానికి భారతీయ రిజర్వ్‌ బ్యాంకు చట్టాన్ని సవరించాలని ప్రభు త్వం ఆలోచిస్తున్నంత తీవ్రంగా ఈ అభిప్రాయభేదాలున్నాయి. అయితే ఈ తేడాలు భారత ఆర్థిక వ్యవస్థలో లోతుగా పాతుకుపో యిన అనారోగ్యానికి సంబంధించిన లక్షణాలే. ఇక్కడ ఎవరు ఒప్పు, ఎవరు తప్పు అనేది కాదు. అసలు విషయం ఏమంటే ఏ విధానాన్ని అవలంబించినా ఆర్థిక వ్యవస్థ మరింత ఒడిదుడుకులకు లోనుకావటం తథ్యమనేది.

రెండు పార్టీలు నాలుగు నాలుకలు..

నవ్యాంద్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై బిజెపి, టిడిపిలు చేస్తున్న విన్యాసాలు జుగుప్స కలిగిస్తున్నాయి. అధికారంలోకొచ్చి సంవత్సరం దాటినా హోదాపై స్పష్టం చేయకుండా ప్రజలను డోలాయమానంలో పడేసేందుకు రెండు పార్టీలు నాలుగు నాల్కలతో మాట్లాడుతున్నాయి. ప్రత్యేక హోదా సహా పునర్విభజన చట్టంలో పొందుపర్చిన, ఆ సందర్భంగా పార్లమెంటు చర్చలో ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తామని బిజెపి, టిడిపి సంయుక్తంగా ప్రజలను నమ్మించి ఓట్లేయించుకొని గద్దెనెక్కాయి. వాగ్దానాల అమలులో రెండు పార్టీలూ కప్పదాట్లకు దిగడం జనానికి వెన్నుపోటు పొడవడమే.

Pages

Subscribe to RSS - August