August

బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడడమే కామ్రేడ్ సూర్యం కు ఘనమైన నివాళి .. సిహెచ్. నరసింగరావు, లోకనాధం

గిరిజన హక్కుల రక్షణకు , బాక్సైటు తవ్వకాలను జరపనివ్వ బోమని .. అటవీ హక్కుల రక్షణకు .. ఆదివాసిలకు మెరుగైన సదుపాయాల కల్పనే .. కా. యెమ్. సూర్యనారాయణకు ఇచ్చే నిజ నివాళి.. సూర్య ప్రధమ వర్దంతి సభలో సి. ఐ. టి. యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు కా. . సి హెచ్. నరసింగ రావు అన్నారు. సూర్య కార్మిక , కర్షక ఉద్యమ స్పూర్తి అని కా. లోకనాధం నివాళి అర్పించారు.  లోకనాధం గారు మాటలాడుతూ  కామ్రేడ్ సూర్యం ప్రజలను ఇష్టపడ్డాడు .. ఈ సమాజం ఇంతకన్నా బాగుపడాలనుకున్నాడు, సమతా సిద్దాంతాన్ని ఇష్టంగా నమ్మాడు. ఉద్యమాన్ని తన చిరునామా చేసుకున్నాడు.. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉద్యమ పిడుగై గర్జించాడు. మైదాన మండలంలో పుట్టిన సూర్యం..

సంఘానికి కట్టడి?

విద్యాలయాల్లో ర్యాగింగ్‌, ఈవ్‌ టీజింగ్‌, వ్యవస్థాగత లోపాలను నిరోధించలేని ప్రభుత్వం, ఆ దారుణాలపై నిలదీసే విద్యార్థి సంఘాలపై ఉక్కుపాదం మోపడం దుర్మార్గం. నిన్న రిషితేశ్వరి, నేడు మధువర్ధనరెడ్డి ర్యాగింగ్‌ భూతానికి బలయ్యారు. సునీత మరణం వివాదాస్పదంగా మారింది. ఆ మరణాలపై నిరసనలు మిన్నంటాయి. నాగార్జున వర్శిటీ ఆర్కిటెక్చర్‌ విద్యార్థిని రిషితేశ్వరి ఉదంతంపై పెద్ద ఉద్యమమే లేచింది. కళాశాలల్లో ర్యాగింగ్‌ మహమ్మారి స్వైర విహారం చేస్తున్నా నిద్ర వీడని సర్కారు, తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు విద్యార్థి సంఘాలను కట్టడి చేయాలనుకోవడం మూర్ఖత్వం.

ప్రైవేటురంగంలో రిజర్వేషన్లకై కృషి..

సిపిఎం ఆధ్వర్యాన రాజమండ్రిలో "ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు" అంశంపై  రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల సాధ్యసాధ్యాల పై పార్లమెంటరీ కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు.. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల కై సిపిఎం కృషి చేస్తోందన్నారు. 

బాబు ఇంటికి T ఎసిబి..

ఓటుకునోటు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఇంటికి, ఎన్టీఆర్ భవన్ కు వెళ్లారు.ఎన్టీఆర్ ట్రస్టు భవన్ అధికారిక డ్రైవర్ కొండల్ రెడ్డిని విచారించేందుకు వెళ్లినట్లు సమాచారం. అయితే ఈ కేసులో ముఖ్యమైన నింధితులు ఎలాంటి సమాచారం వెల్లడించకపోవడంతో ఇలా క్రింది స్థాయి వారి నుంచి సమాచారం సేకరించేందుకు ఏసీబీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎపికి ప్రత్యేకహోదా:సిపిఎం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలని సిపిఎం నగర కార్యదర్శి డి.గౌస్‌ దేశారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గౌస్‌దేశారు మాట్లాడుతూ, ఎన్నికల ముందు బిజెపి నాయకులు ఇచ్చిన హామీలు అమలు చేయాని కోరారు. బిజెపి, టిడిపి కుమ్మ క్కై ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఎన్నిక లకు ముందు ప్రత్యేకహోదాపై గగ్గోలు పెట్టి ఇప్పుడు పలకడం లేదని అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తేవడానికి అన్ని రాజకీయ పార్టీలనూ ఏకం చేసి పోరాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

కేరళ తరహా వెల్ఫేర్‌ బోర్డు అవసరం..

రాష్ట్రంలో చేనేత పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంది. దీన్ని రక్షించాలంటే కేరళలో గతంలో వామపక్ష ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెల్ఫేర్‌ బోర్డు తరహాలో ఇక్కడా ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో మూడు లక్షల మగ్గాలపైనా, వీటి ఉప వృత్తులపైనా ఆధారపడి సుమారు నాలుగు లక్షల మంది జీవిస్తున్నారు. చేనేత సహకార రంగంలో కార్మికులకు 5 శాతానికి మించి పని దొరకడం లేదు. మిగతా వారంతా ప్రైవేటు రంగంలోని మాస్టరు వీవర్ల వద్ద చేనేత పని చేస్తున్నారు. వీరికి కనీస వేతనం (మజూరీ) లభించడం లేదు. వస్తున్న ఆదాయంతో భుక్తి గడవక అప్పులు చేస్తూ ఆకలి చావులకు, ఆత్మహత్యలకు బలవుతున్నారు.

రవాణా కార్మికుల బీమా..ప్రభుత్వ డ్రామా

ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు మేడే రోజున రవాణా కార్మికుల ప్రమాద బీమా పథకాన్ని ప్రకటించి, కార్మికుల పక్షాన ఉన్నట్లు పత్రికల్లో విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. ఈ పథకం ప్రకటన వెనుక కూడా కారణముంది. కార్మికవర్గం తరతరాలుగా పోరాడి, సాధించుకున్న కార్మిక చట్టాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవరణలు చేసి కార్పొరేట్‌ సంస్థలు కార్మికులను మరింత దోపిడీ చేసుకునే విధంగా మార్పులు చేశాయి. కార్మికులు, ఉద్యోగుల నుంచి వస్తున్న వ్యతిరేకతను పక్కదోవ పట్టించేందుకు ట్రాన్స్‌పోర్టు కార్మికుల బీమాను ప్రభుత్వం ప్రకటించింది తప్ప, కార్మికుల సంక్షేమంపై చిత్తశుద్ధితో కాదు. ఇది కార్మికులకు శాశ్వత పథకం కాదు.

Pages

Subscribe to RSS - August