August

మాప్రాణాలు పోయిన అడ్డుకొంటాం:సిపిఎం

గతంలో పట్టాలిచ్చిన అటవీ భూములను చంద్రబాబు తిరిగి లాక్కోవాలని చూస్తున్నారని,మా ప్రాణాలు పోయినా సరే అడ్డుకొని తీరుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హెచ్చరించారు.

ఏపికి ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలకు సిద్ధం

రాష్ట్ర పునర్విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పిస్తామని కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయకపోతే ఉద్యమాలకు సిద్ధం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు పిలుపునిచ్చారు .ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని శుక్రవారం మరోసారి కేంద్ర మంత్రి లోక్‌సభలో ప్రకటించడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్ర పునర్విభజన బిల్లుపై చర్చ సందర్భంగా అప్పటి ప్రధాని, ప్రతిపక్షపార్టీ నాయకులు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇదేనా మహిళోద్ధరణ అంటే..

విదేశీ పెట్టుబడిదారులతో దేశం అధోగతిపడుతోందని, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి సింగపూర్‌, జపాన్‌ల వంటి వలస పాలన అవసరం లేదని ధ్వజమెత్తారు. సొంత వనరులపై ఆధారపడి ప్రభుత్వాలు పాలన సాగించాలని ఆయన సూచించారు. డ్వాక్రా మహిళల రుణమాఫీ˜ీ, మద్య నియంత్రణ అంశాలపై శుక్రవారం ఇక్కడ మహిళా సంఘాల రాష్ట్ర సదస్సులో ఆయన ప్రసంగించారు.. ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు వి. జయలక్ష్మి అధ్యక్షత వహించారు. సదస్సులో మధు మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు ప్రకటించినట్లుగా మహిళలకు సంపూర్ణ రుణమాఫీ న్యాయ సమ్మతమేనన్నారు.

'సాగు' సమస్యల సుడిగుండంలో కౌలు రైతులు

రాష్ట్రంలో ఖరీఫ్‌ వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతు న్నాయి. గత వ్యవసాయ లాభ నష్టా లు మరిచిపోయి ఎన్నో ఆశలతో 'సాగు' కదనరంగంలోకి దూకుతున్న 'సాగు' దారులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. రాష్ట్రంలో 20 లక్షల మంది కౌలు రైతులున్నారు. సాగు భూమిలో 70 శాతం పైగా వీరే సాగు చేస్తున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, తదితర జిల్లాల్లో వ్యవసాయరంగంలో కౌలు రైతులే ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. వారి సమస్యలను మాత్రం పాలకులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు.

గ్రీస్‌ పరిస్థితిపై అత్యవసర భేటీ

ఆర్థిక సంస్థల షరతులకు 'నో' చెప్పిన గ్రీస్‌ తాజా పరిస్థితిపై చర్చించేందుకు యూరో జోన్‌ దేశాల నేతలు మంగళవారం ఇక్కడ అత్యవసర భేటీ నిర్వహించారు. రిఫరెండం ఫలితాలతో బలం పుంజుకున్న గ్రీస్‌ ప్రధాని అలెక్సిస్‌ సిప్రాస్‌ ఆర్థిక సంస్థలతో చర్చలకు కొత్త ప్రతిపాదనలు తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. గత సోమవారం నుండి కొనసాగుతున్న బ్యాంకుల మూసివేతను గ్రీస్‌ ప్రభుత్వం గురువారం వరకూ పొడిగించటం, ఎటిఎంలలో నగదు నిల్వలు అడుగంటటం వంటి పరిస్థితుల నేపథ్యంలో బెయిలవుట్‌ చర్చల పునరుద్ధరణకు సిప్రాస్‌ నుండి తాజా ప్రతి పాదనలను ఆహ్వానించేందుకు సిద్ధమ య్యారు.

Pages

Subscribe to RSS - August