August

నిలువెత్తు నిర్లక్ష్యం..

మధ్యప్రదేశ్‌లో వరుసగా జరిగిన రెండు ఘోర రైలు ప్రమాదాలు దిగ్భ్రాంతినీ, రైల్వే శాఖ నిర్లక్ష్యం పట్ల ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. ప్రయాణీకులతో కిటకిటలాడుతున్న రెండు రైళ్లు నిమిషాల వ్యవధిలో ఒకే ప్రాంతంలో పట్టాలు తప్పడం, 37 మంది దాకా మృతి చెందడం దారుణం. మరో 25 మంది దాకా తీవ్ర గాయాల పాలైనట్లు వార్తలు వస్తున్నాయి. స్థానికులు సకాలంలో స్పందించడంతో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. లేని పక్షంలో పరిస్థితి భిన్నంగా ఉండేది. వాస్తవానికి రైలు ప్రయాణీకుల ప్రాణాలు గాలిలో దీపాలుగా ఎప్పుడో మారిపోయాయి. భద్రతకు ఏమాత్రం పూచీ లేని పరిస్థితి ఏళ్ల తరబడి కొనసాగుతోంది.

తెనాలి జిల్లా వైద్యశాల తనిఖీ..

ప్రజా సమస్యలపై సిపిఎం చేపట్టిన ప్రచారాందోళనల్లో భాగంగా బుధవారం తెనాలి జిల్లా వైద్యశాలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రం బాధ్యత తీసుకుని రాజధాని వైద్యశాలగా అప్‌గ్రేడ్‌ చేసి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. సూపరింటెండెంట్‌ ఈశ్వర ప్రసాద్‌తోనూ, రోగులతోనూ మాట్లాడి వైద్యసేవలపై వివరాలు సేకరించారు. 10 లక్షల మంది ఈ ఆస్పత్రిపై ఆధారపడ్డా అందుకనుగుణంగా సదుపాయాల్లేవన్నారు. డాక్టర్ల కొరతతోపాటు దోభీ, ప్లంబర్‌, ఎలక్ట్రీషియన్‌ పోస్టులను భర్తీ చేయాలన్నారు.

ఎన్నికల్లోCITU ఘన విజయం

విజయవాడలోని ఎపి ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణాలయంలో శుక్రవారం జరిగిన గుర్తింపు సంఘ ఎన్నికల్లో ఎపి గవర్నమెంట్‌ ప్రెస్‌ వర్కర్స్‌ యూనియన్‌(సిఐటియు అనుబంధం) ఘన విజయం సాధించింది. మొత్తం 82 ఓట్లకుగాను 81 ఓట్లు పోలయ్యాయి. వీటిలో సిఐటియు అనుబంధ యూనియన్‌కు 47, ఐఎన్‌టియుసికి 20, ఎఐటియుసికి 14 ఓట్లు వచ్చాయి. దీంతో 27 ఓట్ల మెజార్టీతో సిఐటియు విజయం సాధించింది. 

సమస్యలకు నిలయంగా ప్రభుత్వ ఆసుపత్రులు -

సమస్యల నిలయంగా అనకాపల్లి ఆసుపత్రి..
సరిపడిన స్టాప్ లేకపోవడంతో అవస్ధలు పడుతున్న రోగులు..
కొన్ని రోగాలకు దోరకని మందులు..
ప్రజారోగ్యవ్యవస్ధను నీరుకారుస్తున్నరని ప్రభుత్వం పై మండిపాటు..
ఆరోగ్యవ్యవస్ధ పరిరక్షణాకే ఉధ్యమిస్తాం..

ప్రచారోద్యమంలో భాగంగా అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సర్వేలో పాల్గోన్న సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి కె.లోకనాధం , అనకపల్లి డివిజన్ కార్యదర్శి ఎ. బాలకృష్ణ...

RR ACT ప్రయోగిస్తే ఊరుకోం:AIKS

ఓపక్క రుణమాఫీ చేశామని ప్రభుత్వం ప్రకటిస్తుంటే... మరోపక్క అప్పు కట్టాలని బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయి. ఇప్పుడు మా కష్టం ఎవరితో చెప్పుకోవాలి' అని రైతులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంకులు అప్పుల వసూళ్లకు దిగుతుండడం.., వర్షాభావంతో ఇప్పటికే పెట్టిన పెట్టుబడులు భూమిలోనే ఇంకిపోవడంతో 'అనంత' రైతున్నలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో కనికరించి రుణవసూళ్లను వాయిదా వేయకపోగా, నోటీసులు పంపి రైతులను మరింత ఆందోళనకు గురిచేయడం పట్ల ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి పి.పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.. RR ACT ప్రయోగిస్తే ఊరుకోమని హెచ్చరించారు .

సంస్కారం

తాము నమ్మిన సంప్రదాయమే సంస్కారం అనుకునేవారికి నిజమైన మానవీయ స్పర్శ ఎలా వుంటుందో చూపించడం అంత సులభం కాదు. చలనం లేని వాళ్లను కదిలించాలంటే సంచలనం తీసుకురావలసి వుంటుంది. ఓ నాలుగు దశాబ్దాల కిందట భారత దేశానికి ప్రత్యేకించి దక్షిణ భారత దేశానికి ఆ విధమైన అనుభవం ఇచ్చిన కన్నడ నవల 'సంస్కార'. సాహిత్య కారులు పాఠకులు ఎవ రైనా సరే ఇతర భాషల దేశాల పుస్తకాలుకూడా చూడకుండా అవగా హనా పరిధి పెంచుకోలేరు.కనీసం ప్రసిద్ధ రచనలు ప్రసిద్ధుల రచనలైనా చూడకపోతే అదొక లోటుగానే వుండిపోతుంది. అందుకే 'సంస్కార' తెలుగు అనువాదం ఇప్పుడు ప్రజాశక్తి ప్రచురణగా రావడం స్వాగతించదగింది. తెలుగులో సమస్యాత్మక నవలలే తక్కువగా వస్తున్న తరుణం.

Pages

Subscribe to RSS - August