ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లును వ్యతిరేకిస్తూ, డిగ్రీలో సెమిస్టర్ విధానాన్నీ రద్దు చేయాలని, సంక్షేమ హాస్టళ్ళను మూసివేసే జీవో నెంబర్ 45ను రద్దు చేయాలని, విద్యా హక్కు చట్టాన్ని పటి ష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు సంఘా ల ఆధర్యంలో ఏర్పడిన విద్యార్థి సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 7 తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నాం. విలీనం పేరుతో 20 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉన్న పాఠశాలలు మూసివేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీని ద్వారా ఐదు వేలకు పైగా పాఠశాలలు మూత పడుతున్నాయి.