MROవనజాక్షికి హెచ్చ‌రిక‌లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన తహశీల్దార్ వనజాక్షి మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. ఆమెకు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు లేఖను పంపారు. ముసునూరు నుండి బదిలీపై వెళ్లిపోవాలని లేకుంటే కుటుంబం మొత్తాన్ని చంపుతామని లేఖలో హెచ్చరికలు చేశారు. దీనితో ముసునూరు పీఎస్ లో వనజాక్షి ఫిర్యాదు చేసింది. ముసూనూరు తహశీల్దార్ గా వనజాక్షి విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అక్రమ ఇసుక రవాణాను చేస్తున్నారంటూ తనిఖీలకు వెళ్లిన వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇతర ఉద్యోగులు దీనిని తీవ్రంగా ఖండించారు. వనజాక్షికి న్యాయం చేయాలంటూ పోరాటం చేపట్టారు. చివరకు సీఎం చంద్రబాబు జోక్యం చేసుకున్నారు. వనజాక్షి, చింతమనేనితో మాట్లాడారు. ఇందులో వనజాక్షిదే తప్పని బాబు పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. అనంతరం ఈ వివాదం సద్దుమణిగింది. వనజాక్షికి బెదిరింపులు లేఖలు ఎటువైపుకు దారి తీస్తాయో చూడాలి.