ఏపీ ప్రత్యేక హోదా పై కారత్

ఏపీకి వెంటనే ప్రత్యేక హోదా కల్పించాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ డిమాండ్ చేశారు. 'ప్రజాస్వామ్యం- కార్పొరేట్ రాజకీయాలుస అనే అంశం పై గుంటూరులో సదస్సు జరిగింది. ఈ సదస్సులో పధ్రాన వ‌క్త‌గా కారత్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ... ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదాపై వాగ్ధానాలు గుప్పించిన బిజెపి ఇప్పుడెందుకు మాట మార్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వలేమని మంత్రి ఇంద్రజిత్ ప్రకటించడం సరికాదన్నారు.