August

'పోలాకి' థర్మల్‌ అధర్మాలు..

శ్రీకాకుళం జిల్లా పోలాకిలో థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అడ్డదార్లు తొక్కుతోంది. ఎనిమిది గ్రామాల్లోని సుమారు రెండు వేల ఎకరాల భూములు గుంజుకోజూస్తున్నది. రైతులు సుక్షేత్రాలైన భూములను కోల్పోతే వ్యవసాయ కార్మికులు, వృత్తిదార్ల జీవనోపాధి పోతుంది. ప్లాంట్‌ నిర్మాణం చేపట్టడానికి ముందుగా చేయాల్సిన కనీస నియమ నిబంధనలను పాటించకపోవడమేగాక సాధారణ ప్రజాతంత్ర హక్కులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలోని విద్యుత్‌రంగ పరిస్థితి అంటే ఇప్పుడు పని చేస్తున్న, నిర్మాణంలో ఉన్న, ఇప్పటికే ప్రకటించిన ప్లాంట్లు, విద్యుత్‌ డిమాండ్‌, సరఫరా, తదితర వివరాలు చూద్దాం.

కార్మిక సంఘాల ఐక్యగళం:CITU

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్‌ 2న దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు జయప్రదం చేయాలని వివిధ కార్మిక సంఘాల నాయకులు పిలుపు నిచ్చారు. ఆగస్టు 17న హిందూ పురం నుంచి బయలుదేరిన బస్సు జాతా శనివారం రాత్రి రాజమండ్రికి చేరుకుంది. ఈ సందర్భంగా బొమ్మన రామచంద్రరావు ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ట్రస్ట్‌ హాల్లో జరిగిన సభలో వివిధ కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగ సమాఖ్య నాయకులు మాట్లాడారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ, ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయన్నారు.

భూ ఆర్డినెన్స్‌ చెల్లదు:సిపిఎం

బలవంతపు భూ సేకరణ తగదు-సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు రాజధాని పరిధిలో బలవంతపు భూసేకరణ తగదని, ఈ ప్రక్రియను వెంటనే నిలిపేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజధానికి సరిపోయినన్ని భూములు ఇప్పటికే సమీకరించారని, కొత్తగా సేకరించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. రైతుల భూములను పెద్దపెద్ద కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టేందుకే ప్రభుత్వం సేకరణకు వెళ్లిందని ఆయన విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన భూ ఆర్డినెన్స్‌లను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సేకరణ ప్రకటన చేయడం ఏ మాత్రమూ క్షమార్హం కాదని పేర్కొన్నారు.

రెవెన్యూశాఖ లోపం వల్లే:దడాల

రెవెన్యూ శాఖ లోపం వల్లే తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం పోలేకుర్రుని కోరంగి కంపెనీ భూ వివాదానికి కారణమని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు అన్నారు. కోరంగి పంచాయతీ సీతారామపురంలో కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు గృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రిటీషు పాలన అనంతరం కోరంగి రైసుమిల్లు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు. ఇటీవల రైసుమిల్లును పడగొట్టి ఒకరు ఇటుక, ఇంకొకరు కలప తరలించుకు పోయానా రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం చూస్తూ ఊరుకుందన్నారు.

గోల్ఫ్‌కోర్టులు,విల్లాల కోసమే భూసేకరణ..

రాజధాని కోసమే భూ సేకరణ చేస్తున్నామంటున్న ప్రభుత్వ మాటల్లో వాస్తవం లేదని సిపిఎం క్రిడా ప్రాంత కమి టీ కన్వీనర్‌ సిహెచ్‌ బాబూరావు గురువారం విలేకరుల సమా వేశంలో విమర్శించారు. రైతుల భూములను లాక్కొని సింగ పూర్‌, జపాన్‌ తదితర కంపెనీల వ్యాపారాలకు అప్పగించ డానికే బలవంతపు భూ సేకరణని, అందుకు ముఖ్యమంత్రి బెదిరించడం అప్రజాస్వామికమని ఆందోళన వ్యక్తం చేశారు. అది గోల్ఫ్‌ కోర్టులు, ధనవంతులకు విల్లాల నిర్మాణం కోసం సేకరించే భూమి మాత్రమేనని విమర్శించారు. అభివృద్ధి కోసం భూములు సేకరించకపోతే ఏలా అని మంత్రి యనమ ల రామకృష్ణుడు అంటున్నారని, ఇది ఎవరి అభివృద్ధి కోసమని ప్రశ్నించారు.

తొలివిడతలో 5 గ్రామాల్లో 11 ఎకరాల భూసేకరణ..

రాజధాని ప్రాంతంలో భూ సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా ఇంతవరకు యూనిట్‌ అధికారులగా ఉన్న స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లను, ల్యాండ్‌ అక్విజిషన్‌ అధికారులుగా మారుస్తూ 304 నెంబరుతో జిఓ జారీ అయింది. 9.2 అభ్యంతర పత్రాలను తిరస్కరిస్తున్నట్లు రేపటి నుండి నోటిఫికేషన్లు ఇవ్వనుంది. వీటిని ఆయా కార్యాలయాల పరిధిలో బహిరంగంగా ఏర్పాటు చేస్తారు. వీటిపై అభిప్రాయాలు చెప్పుకునేందుకు వారం రోజులు గడువిచ్చారు. వాటిని కూడా పరిష్కరించిన అనంతరం గ్రామాలవారీగా సేకరణ నోటిఫికేషన్‌ ఇస్తామని సిఆర్‌డిఎ అధికారులు చెప్పారు. అయితే గురువారం రాత్రి తొలి విడత నోటిఫికేషన్‌ విడుదలైంది.

పేదలు,విద్యార్థులపై కేసులా?

తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం కోరంగిలో 21 మంది మహిళలతో సహా మొత్తం 49 మంది పేద రైతులపై అక్రమంగా నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ఖండించారు. తాళ్లరేవు మండలంలో ప్రభుత్వ భూమిని పేద రైతులు చాలా కాలంగా సాగు చేసుకొంటున్నారన్నారు. తప్పుడు రికార్డుతో ఒక భూస్వామి ఆ భూమిని ఈ నెల 20వ తేదీన సాగు చేసుకొనేందుకు వచ్చాడన్నారు. అతనిని పేద రైతులు అడ్డుకోగా, పోలీసులు లాఠీఛార్జితోపాటు, భూస్వామి అనుచరులు దాడి చేశారన్నారు.

CPM కేంద్రకమిటీ సమావేశాలు..

ఢిల్లీలో సీపీఎం కేంద్రకమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఎపి, తెలంగాణ కేంద్రకమిటీ సభ్యులు బివి.రాఘవులు, తమ్మినేని వీరభద్రం, పి.మధు ఇతర కేంద్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు. దేశ రాజకీయ పరిస్థితులు, బీహార్ ఎన్నికలు, అక్టోబర్ లో జరుగనున్న ప్లీనరీపై చర్చిస్తున్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు సమావేశాలు జరుగనున్నాయి. 

చింతూరులో రాస్తారోకో..

విలీన మండలాల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆద్వర్యంలో నేడు బంద్ కొనసాగుతోంది..కూన‌వ‌రం, వీఆర్ పురం, చింతూరు, ఎట‌పాక‌, కుకునూరు, వేలేరుపాడులో  సీపీఎం ఇచ్చిన పిలుపు అంద‌రినీ క‌దిలించ‌డంతో వివిధ వ‌ర్గాలు మ‌ద్ద‌తు తెలుపుతున్నాయి. ముఖ్యంగా విలీనం జ‌రిగి ఏడాదిన్న‌ర గ‌డుస్తున్నా క‌నీస స‌మ‌స్య‌లు కూడా ప‌రిష్కారం కాక ర‌గిలిపోతున్న జ‌నాల ఆగ్ర‌హం బంద్ రూపంలో వ్య‌క్త‌మ‌వుతోంది.. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మిడియం బాబురావు చింతూరులో బంద్ కార్యక్రమంలో పాల్గొని రాస్తారోకో నిర్వహించారు..

 

 

Pages

Subscribe to RSS - August