August

దళితులకు సముచితస్థానం:CPM

రాజధాని ప్రాంతం నుండి పేదలను, దళితులను తరిమివేసేందుకు పాలకులు కుట్రలు చేస్తున్నారని ఈ కుట్రలకు వ్యతిరేకంగా పేదలంతా ఐక్యమై పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం.రవి అన్నారు. ఎస్‌సి, ఎస్‌టి రైట్స్‌ అండ్‌ యాక్ట్స్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళగిరి అంబేద్కర్‌ సెంటర్లో శుక్రవారం దళిత దీక్ష జరిగింది. ఈ దీక్షను బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎస్‌డిఈ దుంగా రత్నప్రదీప్‌ ప్రారంభించారు.

సంక్షోభంలో వ్యవసాయం:AIAWU

దేశంలో అమలవుతున్న సరళీకరణ విధానాల ద్వారా వ్వవసాయరంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని వ్వవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారంబ్రాడిపేటలోని సిపిఎం కార్యాలయం లో ఎపిరైతుసంఘం, వ్వవసాయక ార్మికసంఘం సంయుక్త అధ్వర్యంలో రైతుసంఘంజిల్లా కార్యదర్శి వై.రాధాకృష్ణ అధ్యక్షతన రౌండ్‌టెబుల్‌ సమావేశం నిర్వహించారు. వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ .రైతుల అత్మహత్యలు పెరుగుతున్నాయని, వ్వవసాయ పనులు లేక రైతులు, రైతుకూలీలు, వలసలు వెళ్తున్నారన్నారు. గ్రామీణ ఉపాధిహామీ చట్టానికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తూట్లు పోడుస్తున్నాయని విమర్శించారు.

పోలాకి ధర్మల్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన..

ఏళ్లతరబడి సాగు చేసుకొంటున్న భూములను పేదల నుంచి బలవంతంగా తీసుకునే సత్తా ప్రభుత్వంతోపాటు ఎవరికీ లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పోలాకిలో నిర్మించ తలపెట్టిన థర్మల్‌ విద్యుత్‌ ప్రభావిత ప్రాంతాలైన సన్యాసిరాజుపేట, ఓదిపాడు, తోటాడ గ్రామాల్లో శుక్రవారం ఆయన పరిశీలించారు. పోలాకి మండల కేంద్రంలో రైతులతో మాట్లాడారు. జిఒ 1307 ప్రకారం బలవంతంగా భూములు లాక్కోవడం సాధ్యం కాదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 35 థర్మల్‌ ప్రాజెక్టులున్నాయని, రాష్ట్రావసరాలకు సరిపడా విద్యుదుత్పత్తి ఉండగా, ఇంకా కొత్త పవర్‌ ప్లాంట్ల అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

ఆందోళనలతో భూసేకరణపై తలొగ్గిన ప్రభుత్వం..

రాజధాని గ్రామాల్లో భూ సేకరణకు తాత్కాలికంగా స్వస్థిపలుకుతూ సమీకరణ ద్వారానే భూములు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 20న జారీ చేసిన నోటిఫికేషన్లను నిలిపివేశారు. భూ సేకరణకు వ్యతిరేకంగా సిపిఎం ఇప్పటికే రాజధాని గ్రామాల్లో పలు ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించింది. సిఆర్‌డిఎ కార్యాలయాల ఎదుట ధర్నాలు, ప్రకాశం బ్యారేజిపై రాస్తారోకో, నిరసన ప్రదర్శనలతో ప్రభుత్వం చర్యలకు నిరసనగా ప్రజలను సమాయత్త పరచటంలో సిపిఎం గత కొంత కాలంగా పోరుబాట నిర్వహిస్తుంది.

ప్రైవేటు వర్సిటీలు వద్దు: SFI

 ప్రభుత్వం ప్రయివేట్‌ విద్యను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే కుట్రకు పాల్పడుతుందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.లక్ష్మణరావు ఆరోపించారు. ఆదివారం ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశం నిర్వహించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ శనివారం విజయవాడలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా 20 ప్రయివేట్‌ యూనివర్సిటీలను ఏర్పాటు చేయటం కోసం కేబినెట్‌ చర్చించి ఆమోదం తెలిపిందన్నారు. దీనిని ఎస్‌ఎఫ్‌ఐ పూర్తిగా వ్యతిరేకిస్తుందని చెప్పారు.

విద్యకు మలాలా ప్రతీక:AIDWA

 'నా రెక్కలు విరవని నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు' అని చెప్పిన స్వేచ్ఛాజీవి, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌ జారు మహిళా విద్యకు, ప్రపంచశాంతికి ప్రతీక అని వక్తలు పేర్కొన్నారు. మలాలాను, ఆమె తల్లిదండ్రులను ప్రతి ఒక్కరూ స్పూర్తిగా తీసుకోవాలన్నారు. స్థానిక వింజనంపాడులోని కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) సంయుక్తంగా కళాశాలలో శుక్రవారం మలాలా స్వీయ గాధను తెలియచేస్తూ ' నేను మలాలా' పేరుతో ముద్రించిన పుస్తకాన్ని వేలాది మంది విద్యార్థులు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు కళాశాల చైర్మన్‌ కోయ సుబ్బారావు అధ్యక్షత వహించారు.

AP ప్రత్యేకహోదాపై ఏచూరి

కేంద్రానికి  ప్రత్యేకహోదా ఇచ్చే లక్షణాలు కనపడటం లేదని, అటువంటి ఆలోచన కూడా ఉన్నట్లు లేదని అన్నారు. రాష్ట్ర విభజనకు ముందే ఇటువంటి సమ స్యలన్నింటిని పరిష్కరించి నిర్ణయం తీసుకోవాలని తాము ఆనాడు కోరినా.. పట్టించుకోలేదని  సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.

 

CPM అగ్రనేతలపై దాడులు..

వ్యవసాయోత్పత్తులకు మద్దతు ధర కల్పించాలని, వరదల వల్ల నష్టాలపాలైన రైతులకు పరిహారం చెల్లించాలని, నిత్యావసరాల ధరలు తగ్గించాలని, భూసేకరణ ఆర్డినెన్స్‌ విరమించుకోవాలని తదితర 17 డిమాండ్లతో వామపక్ష రైతు సంఘాలు గురువారం నాడు 'చలో సచివాలయం' కార్యక్రమాన్ని చేపట్టాయి.ప్రజాస్వామిక హక్కులను కాలరాయడంలో అందెవేసిన తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం తాజాగా మరోసారి పైశాచికానికి పాల్పడింది.సమస్యల పరిష్కారం కోసం రైతులు ప్రశాంతంగా నిర్వహిస్తున్న ప్రదర్శనపైకి పోలీసులను ఉసిగొల్పి నెత్తుటేరుల్లో ముంచింది. దీంతో కొల్‌కతా నగర వీధులు రణరంగంగా మారాయి.

గ్రామ‌కంఠాల స‌ర్వే‌పై ఆగ్రహం

ప్రభుత్వం చేసే మోసకారి పనులు ఇప్పుడిప్పుడే నూతన రాజధానిగా ప్రకటించిన అమరావతి 29 గ్రామాల్లో ప్రజలకు అర్థమవుతున్నాయి. తమ ప్రభుత్వం అని నమ్మి భూములిచ్చిన రైతులకు ప్రస్తుతం గ్రామకంఠాల విషయమై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో వారిలో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. గ్రామాల్లో మంత్రులను మేళతాళాలతో ఊరేగించిన ప్రజలే ఇళ్లల్లో పెట్టి కదలడానికి వీల్లేదని నిర్బంధిస్తున్నారు. గ్రామకంఠాల విషయమై ఎటూ తేల్చకపోతే ప్రభుత్వ వ్యవహారాన్ని తేలుస్తామని తెగేసి చెబుతున్నారు.

Pages

Subscribe to RSS - August