August

మజ్దూర్‌ సంఘ్‌ సమ్మెకు దూరం..

 మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక సంస్కరణలను నిరసిస్తూ కార్మిక సంఘాలు సెప్టెంబరు 2న తలపెట్టిన సమ్మెలో పాల్గొనాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. బ్యాకింగ్‌ పరిశ్రమపై దాడులు పెరిగిపోయాయని, ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సి.హెచ్‌.వెంకటాచలం తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ సమ్మెకు దూరంగా ఉండాలని నిర్ణయించింది.

అరకొరతో అభివృద్ధి ఎలా?

ఏపిికి కేంద్ర ప్రభుత్వం రూ 1,976 కోట్లు ఆర్థిక సహాయం ప్రకటించడంపై సిపిఐ రాష్ట్ర సమితి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అత్యల్ప నిధుల కేటాయింపులతో వెనుకబడ్డ జిల్లాల్లో అభివృద్ధి ఎలా సాధించగలమో తెలపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు.గత రెండేళ్ళలో ఏడాదికి రూ 350 కోట్లు చొప్పున రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు రూ 700 కోట్లు విడుదల చేశారని వివరించారు. రాజధాని నిర్మాణం కోసం కేటాయించిన రూ 450 కోట్లతో ఏ నిర్మాణాలు, ఎంతకాలంలో చేపడతారో తెలియడంలేదని విమర్శించారు. రాష్ట్ర రెవెన్యూలోటు రూ 16 వేట కోట్లు ఉండగా..

పుష్కర ఏర్పాట్ల పరిశీలన..

కృష్ణా పుష్కరాల్లో పని చేస్తున్న దాదాపు 25 వేల మంది పారిశుధ్య కార్మికులకు ప్రతి రోజూ రూ.400 చొప్పున వేతనం అందేలా చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు బుధవారం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆయన పున్నమీ, భవానీ ఘాట్‌లలో పుష్కర ఏర్పాట్లు, కార్మికులకు అందజేస్తున్న వేతనాలు, పనుల వివరాలను కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాలకు ప్రతి రోజూ 35 లక్షలకు తగ్గకుండా యాత్రికులు వస్తారనీ, ప్రభుత్వం అంచనా వేసి అందుకు తగ్గట్టుగా నిధులు ఖర్చు చేసిందనీ చెప్పారు. కానీ అధికారిక లెక్కల ప్రకారం కేవలం 12.70 లక్షల మందే వస్తున్నారన్నారు.

మోడీ సభకు రూ.50 కోట్లు అంచనా

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ నెల 7వ తేదీన మోదీ మెదక్ జిల్లా కోమటిబండ వద్ద ‘మిషన్ భగీరథ’ను  ప్రారంభిస్తున్న విషయం విదితమే. ప్రధాని అబ్చురపడేలా సభా వేదికను తీర్చిదిద్దుతున్నారు. సభ నిర్వహణ కోసం ప్రభుత్వం రూ 50 కోట్ల వరకు ఖర్చు చేస్తోం దని అంచనా. 

జీఎస్టీ పోర్టల్ ఇన్ఫోసిస్ కు..

ఎట్టకేలకు ఎంతో ప్రతిష్టాత్మకమైన బిల్లు జీఎస్టీని రాజ్యసభ బుధవారం ఆమోదించేసింది. అయితే ప్రస్తుతం ఈ బిల్లు అమలుకు ప్రభుత్వం సిద్ధమవడమే. దీనికి కూడా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించేసిందట. జీఎస్టీ బిల్లు పోర్టల్ తయారీని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అప్పజెప్పేసిందట. 2017 ఏప్రిల్ 1 నుంచి ఈ బిల్లును అమలులోకి తేవాలని కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వానికి ఈ కంపెనీ జీఎస్టీకి అవసరమైన పూర్తి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ ఫ్రాక్ట్చర్ను అందించనుంది.

హోదాపై బాబుకు ముద్రగడ సవాల్

 ప్రత్యేక హోదాపై చంద్రబాబు, ఆయన తనయుడు కేంద్రానికి వ్యతిరేకంగా ఆమరణ దీక్ష చేయడానికి సిద్ధపడితే.. తాను కూడా వారితో పాటు దీక్షలో కూర్చుంటానని ముద్రగడ స్పష్టం చేశారు. దీనిని సవాల్గా తీసుకొని దీక్ష ప్రారంభించి కబురుపెట్టమని చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

జీఎస్‌టీ అనేది తిరోగమన పన్ను:ఏచూరి

జీఎస్‌టీ అనేది తిరోగమన పన్ను. అది పేదలపై భారం మోపుతుంది.. దానిని తక్కువగా ఉంచాలి. బడ్జెట్‌లో పరోక్ష పన్నులను రూ. 20,000 కోట్ల మేర పెంచారు. ప్రభుత్వం పేదలను పణంగా పెట్టి ధనికులను మరింత ధనవంతులను చేస్తోంది అని సీపీఎం నేత సీతారాం ఏచూరి అన్నారు 

Pages

Subscribe to RSS - August