మోడీ సభకు రూ.50 కోట్లు అంచనా

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ నెల 7వ తేదీన మోదీ మెదక్ జిల్లా కోమటిబండ వద్ద ‘మిషన్ భగీరథ’ను  ప్రారంభిస్తున్న విషయం విదితమే. ప్రధాని అబ్చురపడేలా సభా వేదికను తీర్చిదిద్దుతున్నారు. సభ నిర్వహణ కోసం ప్రభుత్వం రూ 50 కోట్ల వరకు ఖర్చు చేస్తోం దని అంచనా.