August

మోడీ సభకు రూ.50 కోట్లు అంచనా

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ నెల 7వ తేదీన మోదీ మెదక్ జిల్లా కోమటిబండ వద్ద ‘మిషన్ భగీరథ’ను  ప్రారంభిస్తున్న విషయం విదితమే. ప్రధాని అబ్చురపడేలా సభా వేదికను తీర్చిదిద్దుతున్నారు. సభ నిర్వహణ కోసం ప్రభుత్వం రూ 50 కోట్ల వరకు ఖర్చు చేస్తోం దని అంచనా. 

జీఎస్టీ పోర్టల్ ఇన్ఫోసిస్ కు..

ఎట్టకేలకు ఎంతో ప్రతిష్టాత్మకమైన బిల్లు జీఎస్టీని రాజ్యసభ బుధవారం ఆమోదించేసింది. అయితే ప్రస్తుతం ఈ బిల్లు అమలుకు ప్రభుత్వం సిద్ధమవడమే. దీనికి కూడా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించేసిందట. జీఎస్టీ బిల్లు పోర్టల్ తయారీని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అప్పజెప్పేసిందట. 2017 ఏప్రిల్ 1 నుంచి ఈ బిల్లును అమలులోకి తేవాలని కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వానికి ఈ కంపెనీ జీఎస్టీకి అవసరమైన పూర్తి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ ఫ్రాక్ట్చర్ను అందించనుంది.

హోదాపై బాబుకు ముద్రగడ సవాల్

 ప్రత్యేక హోదాపై చంద్రబాబు, ఆయన తనయుడు కేంద్రానికి వ్యతిరేకంగా ఆమరణ దీక్ష చేయడానికి సిద్ధపడితే.. తాను కూడా వారితో పాటు దీక్షలో కూర్చుంటానని ముద్రగడ స్పష్టం చేశారు. దీనిని సవాల్గా తీసుకొని దీక్ష ప్రారంభించి కబురుపెట్టమని చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

జీఎస్‌టీ అనేది తిరోగమన పన్ను:ఏచూరి

జీఎస్‌టీ అనేది తిరోగమన పన్ను. అది పేదలపై భారం మోపుతుంది.. దానిని తక్కువగా ఉంచాలి. బడ్జెట్‌లో పరోక్ష పన్నులను రూ. 20,000 కోట్ల మేర పెంచారు. ప్రభుత్వం పేదలను పణంగా పెట్టి ధనికులను మరింత ధనవంతులను చేస్తోంది అని సీపీఎం నేత సీతారాం ఏచూరి అన్నారు 

హైకోర్టులో షాక్.. సుప్రీమ్ కు కేజ్రీ

అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది.  ఢిల్లీ మంత్రివర్గం ఇచ్చే సలహాల ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ నడుచుకోవాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 239వ అధికరణం ఇంకా అమలులోనే ఉందని, దాని ప్రకారం ఢిల్లీ ఇంకా కేంద్రపాలిత ప్రాంతమే అవుతుందని తెలిపింది. ముందుగా లెఫ్టినెంట్ గవర్నర్‌కు చెప్పకుండా మంత్రివర్గం ఎలాంటి నిర్ణయం తీసుకోడానికి వీల్లేదని కూడా కోర్టు చెప్పింది. కేంద్రప్రభుత్వ అధికారులపై ఏసీబీ ఎలాంటి చర్యలు తీసుకోడానికి వీలు లేదని తెలిపింది. అయితే, ఈ తీర్పుతో తీవ్రంగా నిరాశ చెందిన ఢిల్లీ ప్రభుత్వం.. తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది.

టిడిపి అంటే తెలుగు డ్రామా పార్టీ..

తెలుగుదేశం పార్టీ(టిడిపి)ని ఒక తెలుగు డ్రామా పార్టీగా కాంగ్రెస్‌ సభ్యులు జైరాం రమేష్‌ అభివర్ణించారు. ప్రత్యేక హోదా సాధనలో ఆ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ సభ్యులు కెవిపి రామచంద్రరావు, టి.సుబ్బిరామి రెడ్డి, ఏపిసిసి చీఫ్‌ రఘువీరాతో కలసి బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభలో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండు చేశారు.

మోటారు సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం

దేశంలో రోడ్డు భద్రత, రవాణా రంగంలో భారీ సంస్కరణలకు కేంద్రం తెరలేపింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారికి భారీ జరిమానాలు విధిస్తూ రూపొందించిన మోటారు వాహనాల (సవరణ) బిల్లు-2016కు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. డ్రంకెన్ డ్రైవింగ్ కేసుల్లో రూ.10 వేలు, హిట్ అండ్ రన్ కేసుల్లో రూ. 2 లక్షల జరిమానాను ప్రతిపాదించారు. 18 రాష్ట్రాల రవాణా మంత్రుల సిఫార్సుల మేరకు ఈ బిల్లును రూపొందించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు.

‘జీఎస్‌టీ’కి రాజ్యసభ ఆమోదం..

వివిధ రకాల రాష్ట్ర, స్థానిక పన్నులను తొలగించి.. వాటి స్థానంలో దేశవ్యాప్తంగా ఏకైక ఏకీకృత పన్నుగా.. వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ)ను ప్రవేశపెట్టాలన్న చరిత్రాత్మక నిర్ణయానికి రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. 

కేంద్రంపై ఐక్యపోరాటాలు తప్పవు..

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలు తప్పవని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. సెప్టెంబర్‌ 2న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌లోని రైల్వే ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పలువురు కార్మిక సంఘాల నేతలు మాట్లాడారు. కార్మిక, ఉద్యోగ సంఘాల పట్ల మోడీ ప్రభుత్వం చులకన భావంతో వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ముందుంచిన 12 న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో మొండిగా వ్యవహరిస్తోందన్నారు.

Pages

Subscribe to RSS - August