కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ పై సబ్సిడీ ఎత్తివేయడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం నాయకులు విజయవాడలో నిరసన ప్రదర్శన చేపట్టారు. నెలకు 4 రూపాయల చొప్పున గ్యాస్ రేటు పెంచడంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్యాస్ పై సబ్సిడీని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
పోలవరం నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో న్యాయపరమైన పరిహారం, పునరావాసం కల్పించాలని కోరుతూ చింతూరు లో ర్యాలీ, చట్టివద్ద జాతీయ రహదారిపై బైఠాయింపు..ర్యాలీలో పాల్గోన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మిడియం బాబురావు, భద్రచలం ఎమ్మేల్యే సున్నం రాజయ్య..
దళితుల భూముల జోలికొస్తే ఖబడ్దార్ అంటూ టిడిపి నాయకులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. ఒక్కసెంటు కూడా ఇతరులకు పోనివ్వబోమని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లిలో 40 ఏళ్ల కిందట దళితులకు కేటాయించిన 416 ఎకరాల సాగు భూమిని అధికార పార్టీ నాయకులు కాజేయాలని చూస్తున్న నేపథ్యంలో సంబంధిత పొలాలను మధు ఆధ్వర్యంలో శుక్రవారం పరిశీలించారు. ఈ భూములను 1975లో అప్పటి జిల్లా కలెక్టర్ కత్తి చంద్రయ్య దళితులను సొసైటీగా ఏర్పాటు చేసి భూమినిచ్చారు. ఇందులో గ్రానైట్ నిక్షేపాలున్నాయని తెలుసుకున్న అధికార పార్టీ నాయకులు.. ఈ భూములను కొట్టేయాలని అక్రమ రిజిస్ట్రేషన్లకూ పూనుకున్నారు.
అమరజీవి పరుచూరి నాగేశ్వరరావు భవన్ ప్రజాసంఘాల ఉద్యమ కేంద్రంగా భాసిల్లాలని వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత అధ్యక్షులు పాటూరు రామయ్య అన్నారు. చెంచుపేటలో ప్రజా సంఘాల కార్యాలయ (కామ్రేడ్ పరుచూరి నాగేశ్వరరావు భవన్) నిర్మాణానికి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు సిఐటియు డివిజన్ అధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి అధ్యక్షత వహించారు. పాటూరు మాట్లాడుతూ పేరెన్నికగన్న ఎంతో మంది నాయకులు తెనాలి ప్రాంతంలో ఉన్నారని, వారిలో పరుచూరి నాగేశ్వరరావు ఒకరని చెప్పారు.
గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్ 7న జరిగే చలో ఐటిడిఎ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి కోరారు. ఈసందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈనెల 7న చలో ఐటిడిఎ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత దుర్మార్గంగా లక్షల మంది గిరిజనులను, ఇతర పేదలను జలసమాధి చేయడానికి పూనుకున్నా యన్నారు. 12 ఏళ్లుగా 12 గ్రామాలకు పునరావాసం కల్పించలేని ప్రభుత్వం 2018 నాటికి 400 గ్రామాలకు పునరావాసం ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేక వివాదాలకు కారణమవుతోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో జరుగున్న అక్రమాలు, అన్యాయాలపై 'భ్రమరావతి' పేరుతో ఆయన బుక్లెట్ విడుదల చేశారు. ఈ బుక్లెట్ చవిదిన వారికి అమరావతి.. భ్రమరావతిగా కనిపిస్తుందని చెప్పారు. అనేక వర్గాల నుంచి సమాచారం సేకరించి ఈ బుక్లెట్ తయారు చేసినట్టు వెల్లడించారు.
సార్క్ దేశాల 19వ సదస్సుకు ఇస్లామాబాద్ ఆతిథ్యమివ్వనుంది. నవంబరు 9, 10వ తేదీల్లో సదస్సు జరగనున్నట్లు పాకిస్థాన్ శుక్రవారం ప్రకటించింది. సభ్యదేశాల నేతలను తమ ప్రధాని నవాజ్ షరీఫ్ సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ కోర్టు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మరో ఐదుగురికి నోటీసులు జారీచేసింది. రెండు వారాలలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను అక్టోబరు 4వ తేదీకి వాయిదా వేసింది.
జైన దిగంబర బాబా తరుణ్ సాగర్. హర్యానా వర్షాకాల అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన సభను ఉద్దేశించి ప్రసంగించారు. నగ్నంగా సమావేశాలకు హాజరైన తరుణ్ సాగర్ బాబా గవర్నర్, సీఎం, ఎమ్మెల్యేల కన్నా ఎత్తైన డయాస్పై కూర్చొని ప్రసంగించారు. ఒక బాబా నగ్న అవతారంలో అసెంబ్లీలో ప్రసంగించడం ఇదే మొదటిసారి.