August

విద్యుత్ అమరవీరులకు నివాళి

ఆగస్టు 28,2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ హైదరాబాద్ లో ఆందోళనచేస్తున్న ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశంగా జరిగిన కాల్పులలో మరణించిన కామ్రేడ్ రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి , బాలస్వాములకు సిపిఎం రాష్ట్ర కమిటీ నివాళి అర్పించింది. ప్రపంచబ్యాంక్ విధానాలను అమలు చేస్తున్న చంద్రబాబు ప్రజలపై, కార్మికులపై భారాలను మోపుతున్నాడు..ఈ విధానాలకు వ్యతిరేకంగా అమరవీరుల త్యాగాల స్పూర్తితో ఉద్యమాలను మరింత ముందుకు తీసుకువెళతామని రాష్ట్ర కమిటీ తెలియజేసింది.

ప్రజల మధ్య పాలకుల చీలిక యత్నాలను తిప్పికొట్టాలి

రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యంగా సెప్టెంబర్‌ 15న విజయవాడలో నిర్వహించే ర్యాలీ, ప్రజాగర్జన సభను జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జొన్నా శివశంకర్‌ అధ్యక్షతన విస్తృత సమావేశం ఆదివారం నిర్వహించారు. కృష్ణమూర్తి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయని, ప్రధాని మోడీ మేకిన్‌ ఇండియా నినాదం డొల్లతనం బయటపడిందని చెప్పారు.

ఈనెల 30వ తేదీ వరకు సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పాదయాత్రలు

ప్రజాసమస్యల పరిష్కారానికి సోమవారం నుండి ఈనెల 30వ తేదీ వరకు సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ గుంటూరు తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు వెల్లడించారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చాయని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించాయని విమర్శించారు.

సెప్టెంబర్‌ 10, 11న జిల్లాకు సమగ్రాభివృద్ధి జాతా

రాష్ట్ర సమాగ్రాభివృద్ధి కోసం సిపిఎం, సిపిఐ చేపట్టిన జాతా సెప్టెంబర్‌ 10, 11న గుంటూరు జిల్లాలో ప్రవేశిస్తుందని, జాతాను విజయవంతం చేయాలని సిపిఎం గుంటూరు తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజరుకుమార్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు మంగళవారం స్థానిక బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జాతా వివరాలు వెల్లడించారు.

వాస్త‌వ సాగుదారుల‌కు, కౌలు రైతుల‌కు పంట న‌ష్ట‌ప‌రిహారం అందించాలి

వ‌ర‌ద‌ల వల్ల‌, క‌రువు ప్రాంతాల‌లో న‌ష్ట‌పోయిన వాస్త‌వ సాగుదారులు, కౌలు రైతుల‌కు న‌ష్ట‌ప‌రిహారం అందించాల‌ని సిపిఎం కేంద్ర‌క‌మిటి స‌భ్యులు వి. శ్రీ‌నివాస‌రావు అన్నారు. గుంటూరులో జ‌రిగిన విలేక‌ర్ల స‌మావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో క‌రువుల వ‌ల‌న, వర్షాల వ‌ల్ల సంభ‌వించిన వ‌ర‌ద‌లు వ‌ల్ల రైతాంగం తీవ్రంగా న‌ష్ట‌పోయార‌న్నారు. క‌రువు, వ‌ర‌ద‌ల వ‌ల‌న న‌ష్ట‌పోయిన వారిని ఆదుకోక‌పోతే వ్య‌వ‌సాయం గ‌ట్టెక్క‌దు. ముఖ్య‌మంత్రి వ‌ర‌ద‌ల ప్రాంతాల‌లో సంద‌ర్శించి రైతుల‌కు ఎక‌రానికి 10వేల రూపాయ‌లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. కౌలు రైతుల గురించి ముఖ్యమంత్రి ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం అన్యాయం అన్నారు.

Pages

Subscribe to RSS - August