August

విద్యుత్ అమరవీరులకు నివాళి

ఆగస్టు 28,2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ హైదరాబాద్ లో ఆందోళనచేస్తున్న ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశంగా జరిగిన కాల్పులలో మరణించిన కామ్రేడ్ రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి , బాలస్వాములకు సిపిఎం రాష్ట్ర కమిటీ నివాళి అర్పించింది. ప్రపంచబ్యాంక్ విధానాలను అమలు చేస్తున్న చంద్రబాబు ప్రజలపై, కార్మికులపై భారాలను మోపుతున్నాడు..ఈ విధానాలకు వ్యతిరేకంగా అమరవీరుల త్యాగాల స్పూర్తితో ఉద్యమాలను మరింత ముందుకు తీసుకువెళతామని రాష్ట్ర కమిటీ తెలియజేసింది.

ప్రజల మధ్య పాలకుల చీలిక యత్నాలను తిప్పికొట్టాలి

రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యంగా సెప్టెంబర్‌ 15న విజయవాడలో నిర్వహించే ర్యాలీ, ప్రజాగర్జన సభను జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జొన్నా శివశంకర్‌ అధ్యక్షతన విస్తృత సమావేశం ఆదివారం నిర్వహించారు. కృష్ణమూర్తి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయని, ప్రధాని మోడీ మేకిన్‌ ఇండియా నినాదం డొల్లతనం బయటపడిందని చెప్పారు.

Pages

Subscribe to RSS - August