August

బోఫోర్స్‌ ఫైల్స్‌ మాయం..ములాయం

సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ రక్షణశాఖ మంత్రి ములాయంసింగ్‌ యాదవ్‌ 18 ఏండ్ల నాటి రహస్యాన్ని బట్టబయలు చేశారు.తాను బోఫోర్స్‌ కొనుగోళ్లకు సంబంధించిన ఫైళ్లను మాయం చేశానని చెబుతూ అక్కడున్న వారందరినీ ఆశ్చర్యంలో పడవేశారు. 1996-98 మధ్య యునైటెడ్‌ ఫ్రంట్‌ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు రక్షణ మంత్రిగా పనిచేసిన ములాయం ఆ ఫైళ్లను తాము ఉద్దేశపూరితంగానే దాచిపెట్టామని చెప్పారు.

రిలయెన్స్‌కు 2,500 కోట్ల అదనపు జరిమానా

కృష్ణా-గోదావరి బేసిన్‌లోని డీ6 క్షేత్రాల నుంచి లక్ష్యానికి తగినంతగా సహజ వాయువును ఉత్పత్తి చేయనందుకు ప్రభుత్వం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు రూ. 2,500 కోట్ల అదనపు జరిమానా విధించింది. 2010 ఏప్రిల్‌ 1 నుంచి మొదలై వరుసగా ఐదేండ్లుగా ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోనందుకు రిలయెన్స్‌, దాని భాగస్వామ్య కంపెనీలు తమకైన ఖర్చుల్ని రికవరీ చేయడానికి వీల్లేకుండా చేయడం రూపంలో విధించిన జరిమానాను కూడా కలుపుకుంటే అది రూ. 18,459 కోట్లవుతుంది. 

మరో వివాదంలో స్మృతీ ఇరాని

చేనేత శాఖ మంత్రిగా స్మతి ఇరానీ బాధ్యతలు స్వీకరించి రెండు నెలలు కూడా గడవకముందే ఆ శాఖలో మరో వివాదాన్ని మూటగట్టుకున్నారు. అత్యంత సీనియర్‌ అధికారి, చేనేత శాఖ కార్యదర్శి రష్మీ వర్మతో వివాదానికి దిగారు.జూన్‌ 22న క్యాబినెట్‌ ఆమోదించిన రూ. 6వేల కోట్ల రూపాయల దుస్తులు, వస్త్ర ప్యాకేజీకి సంబంధించి, అక్టోబర్‌లో జరుగబోయే టెక్స్‌టైల్‌ సదస్సు, తదితర విషయాలపై విధానపరమైన పరిపాలనకు సంబంధించి కార్యదర్శితో వివాదాలు నెలకొన్నాయి. ఇతర అధికారుల ముందే కార్యదర్శితో స్మృతి వాగ్వివాదానికి దిగినట్టు టెక్స్‌టైల్‌ శాఖ వర్గాలు తెలిపాయి.

పెల్లెట్లు వద్దంటే బుల్లెట్లు..

గుమిగూడిన జనాన్ని చెదరగొట్టడానికి పెల్లెట్లు వాడొద్దని చెబితే.. తమ సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో తప్పనిసరిగా బుల్లెట్లు వాడాల్సి వస్తుందని, వాటివల్ల మరిన్ని ప్రాణాలు పోతాయని జమ్ము కశ్మీర్ హైకోర్టుకు సీఆర్పీఎఫ్ తెలిపింది. పరిస్థితులను నియంత్రించడానికి సీఆర్పీఎఫ్ వద్ద మరో అవకాశం ఏమీ ఉండబోదని, తప్పనిసరిగా రైఫిళ్లతో కాల్పులు జరపాల్సి వస్తే, అప్పుడు మరిన్ని ప్రాణాలు పోతాయని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో సీఆర్పీఎఫ్ తెలిపింది. 

మజ్దూర్‌ సంఘ్‌ సమ్మెకు దూరం..

 మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక సంస్కరణలను నిరసిస్తూ కార్మిక సంఘాలు సెప్టెంబరు 2న తలపెట్టిన సమ్మెలో పాల్గొనాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. బ్యాకింగ్‌ పరిశ్రమపై దాడులు పెరిగిపోయాయని, ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సి.హెచ్‌.వెంకటాచలం తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ సమ్మెకు దూరంగా ఉండాలని నిర్ణయించింది.

అరకొరతో అభివృద్ధి ఎలా?

ఏపిికి కేంద్ర ప్రభుత్వం రూ 1,976 కోట్లు ఆర్థిక సహాయం ప్రకటించడంపై సిపిఐ రాష్ట్ర సమితి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అత్యల్ప నిధుల కేటాయింపులతో వెనుకబడ్డ జిల్లాల్లో అభివృద్ధి ఎలా సాధించగలమో తెలపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు.గత రెండేళ్ళలో ఏడాదికి రూ 350 కోట్లు చొప్పున రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు రూ 700 కోట్లు విడుదల చేశారని వివరించారు. రాజధాని నిర్మాణం కోసం కేటాయించిన రూ 450 కోట్లతో ఏ నిర్మాణాలు, ఎంతకాలంలో చేపడతారో తెలియడంలేదని విమర్శించారు. రాష్ట్ర రెవెన్యూలోటు రూ 16 వేట కోట్లు ఉండగా..

పుష్కర ఏర్పాట్ల పరిశీలన..

కృష్ణా పుష్కరాల్లో పని చేస్తున్న దాదాపు 25 వేల మంది పారిశుధ్య కార్మికులకు ప్రతి రోజూ రూ.400 చొప్పున వేతనం అందేలా చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు బుధవారం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆయన పున్నమీ, భవానీ ఘాట్‌లలో పుష్కర ఏర్పాట్లు, కార్మికులకు అందజేస్తున్న వేతనాలు, పనుల వివరాలను కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాలకు ప్రతి రోజూ 35 లక్షలకు తగ్గకుండా యాత్రికులు వస్తారనీ, ప్రభుత్వం అంచనా వేసి అందుకు తగ్గట్టుగా నిధులు ఖర్చు చేసిందనీ చెప్పారు. కానీ అధికారిక లెక్కల ప్రకారం కేవలం 12.70 లక్షల మందే వస్తున్నారన్నారు.

Pages

Subscribe to RSS - August