August

కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళనకు మద్దతు

కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో గత 15 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్దతిలో సేవలందిస్తున్న 240మంది ఉద్యోగులకు జి.వో 151 ప్రకారం కనీసవేతనాలు ఇవ్వాలని చేపట్టిన ఆందోళనకు మద్దతు ఇచ్చిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి దువ్వ శేషబాబ్జి .. రాష్ట్రముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకువెళ్తానని, మిగిలిన వామపక్షాలను కలుపుకొని సమస్య పరిష్కరానికి ఉద్యమిస్తామని తెలిపారు...

సెప్టెంబరు 2 సమ్మె అనివార్యం..

ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ 2016 సెప్టెంబర్‌ 2న ఒక రోజు దేశవ్యాప్త సమ్మె నిర్వ హించాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక నిర్ణయించింది. బియంయస్‌ మినహా మిగిలిన కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ భాగస్వాములుగా ఉన్నాయి. ఈ సమ్మె ఎందుకు జరుగుతుందో పరిశీలించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరళీకరణ ఆర్థిక విధానాలను తీవ్రంగా అమలు చేస్తున్నాయి. గత ప్రభుత్వాల కాలంలో ప్రజలచే ఛీత్క రించబడిన ఈ విధానాలను కొత్తగా అధికారంలోకి వచ్చిన కేంద్ర బిజెపి ప్రభుత్వం మరింత వేగంగా అమలుజేయ డానికి పూనుకోవడం వల్ల దేశంలో పెట్టుబడిదారులకు మంచిరోజులు వచ్చాయి. సాధారణ ప్రజలకు, ఉద్యోగ, కార్మికులకు మరింత గడ్డురోజులు దాపురించాయి.

జీఎస్‌టీపై సంప్రదింపులు షురూ

వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ను సాఫీగా అమల్లోకి తెచ్చేందుకు వాణిజ్య, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో ఎక్సైజ్‌, కస్టమ్స్‌ కేంద్రీయ బోర్డు (సీబీఈసీ) సంప్రదింపులు చేపట్టింది. బుధవారం ప్రారంభమై, శుక్రవారం వరకు కొనసాగనున్న ఈ సంప్రదింపుల్లో రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్‌ అధియా, సీనియర్‌ అధికారులు పాల్గొంటున్నారు.సమాచార, సాంకేతిక పరిజ్ఞానం (ఐటీ), ఐటీ ఆధారిత సేవారంగాల (ఐటీఈఎస్‌), రవాణా రంగ ప్రతినిధులతో అధియా, సీనియర్‌ అధికారుల చర్చలు పూర్తయ్యాయి. ఇ కామర్స్‌, టెలికాం, బ్యాంకింగ్‌, చమురు-సహజవాయువు రంగాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు.

బ్యాంకుల నిరర్థక ఆస్తులు రెట్టింపు

 ఈ ఏడాది తొలి త్రైమాసికంలో నిరర్థక ఆస్తులు బ్యాంకుల పాలిట శరాఘాతాలయ్యాయి. 8.5శాతంతో అవి రెట్టింపు అయినట్లు కేర్‌ రేటింగ్స్‌ ఏజెన్సీ పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు 4.6శాతం ఉండటం గమనార్హం.ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి ఈ నిరర్థక ఆస్తులు జూన్‌ 2015లో 5.3శాతం ఉండగా, ఈ ఏడాది అవి 10.4శాతానికి చేరాయి.

బోఫోర్స్‌ ఫైల్స్‌ మాయం..ములాయం

సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ రక్షణశాఖ మంత్రి ములాయంసింగ్‌ యాదవ్‌ 18 ఏండ్ల నాటి రహస్యాన్ని బట్టబయలు చేశారు.తాను బోఫోర్స్‌ కొనుగోళ్లకు సంబంధించిన ఫైళ్లను మాయం చేశానని చెబుతూ అక్కడున్న వారందరినీ ఆశ్చర్యంలో పడవేశారు. 1996-98 మధ్య యునైటెడ్‌ ఫ్రంట్‌ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు రక్షణ మంత్రిగా పనిచేసిన ములాయం ఆ ఫైళ్లను తాము ఉద్దేశపూరితంగానే దాచిపెట్టామని చెప్పారు.

రిలయెన్స్‌కు 2,500 కోట్ల అదనపు జరిమానా

కృష్ణా-గోదావరి బేసిన్‌లోని డీ6 క్షేత్రాల నుంచి లక్ష్యానికి తగినంతగా సహజ వాయువును ఉత్పత్తి చేయనందుకు ప్రభుత్వం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు రూ. 2,500 కోట్ల అదనపు జరిమానా విధించింది. 2010 ఏప్రిల్‌ 1 నుంచి మొదలై వరుసగా ఐదేండ్లుగా ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోనందుకు రిలయెన్స్‌, దాని భాగస్వామ్య కంపెనీలు తమకైన ఖర్చుల్ని రికవరీ చేయడానికి వీల్లేకుండా చేయడం రూపంలో విధించిన జరిమానాను కూడా కలుపుకుంటే అది రూ. 18,459 కోట్లవుతుంది. 

మరో వివాదంలో స్మృతీ ఇరాని

చేనేత శాఖ మంత్రిగా స్మతి ఇరానీ బాధ్యతలు స్వీకరించి రెండు నెలలు కూడా గడవకముందే ఆ శాఖలో మరో వివాదాన్ని మూటగట్టుకున్నారు. అత్యంత సీనియర్‌ అధికారి, చేనేత శాఖ కార్యదర్శి రష్మీ వర్మతో వివాదానికి దిగారు.జూన్‌ 22న క్యాబినెట్‌ ఆమోదించిన రూ. 6వేల కోట్ల రూపాయల దుస్తులు, వస్త్ర ప్యాకేజీకి సంబంధించి, అక్టోబర్‌లో జరుగబోయే టెక్స్‌టైల్‌ సదస్సు, తదితర విషయాలపై విధానపరమైన పరిపాలనకు సంబంధించి కార్యదర్శితో వివాదాలు నెలకొన్నాయి. ఇతర అధికారుల ముందే కార్యదర్శితో స్మృతి వాగ్వివాదానికి దిగినట్టు టెక్స్‌టైల్‌ శాఖ వర్గాలు తెలిపాయి.

పెల్లెట్లు వద్దంటే బుల్లెట్లు..

గుమిగూడిన జనాన్ని చెదరగొట్టడానికి పెల్లెట్లు వాడొద్దని చెబితే.. తమ సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో తప్పనిసరిగా బుల్లెట్లు వాడాల్సి వస్తుందని, వాటివల్ల మరిన్ని ప్రాణాలు పోతాయని జమ్ము కశ్మీర్ హైకోర్టుకు సీఆర్పీఎఫ్ తెలిపింది. పరిస్థితులను నియంత్రించడానికి సీఆర్పీఎఫ్ వద్ద మరో అవకాశం ఏమీ ఉండబోదని, తప్పనిసరిగా రైఫిళ్లతో కాల్పులు జరపాల్సి వస్తే, అప్పుడు మరిన్ని ప్రాణాలు పోతాయని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో సీఆర్పీఎఫ్ తెలిపింది. 

Pages

Subscribe to RSS - August