భూ ఆర్డినెన్స్‌ చెల్లదు:సిపిఎం

బలవంతపు భూ సేకరణ తగదు-సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు రాజధాని పరిధిలో బలవంతపు భూసేకరణ తగదని, ఈ ప్రక్రియను వెంటనే నిలిపేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజధానికి సరిపోయినన్ని భూములు ఇప్పటికే సమీకరించారని, కొత్తగా సేకరించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. రైతుల భూములను పెద్దపెద్ద కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టేందుకే ప్రభుత్వం సేకరణకు వెళ్లిందని ఆయన విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన భూ ఆర్డినెన్స్‌లను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సేకరణ ప్రకటన చేయడం ఏ మాత్రమూ క్షమార్హం కాదని పేర్కొన్నారు. ఆర్డినెన్స్‌లు ఇంతవరకు ఆమోదం పొందలేదని, ఈ క్రమంలో వాటిని ఆసరాగా చేసుకుని సేకరించాలనుకుంటే చెల్లుబాటు కాదని ఆయన తెలిపారు. వెంటనే భూసేకరణ ప్రక్రియను నిలిపేయాలని ఆయన కోరారు.