ప్రభుత్వం చేసే మోసకారి పనులు ఇప్పుడిప్పుడే నూతన రాజధానిగా ప్రకటించిన అమరావతి 29 గ్రామాల్లో ప్రజలకు అర్థమవుతున్నాయి. తమ ప్రభుత్వం అని నమ్మి భూములిచ్చిన రైతులకు ప్రస్తుతం గ్రామకంఠాల విషయమై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో వారిలో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. గ్రామాల్లో మంత్రులను మేళతాళాలతో ఊరేగించిన ప్రజలే ఇళ్లల్లో పెట్టి కదలడానికి వీల్లేదని నిర్బంధిస్తున్నారు. గ్రామకంఠాల విషయమై ఎటూ తేల్చకపోతే ప్రభుత్వ వ్యవహారాన్ని తేలుస్తామని తెగేసి చెబుతున్నారు. మొదట్లో రాజధాని నిర్మాణానికి భూములు తీసుకుంటామని, గ్రామాలను కదపబోమని, 2014 డిసెంబరులో శాటిలైట్ సర్వే నిర్వహించామని, దాని ప్రకారం బ్రిటీష్ కాలం నాటి గ్రామకంఠాలతో కలుపుకొని ఇప్పుడు...
District News
ఏపీ రాజధాని కోసం ప్రభుత్వం భూసేకరణను వెంటనే విరమించుకోవాలని సీపీఎం ఎపి రాష్ట్రకార్యవర్గ సభ్యుడు బాబురావు డిమాండ్ చేశారు. గ్రామ కంఠాల పరిధిని విస్తరింపచేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ. సీఆర్డీఏ కార్యాలయాన్ని రైతు సంఘాలు, సీపీఎం నేతలు ముట్టడించారు. సీఆర్డీఏ కార్యాలయానికి తాళాలు వేసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ.. 140 ఎకరాలు ప్రభుత్వ కార్యాలయాలకు సరిపోతుందన్నారు. కానీ రాజధాని పేరుతో ఇప్పటికే లక్షాపదివేల ఎకరాల సమీకరించారని అది చాలదని ఇప్పుడు మరో 3వేల ఎకరాలను సేకరిస్తోందని బాబురావు మండిపడ్డారు. రాజధాని పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. సింపూర్, జపాన్ కంపెనీలకు భూములను తాకట్టు...
విశాఖనగరంలో ఉల్లిపాయలు ధరలు పెరగడంతో పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. నగరంలో కేవలం రైతు బజార్లలో మాత్రమే ప్రభుత్వం సబ్సిడీ ఉల్లిపాయలు సరఫరా చేస్తున్నది. తక్కువ కౌంటర్ల వలన ప్రజానీకం తీవ్ర అగచాట్లు పడుతున్నారు. రోజువారి కూలిని కూడా కోల్పోతున్నారు. తక్షణం ప్రతి రైతుబజారులో కనీసం ఐదు కౌంటర్లు ప్రారంభించాలి. ప్రతి రేషన్డిపోలోనూ, మున్సిపల్ వార్డు ఆఫీస్ల వద్ద సబ్సిడీ ఉల్లిపాయలను సరఫరా చేయాలని సిపియం పార్టీ కోరుచున్నది. ప్రస్తుతం త్లెరేషన్కార్డుదారులకి మాత్రమే ప్రభుత్వం ఉల్లిపాయులు సరఫరా చేయడం చాలా అన్యాయం. వివక్షత కూడా. గులాభీరంగు కార్డుదారులకు కూడా ఉల్లిపాయలు ఇవ్వాలని సిపియం డిమాండ్ చేస్తున్నది. అలాగే...
కార్మిక సంఘాలు, కార్మికులు ప్రాణాలు పణంగా పెట్టి సాధించు కున్న కార్మిక చట్టాలలో కేంద్ర ప్రభుత్వం సవరణలు చేస్తే సహించేది లేదని ప్రకాశం జిల్లా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు అన్నారు. పోరాటాల ఫలితంగా 44 కార్మిక చట్టాలు సాధించుకున్నారు. అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం 11 రాష్ట్రాలలో కార్మిక చట్టాలలో సవరణలు చేసింది. దేశవ్యాప్తంగా చట్టాల్లో సవరణలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. జిల్లాలో పాలిషింగ్ యూనిట్లలో పనిచేసే కార్మికులు 70 వేల మంది ఉన్నారు. కార్మిక చట్టాలలో సవరణ చేస్తే 30 వేల నుంచి 40 వేల మంది కార్మికులు హక్కులను కోల్పోతారు. అసంఘటిత రంగ కార్మికులు నాలుగు లక్షల మంది జిల్లాలో...
కృష్ణాయపాలెం, మందడం, మల్కాపురం, రాయపూడి, తుళ్ళూరు గ్రామాల్లోని ప్రజలు గ్రామకంఠాలపై ప్రభుత్వ తీరుపట్ల తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. సిపిఎం బృందం ఈ గ్రామంలో పర్యటించినప్పుడు వారి ఆవేదన వ్యక్తం చేశారు. తమ దగ్గర పంట భూములు తీసుకునేటప్పుడు తియ్యని మాటలు చెప్పి నేడు గ్రామకంఠాల పేరుతో చేదు తినిపిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న గ్రామానికి 500మీటర్లు అదనంగా గ్రామకంఠం కింద వదులుతానన్న ప్రభుత్వ హామీ ఏమైందని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం తక్షణం గ్రామకంఠాల సమస్యను పరిష్కరించకుంటే పూలు వేసిన చేత్తోనే రాళ్లు వేయక తప్పదని హెచ్చరించారు.
పేదల ఇళ్ళను తొలగించడానికి వస్తే ధైర్యంగా ఎదుర్కో వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.వెంకటేశ్వర్లు పేదల ను కోరారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రంగస ముద్రం పంచాయతీలోని 54 ఎకరాల ప్రభుత్వ బంజరు భూ ముల్లో బుధవారం వందలాది మంది పేదలు గుడిసెలు వేశా రు. ఈ కార్యక్రమానికి హాజరైన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సర్వే నెంబర్ 1263లోని 54 ఎకరాల ప్రభుత్వ బంజరులో ఇంటి స్థలం కోసం పేదలు పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా అధికారులు నిర్లక్ష్యం వహించారని, దీంతో ఓపిక నశించి ఆ స్థలంలో పేదలు గుడిసెలు వేసుకున్నారన్నారు. గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు మంజూరు చేయాలని ఆయన డి మాండ్ చేశారు. ప్రతి కుటుంబానికీ రెండున్నర లక్షల రూపా యలతో పక్కా గృహాలు కట్టించి ఇవ్వాలన్నారు...
అనకాపల్లిటౌన్: జిడిఎస్ ఉద్యోగుల వేతన సవరణను 7వ పే కమిషన్ పరిధిలోకి చేర్చకుండా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిరాకరించడానికి నిరసిస్తూ స్థానిక పోస్టాఫీసు వద్ద సి,డి,ఇ.డి. ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యాన బుధవారం పోస్టల్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సంఘీభావం ప్రకటించిన నర్సింగరావు మాట్లాడుతూ యుపిఎ, నేడు ఎన్డిఎ ప్రభుత్వాల విధానాలు ఒక్కటేనని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నాయని, వాటిని ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు ద్వజమెత్తారు.కార్పొరేట్ సంస్థల దయతో అధికారంలోకొచ్చిన మోడీ, వారి విచ్చల విడి వ్యాపారాలకు అడ్డు...
నారాయణ కళాశాల విద్యార్థినుల మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని ఐద్వా, విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేశాయి. ఐద్వా, డివైఎఫ్ఐలు బుధవారం విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి మాట్లాడుతూ విద్యార్థినులవి ఆత్మహత్యలే ఐతే, అందుకు కారణాలేమిటో కళాశాల యాజమాన్యం వెల్లడించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థులు తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారని, విశ్రాంతిలేని చదువులే వారి చావులకు కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎస్పి, ఎస్టి మహిళలపై ఈ కాలంలో దాడులు విపరీతంగా పెరిగిపోయాయని కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు కె సుబ్రమణ్యం అన్నారు.దళితులు విద్య ,వైద్యం ఉపాధి కరువైందని వీటిని అధికమించడానికి అంబేద్కర్ 125వ జయంత్రి సందర్భంగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశం నిర్వహించి దళితుల సమస్యలను చర్చించాలన్నారు.ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు సాధనకై ఉద్యమించాలని పిలుపు నిచ్చారు.ప్రభుత్వం అవలబిస్తున్న ఆర్థిక సరళీకరణ విధానాల వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు నర్వీర్యమైపోయి ప్రయివేటు పరంగా బలపడుతున్న తరుణంలో దళితులు బలహీన వర్గాలవారికి ఉపాధిలేక వీధిన పడుతుఉన్నారని తెలిపారు
కార్మిక చట్టాల సవరణను, ప్రభుత్వ విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 2న దేశ వ్యాప్తంగా జరుగుతున్న కార్మిక సమ్మెకు విస్తృత సన్నాహాలు చేయాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్(సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ పిలుపునిచ్చారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలంతా సమ్మెలో పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు మంగళవారం స్థానిక పాతగుంటూరులోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి కె.నాగలక్ష్మి అధ్యక్షత వహించారు. నేతాజీ మాట్లాడుతూ సమ్మెలో దేశంలోని అన్ని కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజా...