2015

విదేశీ బాబు :రాహుల్‌

 ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీబాబు అయ్యారని, రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోవడం లేదని ఎఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్‌ గాంధీ విమర్శించారు. పేదల సమస్యలను పట్టించుకునే పరిస్థితుల్లో లేరన్నారు. శుక్రవారం అనంతపురం జిల్లా ఓబుళదేవరచెరువు(ఒడిసి) నుంచి ప్రారంభమైన రాహుల్‌ రైతు భరోసా పాదయాత్ర కొండకమర్ల గ్రామం వద్ద ముగిసింది. 1979లో ఒడిసిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇందిరాగాంధీ పాల్గొన్న వేదిక వద్దనే బహిరంగ సభ నిర్వహించారు. ఆ ప్రాంతంలో రాహుల్‌ వేపమొక్కను నాటారు. గ్రామశివారులో రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబ సభ్యులతో సమావేశ మయ్యారు.

విశాఖ జూపార్కును తరలించడాన్ని వ్యతిరేకించండి.

విశాఖనగరంలో ఉన్న ఇందిరాగాంధీ జూలాజికల్‌ పార్కును తరలింపును, దాన్ని ప్రభుత్వ`ప్రైవేట్‌`భాగస్వామ్యం (పిపిపి) పేరుతో ప్రైవేట్‌ కంపెనీలకు అప్పజెప్పడాన్ని సిపిఐ(యం) పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 1971లో 625 ఎకరాల విస్తీర్ణంలో జూ పార్కు ఏర్పడిరది. ఇది రెండు కొండల మధ్య, ఒకవైపు నేషనల్‌హైవే మరోవైపు సముద్రతీరం మధ్య ఉంది. ఇది వన్యప్రాణులకు సంరక్షణార్ధం ఎంతో ఉపయోగకరంగా ఉంది.  పిల్లలకు, పెద్దలకు విజ్ఞానం, వినోదాన్ని అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోనే ఇది అతిపెద్ద జంతుప్రదర్శనశాల.

కార్మికల కలెక్టరేట్ల ముట్టడికి మద్దతు: మధు

నేడు మున్సిపల్ కార్మికల కలెక్టరేట్ల ముట్టడికి మద్దతు తెలియచేస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. సమ్మెను అణచివేయాలని రాష్ట్ర కాబినెట్ తీసుకున్న నిర్ణయం దారుణమన్నారు. రాష్ట్ర మంత్రే ఈ ప్రకటన చేయడం సిగ్గుచేటని,ప్రభుత్వం కార్మికుల సమ్మెను పరిష్కరించకుండా రాజకీయం చేస్తే ఇది ఒక్క కార్మికుల సమస్య గానే కాక రాజకీయ సవాల్ గా కూడా స్వికరించాల్సివస్తుందన్నారు. సమస్య పరిష్కారం కాకుంటే నెల రోజులైనా ఆందోళనలకు సిద్ధమన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదన్నారు.ప్రభుత్వం వెంటనే కార్మిక జెఎసి తో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేసారు .. 

రాహుల్‌ పాదయాత్రకు అడ్డంకి

నేడు అనంతపురం ఓబులదేవరచెరువు నుంచి రాహుల్‌ గాంధీ పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో టిడిపి కార్యకర్తలు నిరసన తెలిపారు. పాదయాత్రలో భాగంగా రాహుల్‌ మామిళకుంటపల్లి, దేబురాపల్లి, కొండకమర్లలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. రాహుల్‌గాంధీ పర్యటనపై చంద్రదండు ఆందోళన చేసింది. చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టు దగ్గర చంద్రదండు కార్యకర్తలు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. దీంతో చంద్రదండు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

పీఆర్‌సీ చెల్లింపులలో దోపిడీ

రాష్ట్ర ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ ప్రకటించిందని ఉద్యోగులు సందడి చేసుకుంటుంటే... ఆ చెల్లింపుల మాటున ట్రెజరీ ఉద్యోగులు పెద్ద ఎత్తున దోపిడీకి తెరతీశారు. ప్రతి ఉద్యోగి నుంచీ అధికారికంగా రూ. 500 మామూళ్లు వసూ లు చేస్తున్నారు. ‘ప్రభుత్వం పదో పీఆర్‌సీలో 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చినప్పుడు ఉద్యోగుల బేసిక్‌ రెట్టింపు అవుతుంది. అటువంటప్పుడు మాకు రూ.500 ఇవ్వడం పెద్ద లెక్క కాదు’ అని ట్రెజరీ ఉద్యోగులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇది కొత్త కాదని, ప్రతి కొత్త పీఆర్‌సీకి ఈ తరహా ప్రత్యేక బాదుడు మామూలేనని ఉద్యోగులు వాపోతున్నారు.

ఆదర్శ పాఠశాలల అసలు నిజాలు

''ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజాస్వామిక ప్రభు త్వాలు విద్యారంగం మీద సామాజిక అభివృద్ధి దృక్పథంతో పెట్టుబడులు పెట్టినప్పుడే నిరక్షరాస్యతా మహమ్మారిని పారద్రోలగలమని, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రభుత్వాలు అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని సెనెగల్‌ రాజధాని డాకర్‌లో 2000లో జరిగిన ప్రపంచ విద్యా సదస్సు తీర్మానించింది.'' తీర్మానాన్ని మన దేశం కూడా ఆమోదించింది. కానీ నేడు మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న అపసవ్య విధానాల వల్ల ప్రభుత్వ పాఠశాలలు రాబోయే రోజుల్లో కనుమరుగయ్యే పరిస్థితి దాపురిస్తోంది. ప్రత్యేకించి మన రాష్ట్ర పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

Pages

Subscribe to RSS - 2015