2015

త్రిపురలో ఇంటి పనివారికి పెన్షన్‌

ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపర్చేందుకు త్రిపురలోని లెఫ్ట్‌ఫ్రంట్‌ ప్రభుత్వం కొత్తగా మూడు పింఛను పథకాలను ప్రవేశపెట్టింది. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ తెలిపారు. అరకొర వేతనాలకు ఇళ్లల్లో పనిచేసే మహిళా ఇంటి పనివారలకు నెలనెలా రూ.350 చొప్పున పెన్షన్‌ చెల్లించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. అలాగే హిజ్రాలకు, ఎయిడ్స్‌, కుష్టు బాధితులకు నెలకు రూ.500 చొప్పున భత్యం చెల్లించాలని కూడా కేబినెట్‌ నిర్ణయించినట్లు మాణిక్‌ వెల్లడించారు. 
అంగన్‌వాడీలకు అండగా.. 

సెక్షన్8 అమలుపై కేంద్ర మంత్రి

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ ఎనిమిదిలోని అంశాలను అమలు చేయవలసిందిగా ఆదేశించే నియమ నిబంధనలు లేవని కేంద్ర హోమ్ శాఖ సహయ మంత్రి హరిబాయి ప్రతిభాయి చౌదరి స్పస్టం చేశారు. తెలుగుదేశం సభ్యుడు ముత్తంశెట్టి శ్రీనివాస్‌రావు అడిగిన ప్రశ్నకు జవాబుగా మంగళవారం లోక్‌సభలో ఈ విషయం వెల్లడించారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నంత వరకూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం సెక్షన్ 8ని వివిధ అంశాల అమలుకు సంబంధించి ఆయన అడిగిన ప్రశ్నకు మంత్రి స్పష్టమైన సమాధానం ఇచ్చారు.

లక్ష రుణమాఫీ చేయాలి:ఐద్వా

రాజధాని ప్రాంతంలో డ్వాక్రా మహిళలకు ఏకకాలంలో రూ. లక్ష రుణ మాఫీ చేయకపోతే గ్రామాల్లో ఉన్న క్రిడా కార్యాలయాలన్నింటినీ దిగ్బంధిస్తామని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి హెచ్చరించారు. రూ. లక్ష రుణమాఫీ తక్షణం అమలు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా తుళ్లూరులోని క్రిడా కార్యాలయం ఎదుట మంగళవారం డ్వాక్రా మహిళలు నిర్వహించిన ధర్నాలో ఆమె మాట్లాడారు. డ్వాక్రా మహిళలను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు, ఇప్పుడు వాయిదాల పద్ధతిలో రుణమాఫీ చేస్తామనడం సరికాదన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళలు తమ తడాఖా చూపిస్తారని హెచ్చరించారు.

కులగణనలో 8కోట్ల తప్పులు

దేశవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, కుల గణనలో మొత్తం 8,19,58,314 తప్పులు వచ్చినట్లుగా ప్రభుత్వం గుర్తించింది. వీటిని సరిదిద్దాల్సిందిగా అన్ని రాషా్ట్రలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరామని, ఇప్పటిదాకా 6,73,81,119 తప్పులను సరిదిద్దగా, ఇంకా 1,45,77,195 తప్పులను దిద్దాల్సి ఉందని కేంద్ర హోం శాఖ తెలిపింది. అయితే కులపరమైన జనాభా గణాంకాలను వెల్లడించకపోవడాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌ సమర్థించుకున్నారు. త్వరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా వివిధ కులాల జనాభా వివరాలను ప్రభుత్వం వెల్లడించడం లేదన్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు.

ప్రభుత్వసంస్థల ఏర్పాటు షురూ

ఉమ్మడి రాజధానిలో కాకుండా నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం నుంచే పాలన సాగించే ప్రక్రియలో వేగం పెంచేందుకు ఏపీ సర్కార్‌ ప్రణాళికలు రచిస్తోంది. రాజధాని ప్రాంతం నుంచి పాలన సాగించేదిశగా ఏపీ సర్కార్‌ అడుగులు వేస్తోంది. పలు శాఖల కార్యాల‌యాల త‌ర‌లింపున‌కు కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే వారానికి 3 రోజులు రాజ‌ధాని నుంచి పాలిస్తున్న సీఎం పూర్తిస్థాయిలో అక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేయ‌డానికి అనువైన ప్రైవేట్ భవనాలను ప‌రిశీలించేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే విజయవాడలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకున్న బాబు..

కలాం పేరు ఖరారు..

మాజీ రాష్టప్రతి అబ్దుల్ కాలామ్‌కు కేంద్ర మంత్రివర్గం నివాళులర్పించిన తరువాత రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్‌కు కలామ్ పేరు పెట్టాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ వెల్లడించారు

రేపు ఉరితీసేందుకు ఏర్పాట్లు పూర్తి..

సుప్రీం కోర్టు విధించిన ఉరిశిక్షను రద్దుచేయాలని కోరుతూ ముంబయి పేలుళ్ల కేసు నిందితుడు యాకుబ్ మెమన్ రాష్టప్రతికి మరోసారి పిటిషన్ పెట్టుకున్నారు. గతంలో మెమన్ పెట్టుకున్న పిటిషన్‌ను రాష్టప్రతి తోసిపుచ్చారు. నాగపూర్ జైలులో మెమన్‌ను రేపు ఉరితీసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఓటుకునోటు కేసులో చార్జిషీటు

ఓటుకు నోటు కేసులో ఏసీబీ చార్జిషీటు దాఖలు చేసింది. చార్జిషీటులో రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్‌, ఉదయసింహ, మత్తయ్య పేర్లు నమోదు చేశారు.

ప్రమాద ఘంటికలు

సేద్యం గిట్టుబాటు కాక, పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక, రుణగ్రస్తులై నిరాశా నిస్ప్రుహలతో జీవితాలు చాలిస్తున్న రైతులను ఇప్పటి వరకు చూశాం. కానీ ఇప్పుడు ప్రభుత్వ వేధింపులు భరించలేక రోజుకో రైతు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న దుర్మార్గం మన రాష్ట్రంలో కనిపిస్తోంది. కర్నూలు జిల్లా ఓర్వకల్‌లో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ కింద భూమి కోల్పోయిన ఒక రైతు కనీసం ఇస్తామన్న పరిహారం కూడా ఇవ్వకపోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. విశాఖ జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్వాశిత రైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. చిత్తూరు జిల్లాలో ఎయిర్‌పోర్టు బాధితులదీ అదే దారి.

Pages

Subscribe to RSS - 2015