కౌలు చెక్కులివ్వాలని డిమాండ్ చేస్తూ అసైన్డ్, సీలింగ్ భూముల రైతులు తుళ్ళూరు క్రిడా కార్యాలయాన్ని ముట్టడించారు. లైబ్రరీ సెంటర్ నుండి ర్యాలీ నిర్వహించి క్రిడా కార్యాలయం ఎదుట గంటకు పైగా బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, పేద వ్యవసాయ కూలీలకు రూ. 2,500 పింఛన్, అసైన్డ్, సీలింగ్ భూముల రైతులకు కౌలు చెక్కులివ్వడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. క్రిడా ప్రాంత సిపిఎం కన్వీనర్ సిహెచ్.బాబురావు, సిపిఎం డివిజన్ కమిటీ కార్యదర్శి ఎం.రవి, నాయకులు జొన్నకూటి వీర్లంకయ్య, నవీన్ప్రకాష్ ఆందోళనకు మద్దతు తెలిపారు.