ర్యాగింగ్‌పైరగిలినవిద్యార్థులు

నాగార్జున యూనివర్సిటి బిఆర్క్‌ విద్యార్థిని రిషితేశ్వరి మృ తికి కారకులైన దోషులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని, సిట్టింగ్‌ జడ్జితో ప్రభుత్వం తక్షణం విచారణ జరిపించాలంటూ విద్యార్థి సంఘ నేతలు రోడ్డెక్కారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ముఖ్యమంత్రి చం ద్రబాబు స్పందించి బాధ్యులైన వారిని అరెస్టు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని, లేదంటే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. క్యాంపు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులకు,అడ్డుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులకు మధ్య తోపులాట, ఘర్షణ చోటుచేసుకొన్నాయి. ఎట్టకేలకు విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వర్సిటీకి సెలవులు ఇచ్చి, విద్యార్థులు లేనపుడు బాలసుబ్రహ్మణ్యం కమిటీ విచారణ నిర్వహించటం సిగ్గుచేటని పీడీఎ్‌సయూ, ఎస్‌ఎ్‌ఫఐ, ఏఐఎ్‌సఎ్‌ఫల నేతలు ఆగ్రహించారు.