2015

దళితులకు సామజిక న్యాయం దక్కేవరకూ పోరాడదాం..

మనదేశానికి స్వాతంత్రం వచ్చి 68సంవత్సరాు అవుతున్నా దళితు స్థితిగతుల్లో పెద్దగా మార్పు రాలేదు. అంటరాని తనం, దాడు, స్త్రీపై అత్యాచారాు, మానభంగాు కొనసాగుతూనే వున్నాయి. అందుచేతనే రాజ్యాంగ నిర్మాత భారత రత్న డా॥ బి.ఆర్‌.అంబేద్కర్‌ 125 జయంతి సందర్భంగా పార్లమెంటు ప్రత్యేక సమావేశం కనీసం నాుగు రోజు నిర్వహించి దళిత సమస్యపై చర్చించి పరిష్కారానికి కొన్ని చట్టాు రూపొందించాని సిపియం డిమాండ్‌ చేస్తున్నది. 

ఉచిత విద్య ఊసు మరచిన ప్రభుత్వం..

ఇప్పుడు దేశమంతా ‘‘మేక్‌ ఇన్‌ ఇండియా’’ హోరెత్తుతోంది. ఎక్కడెక్కడి పెట్టుబడిదార్లూ వచ్చి పెట్టుబడు కుమ్మరించి వస్తూత్పత్తి చేస్తే చవకగా యువనిపుణుల్ని అందిస్తామని దేశదేశాూ తిరిగి మన ప్రధానమంత్రి ఆహ్వానించి వస్తున్నాడు.
ఇక తొందరలో దేశంలో మూడవస్థానం, ఆ తర్వాత ప్రపంచంలో అగ్రస్థానం పొందే దిశగా ‘అభివృద్ధి’ తారకమంత్రంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని ముఖ్య మంత్రి వారానికో దేశం తిరిగి చెబుతున్నాడు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ప్రపంచాన్ని శాసించిన తొగు యువకు రాష్ట్రాన్ని ఃఖఅశీషశ్రీవసస్త్రవ నబపఃగా మార్చబోతున్నారని ఊరిస్తున్నాడు.

ఖాళీ బిందెలతో మంత్రి నారాయణను అడ్డుకున్న మహిళలు.

 

నెల్లూరు:సొంత జిల్లాలో మంత్రి నారాయణకు చుక్కెదురైంది. తెలుగు గంగ కాలువ నిర్మాణ పనుల పరిశీలకు వెళ్లిన నారాయణను నీటి బిందెలతో మహిళలు అడ్డుకున్నారు. పక్కనే స్వర్ణముఖి నది ఉన్నా తాగు నీటి సమస్య తీరలేదని నిరసన తెలిపారు. సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చే వరకు అడ్డుతొలగేది లేదని స్పష్టం చేశారు. జిల్లా అధికారులతో నారాయణ ఫోన్‌లో మాట్లాలో హామీ ఇవ్వడంతో మహిళలు తమ నిరసనను విరమించారు.

తలొంచిన బిజెపి సర్కార్

భూ చట్ట సవరణ బిల్లులో ప్రతిపాదించిన రైతు వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల సవరణలపై బిజెపి బెట్టువీడి దిగొచ్చింది. 'సమ్మతి', 'సామాజిక ప్రభావం అంచనా' వంటి కీలక సవరణలను ఉపసంహరించుకునేందుకు బిజెపి ఎట్టకేలకు అంగీకరించింది. ఈ బిల్లును పరిశీలించిన సంయుక్త పార్లమెంటరీ సంఘంలో వున్న 11 మంది బిజెపి సభ్యులు ఈ సవరణలను ఉపసంహరించుకుంటూ ఒక సవరణను ప్రతిపాదించారు. వివాదాస్పద సవరణలను ఉపసంహరించుకునేందుకు బిజెపి అంగీకరించటంతో ఎంపి ఎస్‌ఎస్‌ అహ్లువాలియా నేతృత్వంలోని ఈ కమిటీ తన ఏకగ్రీవ నివేదికను ఈ నెల 7న పార్లమెంట్‌కు సమర్పించేందుకు సిద్ధమవుతోంది.

భావ ప్రకటనపై దాడి:SFI

ఢిల్లీ యూనివర్సిటిలోని కిరోరి మాల్‌ కళా శాలలో 2013 ముజఫర్‌నగర్‌ అల్లర్లపై ప్రద ర్శితమవుతున్న డాక్యుమెంటరీని ఏబివిపి కార్యకర్తలు అడ్డుకోవడాన్ని ఎస్‌ఎఫ్‌ఐ ఢిల్లీ విభాగం తీవ్రంగా ఖండించింది. రాజకీయ ప్రాముఖ్యం ఉన్న ఇలాంటి సంఘటనలు విశ్వవిద్యాలయాల్లో పదేపదే పునరావృతం అవుతుండటాన్ని తప్పుపట్టింది. భావ వ్యక్తి కరణ స్వేచ్ఛకు అడ్డుపడే ఈ తరహా ఘటనలు జరగకుండా ఉండేందుకు అందరూ ఐక్యం కావాల్సిందిగా విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఇతర ప్రజా సంఘాలను కోరింది. 2013లో ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో తీవ్రమైన మత అల్లర్లు చెలరేగి 60మంది మృతిచెం దగా, దాదాపు 50వేల మంది ముస్లిములు బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయవలసి వచ్చిం ది.

ఆంధ్రకు ఎయిర్ బస్ ప్లాంటు

ఆంధ్రప్రదేశ్ కు మరో ప్రముఖ పరిశ్రమ రానుంది. విమానాలను తయారు చేస్తున్న ప్రముఖ సంస్థ ఎయిర్ బస్ అనంతపురంలో విమానాల తయారీ పరిశ్రమల కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం 49.18 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ, జీవో నం. 264ను జారీ చేసింది. ఇందులో భాగంగా జిల్లాలోని లేపాక్షి ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామ సమీపంలో స్థలం కేటాయించారు. ఎకరాకు రూ. 5 లక్షల చొప్పున ఎయిర్ బస్ చెల్లించనుంది. కాగా, ఈ స్థలానికి ఆనుకొని ఉన్న మరో 150 ఎకరాల స్థలాన్ని కూడా ఎయిర్ బస్ కోరుతోందని తెలుస్తోంది.

ఏపీలో 7న బంద్ కు పిలుపునిచ్చిన విద్యార్థిసంఘాల జేఏసీ`

 

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ పాటించాలని విద్యార్థి సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది.

Pages

Subscribe to RSS - 2015