తలొంచిన బిజెపి సర్కార్

భూ చట్ట సవరణ బిల్లులో ప్రతిపాదించిన రైతు వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల సవరణలపై బిజెపి బెట్టువీడి దిగొచ్చింది. 'సమ్మతి', 'సామాజిక ప్రభావం అంచనా' వంటి కీలక సవరణలను ఉపసంహరించుకునేందుకు బిజెపి ఎట్టకేలకు అంగీకరించింది. ఈ బిల్లును పరిశీలించిన సంయుక్త పార్లమెంటరీ సంఘంలో వున్న 11 మంది బిజెపి సభ్యులు ఈ సవరణలను ఉపసంహరించుకుంటూ ఒక సవరణను ప్రతిపాదించారు. వివాదాస్పద సవరణలను ఉపసంహరించుకునేందుకు బిజెపి అంగీకరించటంతో ఎంపి ఎస్‌ఎస్‌ అహ్లువాలియా నేతృత్వంలోని ఈ కమిటీ తన ఏకగ్రీవ నివేదికను ఈ నెల 7న పార్లమెంట్‌కు సమర్పించేందుకు సిద్ధమవుతోంది.