2015

సస్పెన్షన్‌పై రాజ్యసభలోరబస

 పార్లమెంటు వర్షాకాల సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే దిశలో నడుస్తున్నాయి. 25 మంది కాంగ్రెస్ సభ్యులపై వేటువేస్తూ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు మంగళవారం రాజ్యసభను పూర్తిగా స్తంభింపచేశారు. ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన సభ పనె్నండు గంటల సమయంలో ఆరు నిమిషాలసేపు వాయిదా అనంతరం సమావేశమై కేవలం మూడు నిమిషాల మాత్రమే జరిగి రెండు గంటలకు వాయిదాపడింది. రెండు గంటలకు తిరిగి సమావేశమై ఐదు నిమిషాల పాటు పెద్దపెట్టున జరిగిన కాంగ్రెస్ నినాదాలకు సాక్షిగా నిలిచింది. ఆ తర్వాత బుధవారానికి వాయిదా పడిపోయింది.

ద్రవ్యోల్బణం బయపెడుతోంది..

ప్రస్తుత పరిస్థితులలో ఆర్థిక వ్యవస్థలో సర్దుబాటు వైఖరిని నిర్వహించేందుకు వడ్డీరేట్ల కోతల జోలికి పోలేదని రాజన్‌ అన్నారు. గతంలో చేసిన వడ్డీకోతల ఫలితాలను బ్యాంకులు పూర్తిస్థాయిలో ప్రజలకు అందించకపోవడం, ఆహార ధరలు, అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీరేట్లను సాధారణీకీరణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని భవిష్యత్తులో వడ్డీరేట్లను తగ్గించనున్నట్లుగా ఆయన తెలిపారు. ఆహార, ఇంధన ధరలను మినహాయించిన ద్రవ్యోల్బణం మరింతగా బలపడుతుండడం చింతించాల్సి అంశాలుగా ఉన్నాయన్నారు.

లక్షల కోట్లుండి జైల్లోనా:SC

సహారా గ్రూపు ఛైర్మన్‌ సుబ్రతా రారుపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం  చేసింది. రూ.1,85,000 కోట్ల ఆస్తులు ఉంచుకుని, అందులో ఐదో వంతు చెల్లించి సమస్యల నుంచి బయట పడవచ్చుగా అని పేర్కొంది. జైల్లో ఉండాలనకుంటే నీ ఇష్టమని న్యాయమూర్తి టిఎస్‌ ఠాకూర్‌తో కూడిన ధర్మాసనం రారుకు సూచించింది. అనేక వ్యాపారాలు కలిగిన రారును జైల్లో ఉంచడం సరైంది కాదని ఆయన తరుపు న్యాయవాధి సీనియర్‌ అడ్వకేట్‌ కపిల్‌ సిబల్‌ కోర్టులో వాధించారు. అనేక వ్యాపార సంస్థలు అప్పులు పడి ఉన్నాయని, అలాంటి వాటిని ఆర్‌బిఐ, బ్యాంకులు ఐదు, పదేళ్ల పాటు పునరుద్దరిస్తున్నాయని పేర్కొన్నారు.

క్రీడాకార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ధర్నా

 

గుంటూరు: తుళ్లూరు క్రీడాకార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టింది. అసైన్డ్ భూయజమానులకూ పరిహారం చెల్లించాలని నినాదాలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది. వ్యవసాయ కార్మికులకు పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేత బాబూరావుతో పాలు పలువురిని అరెస్టు చేశారు.

ప్రశ్నిస్తానన్న పవన్ ఎక్కడ: భజరంగ్ మిల్ కార్మికులు..

 

గుంటూరు: ప్రశ్నించడం కోసమే వచ్చానన్న పవన్‌ ఇప్పుడు ఏం చేస్తున్నారని గుంటూరు భజరంగ్‌మిల్‌ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఉపాధి కల్పించాలంటూ గత రెండు నెలలుగా నిరసనలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాధానం చెప్పాల్సిన మిల్లు యాజమాన్యం ఆస్తులు అమ్ముకునే ఆలోచనలో పడిందని, స్పందించాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారంపై పవన్‌ కల్యాణ్‌ జోక్యం చేసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.

తుళ్లూరు క్రీడా కార్యాలయం సీపీఎం ఆందోళన....

 

గుంటూరు: తుళ్లూరు క్రీడాకార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టింది. అసైన్డ్ భూయజమానులకూ పరిహారం చెల్లించాలని నినాదాలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది. వ్యవసాయ కార్మికులకు పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేత బాబూరావుతో పాలు పలువురిని అరెస్టు చేశారు.

Pages

Subscribe to RSS - 2015