మన రాష్ట్రంలో 15లక్ష మంది గిరిజనులు ఉన్నారు. వీరు అందరికంటే అన్ని విధాలా వెనుకబడి ఉన్నారు. అక్షరాస్యతలో రాష్ట్రం సరాసరి 67శాతం కాగా, గిరిజను అక్షరాస్యత 40శాతమే. తలసరి ఆదాయంలో అట్టడుగు స్థానం వీరిదే. ప్రసవ సమయంలో మరణాు, శిశు మరణాల్లో మొదటి స్థానం వీరిదే. ఆహార భద్రత కరువు. మలేరియా, విష జ్వరాలతో చనిపోతున్న వారికి లెక్కేలేదు. రోడ్లు, వంతెను ఇతర మౌలిక సదుపాయాల్లో వెనుకబాటే. విద్యా సదుపాయాలు ముఖ్యంగా ఉన్నత విద్యా సదుపాయాలు దాదాపు లేవనే చెప్పాలి.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాు అనుసరిస్తున్న సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వల్ల దారుణంగా నష్టపోతున్నది గిరిజనులే.