రాష్ట్ర రాజధానిలో కుర్చీలాట

రాజధాని నిర్మాణ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గ్యాంబ్లింగ్‌ గేమ్‌ను తలపిస్తోంది. ప్రక్రియ మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకూ ఇద్దరు కీలక అధికారులను మార్చేసింది. ఒకరికి రాజధాని ఎంఓయుపై అవగాహన ఉంటే, మరొకరికి ఇప్పటి వరకూ జరిగిన ప్రక్రియపై అవగాహనుంది. వీరిలో ఒకరు దొండపాటి సాంబశివరావు కాగా, మరొకరు ఆర్మానే గిరిధర్‌. రాజధానిపై జరిగిన ఒప్పందాలు, జరుగుతున్న తీరుపై వీరికి పూర్తి అవగాహన ఉంది. వీరిద్దరినీ తొలగించడం ద్వారా రాజధాని నిర్మాణ ప్రక్రియపై ముఖ్య మంత్రికి, క్రిడా కమిషనర్‌కు తప్ప మరెవరికీ పూర్తిస్థాయి అవగాహన లేని పరిస్థితి ఏర్ప డింది.