2015

దేవగౌడ దీక్షకు ఏచూరి మద్దతు

భూ సేకరణ చట్ట సవరణ బిల్లు, రైతు ఆత్మహత్యలపై పార్లమెంటులో చర్చించాలని డిమాండ్‌ చేస్తూ మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడ ఢిల్లీలో నిరాహార దీక్షకు దిగారు. జంతర్‌ మంతర్‌ వద్ద జరుగుతున్న ధర్నాలో జెడిఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపిలతో పాటు సమాజ్‌వాదీ పార్టీ నాయకులు అతనికి మద్దతు నందించారు.. పార్లమెంటులో రైతు ఆత్మహత్యలపై సంపూర్ణమైన చర్చ జరిగేంతవరకు తమ దీక్ష కొనసాగుతుందని పార్టీవర్గాల సమాచారం. రైతు ఆత్మహత్యలపై కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌ సింగ్‌ వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయని, సున్నితమైన అంశంపై అతను చేసిన అనుచిత వ్యాఖ్యలు రైతులను కించపరిచేలా ఉన్నాయని దేవెగౌడ వ్యాఖ్యానించారు.

ఇకపై జపాన్ భాష కూడా..

రాష్ట్రంలోని మూడు విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వం జపాన్‌ భాషను ప్రవేశపెట్టింది. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర, గుంటూరులోని ఆచార్య నాగార్జున, విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయాలను దీనికోసం ఎంపిక చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే జపాన్‌ భాషపై విద్యార్థులకు బోధనా తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సుమితా దావ్రా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జపాన్‌ భాషపై బోధనా తరగతులను చేపట్టడానికి ఈ మూడు విశ్వవిద్యాలయాలకు అనుమతులను మంజూరు చేశారు. జపాన్‌ పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే.

లౌకిక ప్రభుత్వాలకు తగని పని

రెండు తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా విస్తృతంగా ప్రచారంలో ఉన్న గోదావరి పుష్కరాల శాస్త్రీయత, హేతుబద్ధతపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు దగ్గరుండి మరీ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపట్టడం విమర్శలకు దారి తీస్తోంది. లౌకికవాదానికి కట్టుబడి ఉండాల్సిన ప్రభుత్వాలు చాలా రోజుల ముందు నుంచే పుష్కరాలపై దృష్టి సారించాయి. కొద్దిరోజులుగా పుష్కరాలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తూ రోజువారీ కార్యక్రమాలను విస్మరించడం సహేతుకం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

' మన్‌ కీ బాత్‌ ' మహామాయ

 ప్రజలందరూ తనను దేశ ప్రధానిగా చేశారని, తనలోని సాధారణ మనిషి లక్షణాల వల్ల కొన్నిసార్లు ప్రజల్లో ఒక్కడై పోతానని ప్రధాని నరేంద్రమోడీ చెబుతున్నారు. 60 ఏళ్ళలో చేయలేని పనిని ఒక్క ఏడాదిలో పూర్తి చేస్తామనడానికి ఎంతో ధైర్యం కావాలని గత నెల 28న ఆకాశవాణి ద్వారా ప్రచారమయ్యే మన్‌ కీ బాత్‌ (మనసులో మాట) కార్యక్రమంలో అన్నారు. తనను తానే గొప్పవాడిగా పొగుడుకునే వారికి ఎవరైనా పోటీలు నిర్వహిస్తే ప్రపంచంలో మోడీకి ప్రథమ బహుమతి లభించవచ్చు. మనసులో మాట కార్యక్రమంలో మాట్లాడుతూ బేటీ బచావో, బేటీ పఢావో (బాలికను కాపాడండి, చదివించండి) అంటూ బాలికలను రక్షించడానికి ప్రచారం చేయలన్నారు.

'సాగు' సమస్యల సుడిగుండంలో కౌలు రైతులు

రాష్ట్రంలో ఖరీఫ్‌ వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతు న్నాయి. గత వ్యవసాయ లాభ నష్టా లు మరిచిపోయి ఎన్నో ఆశలతో 'సాగు' కదనరంగంలోకి దూకుతున్న 'సాగు' దారులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. రాష్ట్రంలో 20 లక్షల మంది కౌలు రైతులున్నారు. సాగు భూమిలో 70 శాతం పైగా వీరే సాగు చేస్తున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, తదితర జిల్లాల్లో వ్యవసాయరంగంలో కౌలు రైతులే ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. వారి సమస్యలను మాత్రం పాలకులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు.

ఉత్తి మాటలతో విద్యరాదు

రాజమండ్రిలో 2015 జులై 22న జరిగిన ప్రాంతీయ విద్యా సదస్సులో మీరు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాభివృద్ధికి పలు నిర్ణయాలు, ఆదేశాలు జారీ చేశారు. సంతోషం. రాష్ట్ర అభివృద్ధికి విద్యాభివృద్ధి ఎంతో కీలకం. నేడు మన రాష్ట్రంలో అక్షరాస్యత 67.41 శాతం మాత్రమే ఉంది. రాష్ట్ర సగటు కంటే ఆరు జిల్లాలు, దేశ సగటు అక్షరాస్యత (74.04 శాతం) కంటే 12 జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. విజయనగరం, కర్నూలు జిల్లాల్లో 60 శాతం కూడా లేదు. రాష్ట్రంలో 100 శాతం అక్షరాస్యత సాధించాలన్నారు. సుమారు 60 ఏళ్ళలో సాధించలేనిది నాలుగు సంవత్సరాలలో సాధించడం సాధ్యమా? దానికి తగిన ప్రణాళిక ఏది? నిధులు ఏవి?

ఒక తప్పును కప్పిపుచ్చడానికి...

 తప్పు జరిగినప్పుడు ఒప్పుకుంటే ఆ ఒక్క తప్పుకే పరిమితం కావొచ్చు. అదే తప్పును కప్పిపుచ్చుకోవాలనుకొంటే మాత్రం తప్పు మీద తప్పు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం మన రాష్ట్రప్రభుత్వం ఆ రెండవ పనిలో ఊపిరి సలపనంత బిజీగా ఉన్నట్లు కనిపిస్తున్నది. గోదావరి పుష్కరాల తొలిరోజున జరిగిన తొక్కిసలాటలో 27 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడానికి బాధ్యులు-అన్నీ తానై పుష్కర ఏర్పాట్లు చూసిన సిఎం, ఆయన మంత్రివర్గ అనుచరులు కాదట! వి.వి.ఐ.పిలు, వి.ఐ.పిల సేవలో తరిస్తూ ప్రజా భద్రతను, బాధ్యతను గాలికి వదిలిన అధికారులూ కాదట! పుష్కర ఘాట్‌లో వ్యాపించిన ఒకానొక వదంతి కారణంగా ఆ ఘోరం జరిగిందట.

బిసి సబ్‌ప్లాన్‌ ఎందుకు?

అన్ని స్థాయిల్లోని నిర్ణాయక స్థానాల్లో, ఆర్థిక రంగాన్ని శాసిస్తున్న అన్ని వ్యవస్థల్లో, సంపద, మౌలికరంగాలపై ఆధిపత్యంలో బిసిలు పూర్తిగా అధమస్థానంలోకి నెట్టబడ్డారు. ఇప్పటికీ ఉత్పాదకను అందిస్తూ అత్యధిక స్వయం ఉపాధితో దేశ అభివృద్ధికి బిసిలు తోడ్పడుతున్నారు. దానికి తోడు చట్టసభల్లో కేవలం 18 శాతం స్థానాలు, పాలనా వ్యవస్థ లోని పై స్థాయి ఉద్యోగుల్లో 8 శాతం, న్యాయశాఖలో 6 శాతం, దేశంలోని అతిపెద్ద వెయ్యి కంపెనీల్లోని నిర్వహణా బోర్డులలో 3 శాతం కన్నా తక్కువ భాగస్వామ్యానికి పరిమితమయ్యారు. 

కాలుదువ్వితే దీటైన జవాబిస్తాం

పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా దీనానగర్‌లో భీకర దాడికి పాల్పడి ఎస్పీ సహా ఏడుగురిని కాల్చిచంపడంపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రస్థాయిలో స్పందించారు. పాకిస్తాన్‌తో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని, అయితే భారతదేశ ప్రతిష్ఠను సవాలు చేస్తే పాక్‌కు గట్టిగా బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు. సిఆర్‌పిఎఫ్ 76వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు సోమవారం మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌కు వచ్చిన రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, పాక్‌తో భారత్ సత్సంబంధాలను కోరుకుంటున్నప్పటికీ ఇటువంటి సీమాంతర తీవ్రవాద ఘటనలు పదే పదే ఎందుకు కొనసాగుతున్నాయో అర్థం కావడం లేదన్నారు.

Pages

Subscribe to RSS - 2015