విద్యార్థులు, యువత తమలోని జ్ఞానాన్ని వెలికితీసి దేశాభివృద్ధికి తోడ్పడాలని రాజ్యసభ సభ్యుడు, బెనారస్ యూనివర్సిటీ చాన్సలర్, పద్మవిభూషణ్ కరణ్సింగ్ అన్నారు. ఆదివారం శామీర్పేటలోని బిట్స్ క్యాంపస్లో వైస్ చాన్సలర్ బిజేంద్రనాథ్ జైన్ ఆధ్వర్యంలో 4వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన కరణ్సింగ్ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. మన వేదాలు, ఉపనిషత్తుల్లో ఎంతో సమాచారం ఉందని, అందులో నుంచి జ్ఞానాన్ని వెలికితీయాలని.. ఇందుకు విద్యార్థులు, యువత చైతన్య స్ఫూర్తితో ముందడుగేయాలని కరణ్ సింగ్ పిలుపునిచ్చారు.