2015

కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తం

తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్‌ కార్మికులు శుక్రవారం చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు మూడున్నర వేల మంది కార్మికులను అరెస్టు చేశారు. పలుచోట్ల లాఠీఛార్జీలు జరిపారు. విజయవాడలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావుసహా పలువురు వామపక్ష నేతలు సొమ్మసిల్లి పడిపోయారు. పిఎం రాష్ట్ర కార్య దర్శి పి.మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామ కృష్ణ, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్‌, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబలేసు సహా వేలాది మందిని అరెస్టు చేశారు.

MPఅసదుద్దీన్‌పై క్రిమినల్‌కేసు..

రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న ఎంపీ అసదుద్దీన్‌పై క్రిమినల్‌ కే సు నమోదు చేయాలని వీహెచ్‌పీ నేత రామరాజు డిమాండ్‌ చేశారు. తెలుగు రాష్ర్టాల్లో పుష్కరాల పేరుతో రూ.11 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. పుష్కరాల్లో తెలుగు రాష్ర్టాలు ఖర్చు పెట్టిన నిధులతపై శ్వేత పత్రం విడుదల చేయాలని రామరాజు కోరారు.

ఏపీకి 2వేల కోట్ల నష్టం

అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమలైతే మరింత కష్టకాలం తప్పదు. తెలంగాణలో మందుబాబులకు తక్కువ ధరకే మద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు అక్కడి సర్కార్‌ కసరత్తు మొదలుపెట్టింది. ఈ విధానం అమల్లోకి వచ్చి.. సారా ప్యాకెట్ల(సాచెట్లు) తరహాలో చీప్‌లిక్కర్‌ మద్యం దుకాణాల్లోకి ప్రవేశిస్తే.. ఏపీ ఆదాయానికి భారీగా గండిపడే అవకాశాలున్నాయని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ ఆందోళన చెందుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఏపీకి చెందిన ప్రధానమైన ఐదు జిల్లాల్లో తెలంగాణ చీప్‌లిక్కర్‌ ఏరులై పారనుంది.

రైతు ఉసురు తీస్తున్న ఆధార్‌

ఆధార్‌ కార్డులు రైతుల ఉసురు తీస్తున్నాయి. రైతులకు అమలు చేస్తున్న అన్ని పథకాలకూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయం అన్నదాతలకు గుదిబండగా మారింది. రుణ మాఫీ మొదలుకొని విపత్తు సాయం వరకు ఏ లబ్ధి పొందాలన్నా ఆధార్‌నే అర్హత చేసింది సర్కారు. దీంతో అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ కేవలం ఆధార్‌ లేని కారణంగా లక్షలాది మంది రైతులు ప్రభుత్వ సాయానికి దూరవుతున్నారు. ఆధార్‌ లేని వారే కాకుండా సాంకేతిక కారణాలతో ఆధార్‌ నెంబర్‌ ఉన్నా సాఫ్ట్‌వేర్‌లో మ్యాచ్‌కాని వారు సైతం ప్రభుత్వ లబ్ధి పొందలేకపోతున్నారు.

పార్లమెంట్‌వద్ద తుపాకీశబ్దాలు

పార్లమెంటు దగ్గర తుపాకీ మోత కలకలం రేపింది. భారీగా తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.అయితే ఇది పార్లమెంటు వద్ద జరిగిన మాక్‌డ్రిల్‌ అని తెలిసింది. ఒకవైపు పంజాబ్‌లో గురుదాస్‌పూర్‌ జిల్లా దినానగర్‌లో ఉగ్రవాద దాడి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ఆందోళన కలిగించింది. ప్రస్తుతం దేశ సరిహద్దులతో పాటు ప్రముఖ నగరాలు, పట్టణాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు.

కలెక్టరేట్ల ముట్టడి..

తమ సమస్యలు పరిష్కరించాలంటూ పారిశుధ్య కార్మికులు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరశిస్తూ సీపీఎం నాయకులు మునిసిపల్ కార్మికులతో కలిసి విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. భారీగా వచ్చిన కార్యకర్తలు..కార్మికులతో కలెక్టర్ కార్యాలయం అట్టుడికింది. సీఎం డౌన్..తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించేంత వరకు తమ పోరాటం ఆపమని స్పష్టం చేశారు. దీనితో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. లోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను..కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది.

వేదాల్లో జ్ఞానాన్ని వెలికితీయండి

విద్యార్థులు, యువత తమలోని జ్ఞానాన్ని వెలికితీసి దేశాభివృద్ధికి తోడ్పడాలని రాజ్యసభ సభ్యుడు, బెనారస్‌ యూనివర్సిటీ చాన్సలర్‌, పద్మవిభూషణ్‌ కరణ్‌సింగ్‌ అన్నారు. ఆదివారం శామీర్‌పేటలోని బిట్స్‌ క్యాంపస్‌లో వైస్‌ చాన్సలర్‌ బిజేంద్రనాథ్‌ జైన్‌ ఆధ్వర్యంలో 4వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన కరణ్‌సింగ్‌ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. మన వేదాలు, ఉపనిషత్తుల్లో ఎంతో సమాచారం ఉందని, అందులో నుంచి జ్ఞానాన్ని వెలికితీయాలని.. ఇందుకు విద్యార్థులు, యువత చైతన్య స్ఫూర్తితో ముందడుగేయాలని కరణ్‌ సింగ్‌ పిలుపునిచ్చారు.

కులహత్యలపై సమగ్ర చట్టం:ఐద్వా

పరువు ప్రతిష్టల పేరుతో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కులదురహంకార హత్యలకు అడ్డుకట్ట వేసేందుకు సమగ్ర చట్టాన్ని రూపొం దించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఐద్వా ప్రతినిధి వర్గం కేంద్ర న్యాయశాఖమంత్రి సదానంద గౌడను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందచేసింది.ఐద్వా రూపొందించిన ముసాయిదా చట్టం ప్రకారం జిల్లా మేజిస్ట్రేట్‌/కలెక్టర్‌ కులపంచాయితీలపై నిషేధాజ్ఞలు విధించవచ్చని, యువజంట, వారి కుటుంబాల పరిరక్షణకు తగు చర్యలు తీసుకునేందుకు సుమోటోగా చర్యలు తీసుకోవచ్చని వివరించింది.

Pages

Subscribe to RSS - 2015