పార్లమెంట్‌వద్ద తుపాకీశబ్దాలు

పార్లమెంటు దగ్గర తుపాకీ మోత కలకలం రేపింది. భారీగా తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.అయితే ఇది పార్లమెంటు వద్ద జరిగిన మాక్‌డ్రిల్‌ అని తెలిసింది. ఒకవైపు పంజాబ్‌లో గురుదాస్‌పూర్‌ జిల్లా దినానగర్‌లో ఉగ్రవాద దాడి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ఆందోళన కలిగించింది. ప్రస్తుతం దేశ సరిహద్దులతో పాటు ప్రముఖ నగరాలు, పట్టణాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు.