2015

రష్యా అధ్యక్షుడితో మోదీ భేటి..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ రష్యా పర్యటనకు వెళుతున్నారు. బుధ,గురువారాల్లో ఆయన రష్యాలో పర్యటిస్తారు. బుధవారం ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో మోదీ మాస్కాలో సమావేశమవుతారు. ఈ సమావేశం అనంతరం రక్షణ, అణుశక్తికి సంబంధించి పలు ఒప్పందాలపై ఇరు దేశాల నేతలు సంతకాలు చేసే అవకాశముంది.

జువైనల్ చట్టసవరణ బిల్లు ఆమోదం

బాలల న్యాయ చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. నిర్భయ ఘటన జరిగిన మూడేళ్ల అనంతరం జువైనల్ చట్టాన్ని సవరించింది. బాలల న్యాయ చట్ట సవరణ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరిగింది. డిప్యూటి ఛైర్మన్ క్లాజుల వారీగా ఓటింగ్ ను నిర్వహించారు. ఓటింగ్ సమయంలో రాజ్యసభలోనే నిర్భయ తల్లిదండ్రులున్నారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపనందుకు నిరసనగా సభ నుండి సీపీఎం వాకౌట్ చేసింది. చట్టంలో సవరణలను ఎన్ సీపీ, సీపీఎం వ్యతిరేకించింది. చట్టం మరింత ప్రయోజనకరంగా ఉండాలని సీపీఎం పేర్కొంది...

బాక్సైట్‌పై కపటనాటకమాడుతున్న చంద్రబాబు..జి.వో.నెం. 97ను రద్దు చేయాలి. - సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం

ఈ రోజు శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ హాయాంలో విడుదలచేసిన జి.వో.నెం.289ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, ఎపిఎండిసికి 1212 హెక్టార్లు బాక్సైట్‌ తవ్వకాల అనుమతులకు సంబంధించిన జి.వో.నెం.97 రద్దుకు సమాదానం చెప్పకుండా దాటివేశారు. దీనిని సిపియం పార్టీ విశాఖ జిల్లా కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. గిరిజనుల మనోభావాలను తెలుసుకొని ముందుకు వెళ్తామన్న చంద్రబాబు గిరిజన సలహా మండలి ఏర్పాటుపై పెదవి విప్పలేదు. దీనిని బట్టి బాక్సైట్‌ తవ్వకాల పట్ల చంద్రబాబు ప్రభుత్వం కపటనాటకాలాడుతుందని అర్ధమౌతుంది.

జాబు కోసం బాబుతో పోరాటమే మార్గం..

వంద అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలనేది పాత సామెత.. వెయ్యి అబద్ధాలాడైనా అధికారంలోకి రావాలనేది కొత్త సామెత.. దీనికి నిదర్శనంగా చంద్రబాబు ప్రభుత్వం నిలుస్తోంది. ఎన్నికలకు ముందు టిడిపి మేనిఫెస్టోలలో ఇష్టమొచ్చినట్లు ప్రజలకు, యువతకు హామీలిచ్చేసి... నన్ను నమ్మండి...! నేను మారాను...!! అని అధికారంలోకొచ్చారు బాబు. దేశాభివృద్ధికి వెన్నెముకగా ఉన్న యువత భవిష్యత్‌ గురించి అస్సలు ఆలోచించడం లేదు. ''జాబు రావాలంటే - బాబు రావాలనే'' నినాదాన్ని తన పేటేంటుగా ప్రచారం చేసుకున్నారు. నిరుద్యోగులిప్పుడు జాబు అడుగుతుంటే... గుంటూరు జిల్లా సభలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే తన పార్టీ కార్యకర్తలతో....

KCR చండీయాగంపై తమ్మినేని ఫైర్

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహిస్తున్న అయుత చండీయాగం లౌకిక రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.. యాగం ఖర్చులపై సీఎం కేసీఆర్‌ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.  మూఢ విశ్వాసాలను పెంచే విధంగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, ఆర్థిక..సామాజిక సమస్యలపై దృష్టి మళ్లించకుండా మూఢ విశ్వాసాల చుట్టూ దృష్టి మళ్లించడం కోసం ప్రయత్నాలు చేస్తుంటారని తెలిపారు. 

చంద్రబాబుపై కేసు పెడతాం:మధు

కాల్‌మనీ వ్యాపారులలో సిపిఎం నాయకుడున్నట్లు సిఎం చంద్రబాబు అసెంబ్లీలో చేసిన ప్రకటనను ఆధారాలతో నిరూపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండు చేశారు. నిరూపించలేకుంటే ఈనెల 25వ తేదీలోగా తప్పుడు ప్రకటనను ఉపసంహరించుకోవాలన్నారు. లేకుంటే సిఎం చంద్రబాబుపై ఛీటింగ్‌, సభా హక్కుల ఉల్లంఘన కేసులతో పాటు పరువు నష్టం కేసు దాఖలు చేస్తానని హెచ్చరించారు. 

సంఘ్ శక్తులకు పోలీసుల తోడు..

రాజస్థాన్‌లోని సీకర్‌ జిల్లాలో భారత విద్యార్థి ఫెడరేషన్‌(SFI) నేతలపై ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ శక్తులు విరుచుకుపడ్డాయి. జనవరిలో నిర్వహించనున్న అఖిలభారత మహాసభలకు అడ్డంకులు సృష్టించడమే లక్ష్యంగా భయోత్పాతం సృష్టించాయి. ఈ దాడిలో సీకర్‌ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సుభాష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన తలకు 25 కుట్లుపడ్డాయి. అయితే సంఫ్‌ు శక్తులకు పోలీసులు తోడయ్యారు. ఫీజులు తగ్గించాలని అడగడమే నేరమైనట్టు.. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అడగడమే తప్పయినట్టు.. సీపీఐ(ఎం) కార్యాలయంలోకి చొరబడి మరీ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను సోమవారం చితకబాదారు. 

జైట్లీని ఇరికించిన స్వపక్షనేత

బీహార్‌కు చెందిన మాజీ క్రికెటర్‌, ప్రస్తుత బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్‌ సొంత పార్టీకే షాక్‌ ఇచ్చారు. ఢిల్లీ క్రికెట్‌ ఆసోసియేషన్‌లో అవినీతికి సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఆదేశాలను బేఖాతరు చేస్తూ కీర్తి ఆజాద్‌ ప్రెస్ మీట్‌ పెట్టి మరీ అక్రమాల గురించి వివరించారు.డీడీసీఏ పలు కాంట్రాక్టులను టెండర్లు పిలవకుండానే నకిలీ కంపెనీలకు కట్టబట్టిందని ఆరోపించారు. అంతేకాదు ఈ వ్యవహారంపై ఈడీ, డైరక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌తో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు.

రాముడి కోసం రాళ్ల తరలింపట..!

రామమందిర నిర్మాణం కోసం హిందూత్వ శక్తులు చురుగ్గా కదులుతున్నాయి. వివాదం ఇంకా సుప్రీంకోర్టు విచారణలో ఉంది కాబట్టి ఇక్కడ నిర్మాణ పనుల్ని చేపట్టడం చట్టవిరుద్ధమైనప్పటికీ అవి తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా, గత ఆదివారం నాడు ఇక్కడి కార్‌సేవక్‌పురంకు 20 టన్నుల రాళ్లను తరలించారు. రాజస్థాన్‌ నుంచి రెండు ట్రక్కుల్లో ఈ రాళ్లను తీసుకొచ్చారు. అంతే కాకుండా, వీహెచ్‌పీ 'శిలాపూజ' కూడా నిర్వహించిందని సోమవారం వార్తలు వెలువడ్డాయి.

RSSపై ఆరు బుక్లెట్స్ విడుదల..

కేంద్రంలో నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు(ఆర్‌ఎస్‌ఎస్‌) చేస్తున్న అరాచకాలపై సీపీఐ(ఎం) ఆరు బుక్‌లెట్లు విడుదల చేసింది. 'ఇండియాకు వ్యతిరేకంగా ఆర్‌ఎస్‌ఎస్‌' పేర.. జాతీయోద్యమంలో ఆ సంఘం వహించిన పాత్రతో మొదలు దేశంలో ఇటీవల చోటుచేసుకున్న బీఫ్‌ రాజకీయాల వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాద వైఖరులను ఈ బుక్‌లెట్లలో ఎండగట్టారు. 

Pages

Subscribe to RSS - 2015