చంద్రబాబుపై కేసు పెడతాం:మధు

కాల్‌మనీ వ్యాపారులలో సిపిఎం నాయకుడున్నట్లు సిఎం చంద్రబాబు అసెంబ్లీలో చేసిన ప్రకటనను ఆధారాలతో నిరూపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండు చేశారు. నిరూపించలేకుంటే ఈనెల 25వ తేదీలోగా తప్పుడు ప్రకటనను ఉపసంహరించుకోవాలన్నారు. లేకుంటే సిఎం చంద్రబాబుపై ఛీటింగ్‌, సభా హక్కుల ఉల్లంఘన కేసులతో పాటు పరువు నష్టం కేసు దాఖలు చేస్తానని హెచ్చరించారు.