రాముడి కోసం రాళ్ల తరలింపట..!

రామమందిర నిర్మాణం కోసం హిందూత్వ శక్తులు చురుగ్గా కదులుతున్నాయి. వివాదం ఇంకా సుప్రీంకోర్టు విచారణలో ఉంది కాబట్టి ఇక్కడ నిర్మాణ పనుల్ని చేపట్టడం చట్టవిరుద్ధమైనప్పటికీ అవి తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా, గత ఆదివారం నాడు ఇక్కడి కార్‌సేవక్‌పురంకు 20 టన్నుల రాళ్లను తరలించారు. రాజస్థాన్‌ నుంచి రెండు ట్రక్కుల్లో ఈ రాళ్లను తీసుకొచ్చారు. అంతే కాకుండా, వీహెచ్‌పీ 'శిలాపూజ' కూడా నిర్వహించిందని సోమవారం వార్తలు వెలువడ్డాయి.